S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుజరాత్ కొత్త సిఎంగా విజయ్ రూపాని

సూరత్: గుజరాత్ కొత్త సిఎంగా గుజరాత్ బిజెపి చీఫ్ విజయ్ రూపాని శుక్రవారం ఎంపికయ్యారు. విజయ్ రూపాని పేరును బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తదితర సీనియర్ నేతలు ఖరారు చేశారు.డిప్యూటీ సిఎంగా నితిన్ పటేల్‌ను ఎంపిక చేశారు. ఆనందిబెన్ పటేల్ రాజీనామాతో కొత్త సిఎం ఎంపిక అనివార్యమైంది.

ఎస్సీ వర్గీకరణ చర్చా వేదికలో ఉద్రిక్తత

హైదరాబాద్: ఎస్సీ వర్గీకరణపై నగరంలో శుక్రవారం జరిగిన చర్చా వేదికలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. బషీర్‌బాగ్‌లోని పిజి లా కాలేజీలో చర్చావేదిక ప్రారంభం కాగానే మాల సంక్షేమ సంఘం కార్యకర్తలు తెలంగాణ జెఎసి కన్వీనర్ ప్రొఫెసర్ కోదండరామ్‌ను నిలదీశారు. చర్చావేదికను వ్యతిరేకిస్తున్న వీరు నిర్వాహకులతో గొడవ పడ్డారు. ఈ నేపథ్యంలో ప్రొఫెసర్ గాలి వినోద్‌కుమార్ తలకు గాయం కాగా వెంటనే ఆయనను ఆస్పత్రికి తరలించారు. సమాచారం తెలిశాక పోలీసులు అక్కడికి చేరుకోగానే మాల సంక్షేమ సంఘం ప్రతినిధులు పరారయ్యారు. చర్చావేదికలో ఇలా ఘర్షణ వాతావరణాన్ని సృష్టించడం మంచిది కాదని ప్రొఫెసర్ కోదండరామ్, ప్రజాగాయకుడు గద్దర్ అన్నారు.

‘ఇండియాస్‌ డాటర్‌’ పై నిషేధాన్ని ఎత్తివేయలేం : దిల్లీ హైకోర్టు

దిల్లీ: దిల్లీలో 2012లో జరిగిన నిర్భయ ఘటనపై బీబీసీ ఫిల్మ్‌మేకర్‌ లెస్లీ ఉడ్విన్‌ రూపొందించిన ‘ఇండియాస్‌ డాటర్‌’ అనే డాక్యుమెంటరీపై నిషేధాన్ని ఎత్తివేయలేమని దిల్లీ హైకోర్టు శుక్రవారం స్పష్టంచేసింది. నిర్భయ సులో శిక్ష పడిన దోషుల్లో ఒకరి వాంగ్మూలాన్ని లెస్లీ ఉడ్విన్‌ చిత్రీకరించారు. ఈ డాక్యుమెంటరీని భారత్‌లో ప్రసారం కాకుండా ట్రయల్‌ కోర్టు నిషేధించింది. ఈ డాక్యుమెంటరీపై నిషేధాన్ని ఎత్తివేయాలని కోరుతూ ముగ్గురు యువ న్యాయవాదులు దిల్లీ హైకోర్టులో పిటిషన్‌ వేశారు. అంతర్జాలంలో ఈ డాక్యుమెంటరీ అందుబాటులో ఉన్నప్పుడు నిషేధం విధించడంలో ప్రయోజనం ఏమిటని కోర్టు గతంలో ప్రశ్నించింది.

శ్రీశైలం ప్రాజెక్టుకు జలకళ

శ్రీశైలం: భారీగా వరదనీరు వస్తుండటంతో శ్రీశైలం ప్రాజెక్టు జలకళను సంతరించుకుంటోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుతం 835 అడుగులకు నీటిమట్టం చేరుకుంది. జలాశయంలోకి ప్రస్తుతం 2,61,212 క్యూసెక్కుల నీరు వస్తుండగా, 16,732 క్యూసెక్కుల నీటిని కిందికి విడుదల చేస్తున్నారు.
శ్రీశైలం ప్రాజెక్టు నుంచి నాగార్జునసాగర్‌కు 16,732 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది.

లోక్‌సభకు కేవీపీ ప్రైవేటు బిల్లు

దిల్లీ: ఎపికి ప్రత్యేక హోదా కోరుతూ కాంగ్రెస్ ఎంపీ కెవిపి రామచంద్రరావు రాజ్యసభలో ప్రవేశపెట్టిన బిల్లును లోక్‌సభ స్పీకర్‌కు పంపుతామని రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ కురియన్ శుక్రవారం ప్రకటించారు. ప్రైవేటు బిల్లుపై ఓటింగ్‌కు సిద్ధంగా ఉందని, ఇప్పుడు మళ్లీ చర్చించలేమని చెప్పారు. మనీ బిల్లు అవునా? కాదా? నిర్ణయించే అధికారం రాజ్యాంగం ప్రకారం రాజ్యసభకు లేదన్నారు. ప్రైవేటు బిల్లు మనీ బిల్లు అవునా? కాదా? అని లోక్‌సభ స్పీకర్ తేలుస్తారని చెప్పారు. దీనిపై కాంగ్రెస్‌ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేస్తూ సభలో ఆందోళనకు దిగారు. కాంగ్రెస్ సభ్యుల ఆందోళనతో సభలో గందరగోళ పరిస్థితి నెలకొంది.

