ఊపందుకోనున్న సాగర్ ప్రక్షాళన
Published Sunday, 1 May 2016హైదరాబాద్, ఏప్రిల్ 30: గణేష్ విగ్రహాల నిమజ్జనం హుస్సేన్సాగర్లో జరుగుతుందా? లేదా అన్న అనుమానానికి తెర పడింది. సాగర్ కలుషితం, చెరువులో గణేష్ విగ్రహాల నిమజ్జనంపై జిహెచ్ఎంసి అధికారులు ప్రత్యేక కార్యచరణను సిద్దం చేయాలని ఆదేశిస్తూ, శాస్ర్తియంగా నిమజ్జనం జరగాలని సూచించటంతో అధికారులు ఆ దిశగా చర్యలు చేపడుతున్నారు. కానీ హుస్సేన్సాగర్తో పాటు గణేష్ విగ్రహాల నిమజ్జనం ఎక్కడికక్కడే వికేంద్రీకరణగా జరిపేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఇందుకు గాను గ్రేటర్లోని మరో తొమ్మిది చెరువుల్లో కూడా ప్రత్యేక పాండ్లను ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు ప్రారంభమయ్యాయి.