స్మార్ట్ ఎయు
Published Friday, 5 August 2016జగదాంబ, ఆగస్టు 4: ఆంధ్రవిశ్వవిద్యాలయాన్ని స్మార్ట్ క్యాంపస్గా తీర్చిదిద్దుతున్నామని ఎయు ఉప కులపతి ఆచార్య గొల్లపల్లి నాగేశ్వరరావు అన్నారు. గురువారం సాయంత్రం ఎయు వైవిఎస్ మూర్తి ఆడిటోరియంలో నిర్వహించిన ‘యుఎస్ డెలిగేషన్ ఆన్ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఐటి ట్రెండ్స్’ సదస్సును ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇన్నోవేషన్, ఇంక్యుబేషన్, స్టార్టప్ ప్రాజెక్ట్స్ నిర్వహణ దిశగా పని చేస్తున్నామన్నారు. డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటుకు నోడల్ వ్యవస్థగా ఎయు నిలుస్తుందన్నారు. వైఫై, ఇంటర్నెట్ వంటి వసతులతో ఎయు స్మార్ట్ క్యాంపస్ దిశగా నడుస్తోందన్నారు.