గుంటూరు యాత్రికులు కేదార్నాధ్లో క్షేమం
Published Saturday, 14 May 2016గుంటూరు : కేదార్నాథ్లో చిక్కుకుపోయిన గుంటూరు యాత్రికులు క్షేమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. కొండచరియలు విరిగిపడడంతో అక్కడి యాత్రికులను హెలికాప్టర్లలో తరలించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి కంభంపాటి రామ్మోహన్ రావు ఉత్తరాఖండ్ అధికారులతో మాట్లాడి తెలుగువారిని హెలికాప్టర్ల ద్వారా తరలించాలని విజ్ఞప్తి చేశారు.