టిఆర్ఎస్లో ఓటమి భయం
Published Sunday, 15 May 2016ఖమ్మం, మే 14: పాలేరు ఉప ఎన్నికల్లో టిఆర్ఎస్కు ఓటమి భయం పట్టుకుందని, ప్రజా విశ్వాసం కోల్పోయిన తుమ్మల ధనం, అధికార బల ప్రయోగానికి పాల్పడుతున్నారని ఏఐసిసి అధికార ప్రతినిధి మధుయాష్కి ఆరోపించారు. శనివారం కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ భర్త మరణించడంతో అదే స్థానానికి పోటీ చేస్తున్న ఒక మహిళను ఓడించేందుకు రాష్ట్ర ప్రభుత్వం మొత్తం రంగంలోకి దిగడంతోనే కాంగ్రెస్ గెలుపు ఖాయమైందని స్పష్టం చేశారు. తాను గెలవకుంటే అభివృద్ధి ఆగిపోతుందని బెదిరిస్తున్న తుమ్మల నాగేశ్వరరావు మంత్రి పదవికి రాజీనామా ఎందుకు చేయలేదని ప్రశ్నించారు.