-
మాడ్రిడ్, మార్చి 22: కరోనా మహమ్మారి ప్రపంచ క్రీడా రంగాన్ని అస్తవ్యస్తం చేస్తు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
క్రీడాభూమి
ఫిలడేల్ఫియా, జూన్ 10: కోపా అమెరికా ఫుట్బాల్ టోర్నమెంట్లో జోస్ సాలమన్ రాన్డన్ చేసిన గోల్తో వెనెజులా క్వార్టర్ ఫైనల్స్ చేరుకోగా ఉరుగ్వే టోర్నీ నుంచి నిష్క్రమించింది. అత్యంత కీలకంగా మారిన మ్యాచ్లో వెనెజులాను ఢీకొన్న ఉరుగ్వే 0-1 తేడాతో పరాజయాన్ని ఎదుర్కొంది.
లూయిస్విల్లే, జూన్ 10: వేలాది మంది అభిమానులు తరలిరాగా, లూయిస్విల్లేలో ‘బాక్సింగ్ లెజెండ్’ మహమ్మద్ అలీ భౌతిక కాయానికి అంత్యక్రియలు పూర్తయ్యాయి. పార్కిన్సన్స్ వ్యాధితో బాధపడుతున్న ప్రపంచ హెవీవెయిట్ బాక్సింగ్ మాజీ చాంపియన్ అలీ ఈనెల మూడో తేదీన మృతి చెందగా, అతని స్వస్థలమైన లూయిస్విల్లేలో అంత్యక్రియలను నిర్వహించారు. అలీకి వేలాది మంది కన్నీటి వీడ్కోలు పలికారు.
లండన్, జూన్ 10: ఛాంపియన్స్ ట్రోఫీ హాకీ టోర్నమెంట్లో భారత జట్టు శుభారంభం చేసే అవకాశాన్ని చేతులారా విడిచిపెట్టింది. లండన్ ఒలింపిక్స్ స్వర్ణ పతక విజేత జర్మనీతో గురువారం జరిగిన తొలి మ్యాచ్లో ఆధిక్యాన్ని సంపాదించినప్పటికీ, దానిని నిలబెట్టుకోలేక, డ్రాతో సంతృప్తి చెందింది. ఇరు జట్లు చెరి మూడు గోల్స్ సాధించాయ.
న్యూఢిల్లీ, జూన్ 10: రియో ఒలింపిక్స్లో పాల్గొనే అవకాశాన్ని దక్కించుకోవడానికి తెలుగువాడైన సాకేత్ మైనేనీ ఒక అడుగు దూరంలో ఉన్నాడు. తనకు డబుల్స్ భాగస్వామిగా లియాండర్ పేస్ కాకుండా సాకేత్ ఉండాలని రోహన్ బొపన్న ప్రకటించడం ఆసక్తికరమైన పరిణామం. అఖిల భారత టెన్నిస్ సంఘం (ఎఐటిఎ) శనివారం సమావేశమై, బొపన్నకు భాగస్వామిగా ఎవరు ఉంటారన్నది నిర్ణయిస్తుంది.
ఫ్రాన్స్ : ఫుట్బాల్ మ్యాచ్ లో ఇంగ్లాండ్ ఓడిపోవడంతో అభిమానులు రెచ్చిపోయారు. రష్యా అభిమానులతో గొడవకు దిగారు. యూరో ఫుట్బాల్ చాంపియన్ షిప్లో భాగంగా ఇంగ్లండ్, రష్యాల మధ్య మ్యాచ్ జరిగింది. ఇంగ్లాండ్ అభిమానులు ఫర్నిచర్ను ధ్వంసం చేశారు.
ముంబయి, జూన్ 9: నాలుగు దేశాలతో జరిగే 13 టెస్టు మ్యాచ్లకు ఆరు కొత్త కేంద్రాలను భారత క్రికెట్ నియంత్రణ బోర్డు ఖరారు చేసింది. ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న హిమాచల్ ప్రదేశ్లోని ధర్మశాల, ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం టెస్టు హోదాను సంతరించుకోనున్నాయి. గురువారం ఇక్కడి బోర్డు కార్యాలయంలో జరిగిన టూర్ ప్రోగామ్స్, ఫిక్స్చర్స్ కమిటీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
తిరువనంతపురం, జూన్ 9: కేరళ క్రీడా శాఖ మంత్రి జయరాజన్ తనను కించ పరుస్తూ అనుచిత వ్యాఖ్యలు చేశారని మాజీ ఒలింపియన్ అంజూ బి జార్జి ఆరోపించింది.
పారిస్, జూన్ 9: మినీ సాకర్ వరల్డ్ కప్గా పిలిచే యూరోపియన్ చాంపియన్షిప్ శుక్రవారం నుంచి ప్రారంభం కానుంది. యూరో ‘2016’లో జరిగే తొలి మ్యాచ్లో ఫ్రాన్స్, రుమేనియా జట్లు ఢీ కొంటాయి. మొట్టమొదటిసారి ఈ టోర్నీలో 24 జట్లు పాల్గొంటున్నాయి. 1998లో జరిగిన వరల్డ్ కప్ టోర్నీకి ఫ్రాన్స్ ఆతిథ్యం ఇవ్వగా, ఆ జట్టును దిడియర్ డెస్చాంప్స్ విజయపథంలో నడిపించాడు.
సిడ్నీ, జూన్ 9: ఈ ఏడాది ఆగస్టులో జరిగే రియో ఒలింపిక్స్లో పాల్గొననున్న భారత స్టార్ షట్లర్లు సైనా నెహ్వాల్, కిడాంబి శ్రీకాంత్ ఇక్కడ జరుగుతున్న ఆస్ట్రేలియా ఓపెన్ బాడ్మింటన్లో క్వార్టర్ ఫైనల్స్ చేరారు. లండన్ ఒలింపిక్స్లో కాంస్య పతకాన్ని కైవసం చేసుకున్న హైదరాబాదీ సైనా 21-12, 21-14 తేడాతో మలేసియా క్రీడాకారిణి జిన్ వెయ్ గోను ఓడించి క్వార్టర్ ఫైనల్స్లో అడుగుపెట్టింది.
లండన్, జూన్ 9: బ్రెజిల్కు చెందిన ‘లెజెండరీ సాకర్ ఐకాన్’ పీలే 1970లో సాధించిన వరల్డ్ కప్ ట్రోఫీకి ఇక్కడ జరిగిన వేలంలో 5,70,000 డాలర్లు (సుమారు 3.8 కోట్ల రూపాయలు) లభించాయి. 1970 మెక్సికో వరల్డ్ కప్లో బ్రెజిల్ విజయభేరి మోగించింది. ఆ జట్టులో సభ్యుడైన పీలే మిగతా ఆటగాళ్లతోపాటు వరల్డ్ కప్ నమూనా ట్రోఫీని అందుకున్నాడు.