S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

02/23/2020 - 01:55

కోల్‌కతా, ఫిబ్రవరి 22: కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న భారత మాజీ ఫుట్‌బాలర్ అశోక్ చటర్జీ శనివారం ఇక్కడ మృతి చెందారు. మెర్డెకా కప్ చాంపియన్‌షిప్‌లో 1965, 1066 సంవత్సరాల్లో కాంస్య పతకాలను సాధించిన భారత జట్టులో ఆయన సభ్యుడు. 78 ఏళ్ల అశోక్ చటర్జీకి భార్య, కుమారుడు ఉన్నారు.

02/23/2020 - 01:52

ఢాకా, ఫిబ్రవరి 22: కెప్టెన్ క్రెగ్ ఎర్విన్ సెంచరీతో రాణించడంతో, బంగ్లాదేశ్‌తో శనివారం ప్రారంభమైన ఏకైక టెస్టు మ్యాచ్ మొదటి రోజు ఆట ముగిసే సమయానికి జింబాబ్వే తన తొలి ఇన్నింగ్స్‌లో ఆరు వికెట్లకు 228 పరుగులు చేసింది. కేవలం ఏడు పరుగులకే తొలి వికెట్‌ను కెవిన్ కసుజా (2) రూపంలో చేజార్చుకున్న జింబాబ్వేకు ఓపెనర్ ప్రిన్స్ ఏ మాస్వార్‌తో కలిసి కెప్టెన్ ఎర్విన్ అండగా నిలిచాడు.

02/23/2020 - 01:51

పెర్త్, ఫిబ్రవరి 22: మహిళల టీ-20 ప్రపంచ కప్ చాంపియన్‌షిప్‌లో భాగంగా శనివారం థాయలాండ్‌ను ఢీకొన్న వెస్టిండీస్ జట్టు 7 వికెట్ల తేడాతో సునాయాస విజయాన్ని సాధించింది. మొట్టమొదటి సారి టీ-20 ఇంటర్నేషనల్ ఆడిన థాయలాండ్ తొలుత బ్యాటింగ్‌కు దిగి, 20 ఓవర్లలో 9 వికెట్లకు 78 పరుగులు చేసింది. నన్నపట్ కొన్చరోనెర్కాయ్ 33 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా, నురెమోల్ చైవాయ్ 13 పరుగులు చేసింది.

02/23/2020 - 05:29

కొలంబో: ఓపెనర్, వికెట్‌కీపర్ షాయ్ హోప్ అద్భుత సెంచరీ వెస్టిండీస్‌ను ఆదుకోలేకపోయింది. ఓపెనర్లు రాణించడంతో, తొలి వనే్డలో శ్రీలంక తన లక్ష్యాన్ని తొమ్మిది వికెట్ల నష్టంతో చేరుకొని, ఒక వికెట్ తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన వెస్టిండీస్ 50 ఓవర్లలో ఏడు వికెట్లకు 289 పరుగులు సాధించింది. హోప్ 140 బంతులు ఎదుర్కొని, పది ఫోర్లంతో 115 పరుగులు చేశాడు.

02/23/2020 - 01:50

జొహానె్నస్‌బర్గ్, ఫిబ్రవరి 22: దక్షిణాఫ్రికాతో శనివారం జరిగిన మొదటి టీ-20లో ఆస్ట్రేలియా ఏకంగా 107 పరుగుల తేడాతో ఘన విజయాన్ని నమోదు చేసింది. మొదట బ్యాటింగ్ చేసిన ఈ జట్టు 20 ఓవర్ల లో ఆరు వికెట్లకు 196 పరుగులు సాధించింది. కెప్టెన్ ఆరోన్ ఫించ్ 42, మాజీ కెప్టెన్ స్టీవెన్ స్మిత్ 45 పరుగులతో రాణించారు.

02/21/2020 - 01:55

సిడ్నీ: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ఆధ్వర్యంలో జరిగే మహిళల టీ-20 ప్రపంచ కప్ చాంపియన్‌షిప్ పోటీలకు సర్వం సిద్ధమైంది. శుక్రవారం జరిగే తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియాతో భారత్ జట్టు ఢీ కొంటుంది. మొత్తం పది జట్లు ఈ మెగా ఈవెంట్‌లో టైటిల్ కోసం పోటీపడుతున్నాయి.

02/20/2020 - 23:20

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 20: మహిళల టీ-20 ప్రపంచ కప్ చాంపియన్‌షిప్‌లో భారత జట్టు ప్రత్యర్థులకు గట్టిపోటీనిస్తుందని స్టార్ క్రికెటర్ మిథాలీ రాజ్ ధీమా వ్యక్తం చేసింది. శుక్రవారం జరిగే తొలి మ్యాచ్‌లో భారత్‌పై డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియాదే పైచేయి కావచ్చని గురువారం పీటీఐతో మాట్లాడుతూ జోస్యం చెప్పింది.

02/20/2020 - 23:18

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 20: ఆసియా రెజ్లింగ్ చాంపియన్‌షిప్స్‌లో భారత యువ సంచలన రెజ్లర్ దివ్య కక్రాన్ స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకొని చరిత్ర సృష్టించింది. ఈ పోటీల్లో టైటిల్ సాధించిన రెండో భారతీయురాలిగా గుర్తింపు సంపాదించింది. కాగా, మరో ఇద్దరు భారత మహిళా రెజ్లర్లు, పింకీ, సరితా మోర్ స్వర్ణ పతకాలను గెల్చుకోగా, నిర్మలా దేవి రజత పతకంతో సంతృప్తి చెందింది.

02/20/2020 - 23:08

చికాగో, ఫిబ్రవరి 20: మహిళా బాస్కెట్‌బాల్ స్టార్ స్ట్ఫోనీ డాల్సన్ డబ్ల్యూఎన్‌బీఏలో తాను ప్రాతినిథ్యం వహిస్తున్న స్కై క్లబ్‌కు గుడ్‌బై చెప్పిం ది. ఇటీవలే ఆమె చికాగోలో జరిగే టోర్నీకి ఎన్‌బీఏ ఆల్‌స్టార్ జట్టుకు ఎంపికైంది. అంతేగాక, యూఎస్‌ఏ బాస్కెట్ బాల్ 3 ఆన్ 3 క్వాలిఫయింగ్ జట్టులోనూ ఆమె సభ్యురాలు.

02/20/2020 - 23:06

కటక్‌లో జరుగుతున్న రంజీ ట్రోఫీ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో ఎల్‌బీ అప్పీల్ చేస్తున్న ఒడిశా క్రికెటర్లు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌కు దిగిన బెంగాల్ మొదటి రోజు ఆట ముగిసే సమయానికి తన తొలి ఇన్నింగ్స్‌లో 6 వికెట్లకు 308 పరుగులు చేసింది. కాగా, గోవాతో తలపడుతున్న గుజరాత్ తొలి రోజు ఆటలో, 90 ఓవర్లలో నాలుగు వికెట్లు చేజార్చుకొని 330 పరుగులు చేసింది.

Pages