మోసగించడం చంద్రబాబుకు అలవాటు
Published Saturday, 18 June 2016జంగారెడ్డిగూడెం, జూన్ 17: మోసాలు చేయడం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు అలవాటైపోయిందని మాజీ ఎమ్మెల్యే, వైఎస్ఆర్సిపి గిరిజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు తెల్లం బాలరాజు విమర్శించారు. స్థానిక 2వ వార్డులో కాపు సంఘాల ఆధ్వర్యంలో చేపట్టిన రిలే దీక్షలు శుక్రవారం నాలుగోరోజుకు చేరాయి. ఈ దీక్షలను పిసిసి అధికార ప్రతినిధి జెట్టి గురునాధరావుతో కలసి బాలరాజు ప్రారంభించారు. ఈ సందర్భంగా బాలరాజు మాట్లాడుతూ అధికారం కోసం అబద్ధాలతో ప్రజలను మోసం చేసాడని, అధికారంలోకి వచ్చిన తరువాత ఆడిన అబద్ధాలు సైతం మరచి పోయాడని, ఇది చంద్రబాబుకు అలవాటేనని అన్నారు. అదే పద్ధతిలో ఇప్పుడు కాపులను మోసం చేసాడని విమర్శించారు.