ప్రత్యేక హోదాకు వారంలో పరిష్కారం!

ఢిల్లీ: ప్రత్యేకహోదాకు వచ్చే వారం పరిష్కారం రావచ్చనికేంద్ర మంత్రి సుజనాచౌదరి తెలిపారు . ఆర్థికమంత్రితో చంద్రబాబు చర్చించారని, ప్రధాని మోదీ అన్ని శాఖల నుంచి సమాచారం తెప్పించుకుంటున్నారని వెల్లడించారు. రాజ్యసభలో కేవీపీ ప్రైవేట్ బిల్లును ద్రవ్య బిల్లుగా చెప్పడం బాధాకరమని అన్నారు. కాంగ్రెస్, వైసీపీకి చిత్తశుద్ధి లేకనే ఏపీకి ఇన్ని కష్టాలు వచ్చాయని విమర్శించారు.

పారిస్‌లో రహదారిపై కూలిన కార్గో విమానం

పారిస్‌ : డీహెచ్‌ఎల్‌ సంస్థకు చెందిన కార్గో విమానం శుక్రవారం ఉదయం పారిస్‌ ఎయిర్‌పోర్ట్‌ నుంచి బయల్దేరి బెర్గామో విమానాశ్రయంలో ల్యాండ్‌ అవ్వాల్సి ఉండగా రన్‌వేకి సమీపంలో ఉన్న రహదారిపై కూలిపోయింది. పైలట్‌, కో-పైలట్‌లు ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. పారిస్‌లోని మిలాన్‌ ప్రాంతంలో రోడ్డుపై విమానం కూలిపోవడంతో రెండున్నర గంటల పాటు ఆ ప్రాంతాన్ని మూసివేశారు

ఇంటికి చేరుకున్న కమల్‌హాసన్‌

చెన్నై: నటుడు కమల్‌హాసన్‌ శుక్రవారం ఉదయం ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ అయి ఇంటికి చేరుకున్నారు. జులై 14న కాలి ఎముక విరగగా ఆయన ఆస్పత్రిలో చేరిన సంగతి తెలిసిందే. ఆళ్వార్‌పేట్‌లోని ఆయన ఇంటి ముందు అభిమానులు బాణాసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. పూర్తిగా కోలుకున్న వెంటనే ‘శభాష్‌ నాయుడు’ సినిమా షూటింగ్‌ కొనసాగిస్తారు.

భారీ లాభాలతో ముగిసిన మార్కెట్లు

ముంబయి: స్టాక్‌ మార్కెట్లు శుక్రవారం భారీ లాభాలతో ముగిశాయి. ఉదయం నుంచి మంచి జోరు మీదున్న మార్కెట్లు భారీ లాభాలతో ముగిశాయి. డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 66.78 వద్ద కొనసాగుతోంది. సెన్సెక్స్‌ 369 పాయింట్లు లాభపడి 28078 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 132 పాయింట్లు లాభపడి 8683 పాయింట్లకు చేరుకుంది.

ద్రవ్యబిల్లుపై రాజ్యసభలో ఓటింగ్ కుదరదు: జైట్లీ

దిల్లీ: ఎపికి ప్రత్యేక హోదా కోరుతూ కాంగ్రెస్ ఎంపీ కెవిపి రామచంద్రరావు రాజ్యసభలో ప్రవేశపెట్టిన బిల్లు ఆర్థిక బిల్లు అని లోక్‌సభ కార్యదర్శి స్పష్టం చేశారని, ద్రవ్యబిల్లుపై ఓటింగ్ జరిపే సంప్రదాయం రాజ్యసభలో లేదని కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ శుక్రవారం స్పష్టం చేశారు. కొన్ని అంశాలపై రాజ్యసభలో నేరుగా చట్టం చేసే అవకాశం లేదన్నారు. ఆయన రాజ్యసభలో ఈ విషయాన్ని ప్రకటిస్తూనే, ఎపికి విభజన సమయంలో అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ ఇచ్చిన హామీలను తమ ప్రభుత్వం నెరవేరుస్తుందన్నారు. ఆ హామీలను ఎలా తీర్చాలన్న విషయమై చర్చలు జరుపుతున్నామన్నారు. ఎపి అభివృద్ధికి అవసరమైన అన్ని చర్యలూ తీసుకుంటామన్నారు.

Pages