S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘హోదా’పై త్వరలోనే మోదీ నిర్ణయం: చంద్రబాబు

దిల్లీ: ఎపికి ప్రత్యేక హోదా విషయంలో తొందరలోనే నిర్ణయం తీసుకుంటామని ప్రధాని మోదీ తనకు చెప్పినట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు శుక్రవారం ఇక్కడ మీడియాకు వివరించారు. ఈరోజు పార్లమెంటులోని ప్రధాని కార్యాలయంలో మోదీని ఆయన కలిసి కృష్ణా పుష్కరాలకు రావాల్సిందిగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎపికి ప్రత్యేక హోదా విషయాన్ని ప్రధాని వద్ద సిఎం ప్రస్తావించారు. ప్రజల భావోద్వేగాలతో కూడుకున్నందున ఈ విషయమై సముచిత నిర్ణయం తీసుకోవాలని తాను విజ్ఞప్తి చేయగా ప్రధాని సానుకూలంగా స్పందించారని బాబు చెప్పారు.

గోదావరికి పెరిగిన వరద ఉధృతి

రాజమహేంద్రవరం: రాజమహేంద్రవరంలోని ధవళేశ్వరం బ్యారేజీ వద్ద నీటి మట్టం 10 అడుగులకు పెరిగింది. దీంతో ఇరిగేషన్ అధికారులు 175 గేట్లను స్వల్పంగా ఎత్తి 4లక్షల47వేల క్యూసెక్కుల నీటిని సముద్రంలో విడుదల చేస్తున్నారు. ఎగువన కురుస్తున్న వర్షాలతో గోదావరికి వరద ఉధృతి పెరిగింది.

ట్రంప్‌ను దాటేసిన హిల్లరీ

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్ష బరిలో డెమోక్రటిక్‌ పార్టీ అభ్యర్థి హిల్లరీకి రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌ కంటే 15 శాతం మద్దతు అధికంగా ఉన్నట్లు తెలిపింది. హిల్లరీకి 48 శాతం మంది ఓటర్ల మద్దతు ఉండగా, ట్రంప్‌కు కేవలం 33 శాతం మంది ఓటర్లు మద్దతు ఉన్నట్లు మెక్‌క్లాచీ-మారిస్ట్‌ పోల్‌ సర్వే స్పష్టం చేసింది. తాజా సర్వేలో ట్రంప్‌ మద్దతు మరింతగా పడిపోయింది. వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌/ఎన్‌బీసీ నిర్వహించిన మరో ఒపీనియన్‌ పోల్‌లో హిల్లరీ ట్రంప్‌ కంటే 9 పాయింట్ల ఆధిక్యంలో ఉన్నారు. వాల్‌స్ట్రీట్‌ పోల్‌ సర్వేలో ట్రంప్‌ కంటే ఐదు పాయింట్ల ఆధిక్యంలో హిల్లరీ నిలిచారు.

వీరప్పన్ పూజించిన గుడికి తాళాలు..!

చెన్నై: తమిళనాడు, కర్నాటక ప్రభుత్వాలను ఒకప్పుడు గడగడలాడించిన ఎర్రచందనం స్మగ్లర్ వీరప్పన్ బతికి ఉన్నపుడు ఆయన తరచూ పూజించే ఆలయానికి అధికారులు ఇపుడు తాళాలు వేశారు. సేలం జిల్లా మేట్టూరు సమీపంలోని మారియమ్మన్ ఆలయంలో అమ్మవారిని పూజించి ఏదైనా కార్యక్రమాన్ని ప్రారంభించడం వీరప్పన్‌కు అలవాటు. అతని కారణంగా ఆ ఆలయం రెండు రాష్ట్రాల్లో ప్రాచుర్యం పొందింది. గత మంగళవారం ఆ ఆలయంలో ఉత్సవాలు నిర్వహించారు. అయితే, మరోసారి ఉత్సవాలు జరపాలని మరోవర్గం వారు అభ్యంతరం లేవదీశారు. దీంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. అధికారులు రంగప్రవేశం చేసి ఉద్రిక్తతలను నివారించేందుకు ఆలయానికి తాళాలు వేశారు.

హైకోర్టు డివిజన్ బెంచ్‌కు టి.సర్కార్ అప్పీలు

హైదరాబాద్: భూసేకరణకు సంబంధించి ఇచ్చిన 123 జీవోను హైకోర్టులోని సింగిల్ జడ్డి కొట్టివేయడంతో డివిజన్ బెంచ్‌కు అప్పీలు చేయాలని తెలంగాణ సర్కారు నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వ అడ్వకేట్ జనరల్ దాఖలు చేసిన అప్పీలును డివిజన్ బెంచ్ ఈరోజు విచారణకు స్వీకరించింది.

