విద్యార్థులు అమూల్యమైన సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి
Published Friday, 5 August 2016మేడ్చల్, ఆగస్టు 4: విద్యార్థులు కాలక్షేపం పేరుతో అమూల్యమైన సమయాన్ని వృధా చేయసుకోకుండా దానిని సద్వినియోగం చేసుకోని ఉన్నతంగా రాణించాలని ఎంఆర్ఇసి కళాశాల చైర్మన్, మల్కాజ్గిరి ఎంపి చామకూర మల్లారెడ్డి సూచించారు. మండలంలోని మైసమ్మగూడ గ్రామంలోని మల్లారెడ్డి ఇంజనీరింగ్ కళాశాల ప్రాంగణంలో గురువారం మొదటి సంవత్సరం ఇంజనీరింగ్ విద్యార్థుల ఓరియంటేషన్ కార్యక్రమంలో ఎంపి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. రెండు పర్యాయాలు ఎన్బిఎ, నాక్ గుర్తింపు పొందిన కళాశాల విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించడంలో ఎక్కడ రాజీపడే ప్రసక్తేలేదన్నారు.