S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణలో పసుపు బోర్డు

న్యూఢిల్లీ, ఆగస్టు4: తెలంగాణలో పసుపుబోర్డు ఏర్పాటుకు కేంద్రం సానుకూలంగా ఉందని టిఆర్‌ఎస్ ఎంపీ కవిత వెల్లడించారు. గురువారం పార్లమెంట్‌లో ప్రధాని నరేంద్రమోదీని ఆమె కలిశారు. తరువాత మీడియాతో మాట్లాడుతూ పసుపుబోర్డు కోసం ఎంతోకాలంగా రైతులు డిమాండ్ చేస్తున్నారని అన్నారు. దీనిపై తాను ఇంతకు ముందే కేంద్ర వాణిజ్య మంత్రి నిర్మలా సీతారామన్, అలాగే ఉన్నతాధికారులతోనూ పలు దఫాలుగా చర్చించినట్టు కవిత వెల్లడించారు. ఇందులో భాగంగానే ప్రధాని మోదీను కలిసినట్టు ఆమె చెప్పారు. ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటనను స్వాగతిస్తున్నట్టు ఎంపీ తెలిపారు.

హోదా కోసం దీక్ష చేయండి

ప్రత్తిపాడు, ఆగస్టు 4: ఆంధ్రప్రదేశ్ సమస్యగా మారిన ప్రత్యేక హోదాపై కేంద్రానికి వ్యతిరేకంగా ఆమరణ దీక్ష చేయడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు లోకేశ్ సిద్ధం కావాలని మాజీ మంత్రి, కాపు రిజర్వేషన్ ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభం సవాల్ చేశారు. ఆమరణ దీక్షకు సిద్ధపడితే వారితోపాటుగా వారి ఇంట్లో దీక్షకు చోటు కల్పిస్తే తాను కూడా దీక్షలో కూర్చుంటానన్నారు. ఎవరెన్ని రోజులు దీక్ష చేయగలరో పరీక్షకు నిలబడాలని ఆయన కోరారు. ఈ దీక్షను సవాల్‌గా స్వీకరించడం వల్ల ప్రత్యేక హోదాతోపాటు శరీరాల పటుత్వం, పట్టుదల, చిత్తశుద్ధి ప్రజలకు తెలుసుకునే అవకాశం ఉంటుందని ఆయన లేఖలో పేర్కొన్నారు.

మోదీ- కెసిఆర్ కొత్త స్నేహం

హైదరాబాద్, ఆగస్టు 4: తెలంగాణ ఆవిర్భావం తరువాత తొలిసారిగా ప్రధానమంత్రి హోదాలో నరేంద్ర మోదీ ఈనెల ఏడవ తేదీన రాష్ట్రంలో పర్యటించనున్నారు. ఆగస్టు 7 ప్రపంచ స్నేహితుల దినోత్సవం. అదే రోజు ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు గజ్వేల్‌లో జరిగే కార్యక్రమాల్లో పాల్గొనడం విశేషం. తెలంగాణ ఏర్పడిన తరువాత మోదీ ఇప్పటి వరకు తెలంగాణలో అడుగు పెట్టలేదని పలు సందర్భాల్లో టిఆర్‌ఎస్ విమర్శలు చేస్తూ వచ్చింది. జిహెచ్‌ఎంసి ఎన్నికల్లో బిజెపిపై ప్రధానంగా ఈ అంశంపైనే విమర్శలు చేసింది.

మరో ఇద్దరు అరెస్ట్

హైదరాబాద్, ఆగస్టు 4: ఎమ్సెట్-2 ప్రశ్నపత్రం లీకేజి కేసులో సిఐడి మరో ఇద్దరు నిందితులను అరెస్టు చేసింది. దీంతో ఈ కేసులో మొత్తం ఎనిమిది మంది అరెస్టయ్యారు. మెదక్ జిల్లా జోగిపేటకు చెందిన గుడిపల్లి చంద్రశేఖర్ రెడ్డి (37) హైదరాబాద్ మోతినగర్‌కు చెందిన షేక్ షాకీరా (29)ను సిఐడి అధికారులు హైదరాబాద్‌లో అరెస్టు చేశారు. వీరు అరుగురు విద్యార్థులను కోల్‌కతా తీసుకెళ్లి ప్రశ్నపత్రం అందజేసినట్టు సిఐడి గుర్తించింది. చంద్రశేఖర్ రెడ్డి నలుగురు విద్యార్థులను, షాకీరా ఇద్దరు విద్యార్థులతోపాటు మరో ముగ్గురు బ్రోకర్లు గత నెల 7న కోల్‌కతా వెళ్లారు.

కాళేశ్వరం, మల్లన్న సాగర్ సమస్యలపై వివరిస్తాం..సమయమివ్వండి

న్యూఢిల్లీ,ఆగస్టు 4: కాళేశ్వరం, మల్లన్న సాగర్ ప్రాజెక్టు బాధితుల సమస్యలు వివరించేందుకు తమకు అపాయింట్‌మెంట్ ఇవ్వాలని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాశారు. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ అసెంబ్లీ నియోజకవర్గంలో అభివృద్ది పథకాలను ప్రారంభించేందకు నరేంద్ర మోదీ తెలంగాణకు వెళుతున్న విషయం తెలిసిందే. కాళేశ్వరం, మల్లన్న సాగర్ బాధిత రైతులు, ప్రజల సమస్యలు వివరించేందుకు గజ్వేల్ పర్యటన సందర్భంగా తమకు సమయం కేటాయించాలని లక్ష్మయ్య ప్రధానిని కోరారు.