సావిత్రి నదిలో 14 మృతదేహాలు లభ్యం

ముంబయి: పురాతన వంతెన కూలిపోయి రెండు బస్సులు సహా పలు వాహనాలు సావిత్రి నదిలో పడిపోయిన రెండు రోజులకు 14 మృతదేహాలు లభించాయి. గల్లంతైన వారి కోసం నదిలో ఇంకా గాలింపుచర్యలు కొనసాగుతున్నాయి. ముంబయి- గోవా రహదారిపై మహద్ వద్ద సావిత్రి నదిపై పురాతన వంతెన కూలిపోగా పలు వాహనాలు కొట్టుకుపోయి దాదాపు 50 మంది ప్రయాణీకులు గల్లంతయ్యారు. సావిత్రి నదీ తీరానికి మృతదేహాలు కొట్టుకువస్తే సమాచారం ఇవ్వాలని పలు గ్రామాల ప్రజలకు రాయగఢ్ జిల్లా కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. ఎన్‌డిఆర్‌ఎఫ్ దళాలు గాలింపు చర్యల్లో పాల్గొంటున్నాయి.

స్పీకర్, కేంద్రమంత్రులకు బాబు ఆహ్వానం

దిల్లీ: దిల్లీ పర్యటనలో ఉన్న ఎపి సిఎం చంద్రబాబు ఈరోజు ఉదయం కేంద్రమంత్రులు అనంత్‌కుమార్, ప్రకాష్ జవదేకర్, లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్‌లను కలిశారు. కృష్ణా పుష్కరాలకు రావాల్సిందిగా వారిని ఆయన ఆహ్వానించారు. కాసేపట్లో ప్రధాని మోదీని చంద్రబాబు కలిసి పుష్కరాలకు ఆహ్వానిస్తారు. ఇదే సందర్భంగా ఎపికి ప్రత్యేక హోదా, కేంద్రం నిధులు, పోలవరం ప్రాజెక్టు, రాజధాని నిర్మాణం వంటి అంశాలను ఆయన మోదీతో ప్రస్తావించే అవకాశం ఉంది.

టౌన్ ప్లానింగ్ అధికారి ఆస్తులపై ఎసిబి సోదాలు

హైదరాబాద్: జిహెచ్‌ఎంసిలో ఖైరతాబాద్ సర్కిల్‌లో టౌన్ ప్లానింగ్ అధికారి సంతోష్‌కు చెందిన ఇళ్లపై శుక్రవారం ఉదయం ఎసిబి అధికారులు ఏకకాలంలో దాడులు ప్రారంభించారు. ఇంతవరకూ కోటి రూపాయలకు పైగా అక్రమాస్తులను గుర్తించి సోదాలు కొనసాగిస్తున్నారు. డిడి కాలనీ, అల్వాల్, గుడిమల్కాపూర్, నారాయణగూడ తదితర ప్రాంతాల్లో సంతోష్‌కు స్థిరాస్తులున్నట్లు గుర్తించారు.

ఏపీ సచివాలయ ఉద్యోగులకు వీడ్కోలు విందు

హైదరాబాద్ : . ఏపీ సచివాలయం ఉద్యోగులు వెలగపూడికి తరలివెళ్తూ ఉండటంతో వారికి వీడ్కోలు విందు ఇవ్వాలని తెలంగాణ సచివాలయం ఉద్యోగులు సిద్ధమవుతున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఇరురాష్ట్రాల సీఎస్‌లు, అతిథులుగా ఉన్నతాధికారులు, అధికారులు హాజరుకానున్నారు. సచివాలయంలోని బతుకమ్మ ప్రాంగణంలో ఏపీ ఉద్యోగులకు ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేశారు.

ఆన్‌లైన్‌లో శ్రీవారి సేవా టికెట్లు

తిరుమల:ఇకపై 90 రోజులు ముందుగానే శ్రీవారి సేవా టికెట్లను అందజేయనున్నట్లు, ఆన్‌లైన్‌లో సేవా టికెట్లు అందుబాటులో ఉంచనున్నట్లు టీటీడీ ఈవో సాంబశివరావు శుక్రవారం ఉదయం తెలిపారు. నమూనా ఆలయంలో ఉదయం7 నుంచి 9వరకు భక్తులకు అనుమతి ఇస్తున్నామన్నారు. రాగి డాలర్లను నమూనా ఆలయం వద్ద విక్రయిస్తామని చెప్పారు. 40కోట్లతో బర్డ్‌ ఆస్పత్రిని అభివృద్ధి చేయనున్నట్లు ఈవో ప్రకటించారు.

Pages