మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాలల్లో విద్యార్థులను చేర్పించాలి: కలెక్టర్
Published Sunday, 1 May 2016హైదరాబాద్, ఏప్రిల్ 30: మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాలల్లో విద్యార్థులను చేర్పించేందుకు వీలుగా ఆయా వర్గాలను చైతన్యపరిచేందుకు ఉద్దేశించిన ప్రచార వాహనాన్ని హైదరాబాద్ జిల్లా కలెక్టర్ రాహుల్ బొజ్జా శనివారం కలెక్టరేట్లో లాంఛనంగా జెండా వూపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాంఘిక సంక్షేమ రెసిడెన్షిల్ పాఠశాలల్లో మంచి ఫలితాలు వచ్చాయని, అదేరకమైన వాతావరణాన్ని సదుపాయాలను మైనార్టీ విద్యార్థులకు కూడా అందచేసి విద్యాపరంగా వారికి మంచి భవిష్యత్తును కల్పించాలన్నది ప్రభుత్వ లక్ష్యమని ఇందుకు అనుగుణణంగా ఇటీవలనె రాష్టవ్య్రాప్తంగా 68 గురుకుల పాఠశాలలను నెలకొల్పాలని నిశ్చయించిందన్నారు.