ఏపి కొత్త సచివాలయానికి మరో ముగ్గురు మంత్రులు

గుంటూరు, ఆగస్టు 4: ఆంధ్రప్రదేశ్ సచివాలయానికి మరో మూడు కీలక విభాగాలను తరలించారు. ఇప్పటి వరకు ఐదు ప్రభుత్వ శాఖల కార్యాలయాలు ఏర్పాటయ్యాయి. గురువారం రెండో బ్లాక్ గ్రౌండ్ ఫ్లోర్‌లో పురపాలకశాఖ మంత్రి పి నారాయణ, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ముఖ్య కార్యదర్శి ఎంపి కన్నబాబు, ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప, హోంశాఖ ముఖ్యకార్యదర్శి అనూరాధ తమ చాంబర్లను ప్రారంభించారు. మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, రావెల కిషోర్‌బాబు హాజరయ్యారు. కాగా ఐదో బ్లాక్ ఫస్ట్ ఫ్లోర్‌లో రవాణాశాఖ మంత్రి శిద్దా రాఘవరావు తన పేషీని లాంఛనంగా ప్రారంభించారు.

పుష్కర స్నానం.. పరమం పవిత్రం

గుంటూరు, ఆగస్టు 4: పుష్కర స్నానం.. ఓ పవిత్రమైనదిగా ప్రజలు భావించాలని విశ్వగురు పీఠాధిపతి విశ్వయోగి విశ్వంజీ ఉద్ఘాటించారు. కృష్ణా పుష్కరాలను పురస్కరించుకుని ప్రముఖ గాయకుడు గజల్ శ్రీనివాస్ ఆలపించిన కృష్ణా పుష్కర స్వాగత గీతం సీడీని గురువారం గుంటూరు బృందావన్ గార్డెన్స్‌లోని వేంకటేశ్వరస్వామి ఆలయంలో గురూజీ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా భక్తుల నుద్దేశించి అనుగ్రహ భాషణం చేశారు.

కోస్తాకు వర్ష సూచన

విశాఖపట్నం, ఆగస్టు 4: వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం స్థిరంగా అక్కడే కొనసాగుతోందని విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు గురువారం రాత్రి తెలిపారు. ఉత్తర ఒడిశా నుంచి దక్షిణ తమిళనాడు వరకూ కోస్తాంధ్ర మీదుగా ఉపరితల ఆవర్తనం కూడా కొనసాగుతోంది. దీని ప్రభావంతో రానున్న 24 గంటల్లో పలు చోట్ల వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపారు. ఒకటి, రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. పశ్చిమ దిశగా గంటకు 45 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తెలిపారు.

హైకోర్టు విభజనకు ప్రత్యేక కమిటీ?

న్యూఢిల్లీ, ఆగస్టు 4: అత్యంత వివాదాస్పదంగా మారిన రాష్ట్ర హైకోర్టు విభజన కోసం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసే ప్రతిపాదన పరిశీలనలో ఉందా? చంద్రబాబు నాయుడు గురువారం సాయంత్రం సుప్రీం కోర్టు చీఫ్ జస్టీస్ ఠాకూర్‌ను కలిసి కృష్టా పుష్కరాల ఆహ్వానం అందజేసినప్పుడు హైకోర్టు విభజన అంశం చర్చకు వచ్చినట్టు తెలిసింది. తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర హైకోర్టును వీలున్నత త్వరగా విభజించాలని చేస్తున్న డిమాండ్ గురించి ప్రస్తావిస్తూ కమిటీ ఏర్పాటు ప్రతిపాదన వీరి మధ్య చర్చకు వచ్చినట్టు తెలుస్తోంది. అయితే, ఏపీ హైకోర్టును కొత్త రాజధానిలోనే ఏర్పాటు చేయాలని చంద్ర బాబు సూచించారని అంటున్నారు.

ఇరిగేషన్‌కు ఇస్రో సేవలు

హైదరాబాద్, ఆగస్టు 4: తెలంగాణ జల వనరుల సమాచార వ్యవస్థ ఏర్పాటుకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వానికి, ఇస్రోకు మధ్య అవగాహనా ఒప్పందం రేపు కుదురనుంది. ఆరవ తేదీన ఉదయం 8.30కి మంత్రి హరీశ్‌రావు, ఇస్రో చైర్మన్ కిరణ్‌కుమార్‌ల సమక్షంలో ఎంఓయు కుదురుతుంది. జలవనరుల సమాచారాన్ని ఎప్పటికప్పుడు నమోదు చేసి ఉపగ్రహ చిత్రాలతో నీటి నిల్వలు, ఇతర అంశాలను విశే్లషించనున్న తొలి రాష్ట్రంగా తెలంగాణ రికార్డు సృష్టించనుందని ఇస్రో సైంటిఫిక్ సెక్రటరీ పిజి దివాకర్ ప్రకటించారు. ఇకపై తెలంగాణలో చెరువులు, కుంటలు, రిజర్వాయర్లు, ఇతర జలాశయాల పరిస్థితిని ఎప్పటికప్పుడు ఉపగ్రహంతో సమీక్షించి విశే్లషించే విధానం అమల్లోకి రానున్నది.

Pages