S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

03/24/2017 - 03:30

హైదరాబాద్, మార్చి 23: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో కొత్త హైకోర్టు భవనాల నిర్మాణంపై అమరావతి రాజధాని ప్రాంత సంస్థ కమిషనర్ ఆధ్వర్యంలో అధికారుల బృందం ఉమ్మడి హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిని కలిసింది. సిఆర్‌డిఏ కమిషనర్ చెరుకూరి శ్రీ్ధర్, అదనపు కమిషనర్ రామ్మోహన్‌తో పాటు భవన డిజైనర్లు చీఫ్ జస్టిస్ రమేష్ రంగనాథంను కలిశారు. కొత్త హైకోర్టు భవనాల డిజైన్ గురించి తెలియచేశారు.

03/24/2017 - 02:04

హైదరాబాద్, మార్చి 23: దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ పారిశ్రామిక ప్రగతి ఉందని మిగిలిన రాష్ట్రాలు తెలంగాణను నమూనాగా తీసుకుంటున్నాయని పరిశ్రమలు, ఐటిసి మంత్రి కె తారకరామారావు పేర్కొన్నారు. గురువారం వివిధ పద్దులపై శాసనసభలో జరిగిన చర్చకు మంత్రి బదులిస్తూ, ఇక రాష్ట్రంలో ‘టి ప్రైమ్’ పేరిట కొత్త పథకాన్ని అమలుచేస్తామని వెల్లడించారు.

03/24/2017 - 02:03

హైదరాబాద్, మార్చి 23: తెలంగాణ రాష్ట్రప్రభుత్వం 15 మంది సీనియర్ ఐపిఎస్ అధికారులను బదిలీ చేస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ రాష్ట్ర పోలీసు రిక్రూట్‌మెంట్ బోర్డు చైర్మన్ జె పూర్ణ చంద్రరావును అవినీతి నిరోధక శాఖ అదనపు డైరెక్టర్ జనరల్‌గా బదిలీ చేశారు. అయితే రిక్రూట్‌మెంట్ బోర్డు చైర్మన్‌గా పూర్తిస్థాయి అదనపు బాధ్యతలను నిర్వర్తిస్తారు.

03/24/2017 - 02:01

హైదరాబాద్, మార్చి 23: రాష్ట్రంలోని గుర్తింపు పొందిన జూనియర్ కాలేజీల్లో వచ్చే విద్యాసంవత్సరం (2017-18) నుండి ఆన్‌లైన్‌లోనే అడ్మిషన్లు నిర్వహిస్తామని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి చెప్పారు. 16,392 టీచర్ పోస్టుల త్వరలోనే భర్తీ చేస్తామని ప్రకటించారు. ఇందులో 7600 పోస్టులు గురుకులాల కోసం,మరో 8792 ప్రభుత్వ పాఠశాలల కోసం భర్తీ చేస్తామని అన్నారు.

03/24/2017 - 01:56

గుంటూరు, మార్చి 23:అగ్రిగోల్డ్ ఆస్తులపై గురువారం విపక్ష నేత జగన్‌కూ, మంత్రి ప్రత్తిపాటికీ మధ్య వాగ్వాదం జరిగింది. అగ్రిగోల్డ్ భూములను మంత్రి భార్య కొన్నారని జగన్ ఆరోపించగా, నిరూపిస్తే పదవికి రాజీనామా చేస్తానని ప్రత్తిపాటి సవాల్ చేశారు.

03/24/2017 - 01:53

విజయవాడ, మార్చి 23:రాష్ట్ర ప్రభుత్వం కొత్త అబ్కారీ విధానాన్ని ప్రకటించింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు జాతీయ రహదారికి 500 మీటర్ల దూరం లోపు ఉన్న దుకాణాలకు ఏప్రిల్ 1 నుంచి లైసెన్సు తేదీ అమల్లోకి రానుంది. జాతీయ రహదారికి 500 మీటర్ల పరిధిలో 3,150 దుకాణాలు ఉన్నట్లు అబ్కారీ శాఖ అధికారులు గుర్తించారు. అందులో 1,300 దుకాణాలను ఇతర ప్రాంతాలకు తరలించేందుకు ఆయా దుకాణాల యజమానులు ముందుకు వచ్చారు.

03/24/2017 - 01:51

గుంటూరు, మార్చి 23: అగ్రిగోల్డు ఆస్తులపై గురువారం శాసనసభలో దుమారం చెలరేగింది. అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య వాడివేడిగా చర్చ జరిగింది. బాధితులకు న్యాయం.. ఆస్తుల వేలం.. అక్రమ కొనుగోళ్ల వ్యవహారంపై ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ధ్వజమెత్తారు. దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్రంగా స్పందించారు. అగ్రిగోల్డు బాగోతం గత పదేళ్ల క్రితం నుంచి ఉందన్నారు.

03/24/2017 - 03:33

హైదరాబాద్, మార్చి 23: భారత్- బంగ్లాదేశ్ మ్యాచ్ సందర్భంగా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ నాలుగు రోజులకు అల్పాహారం, భోజనం నిమిత్తం రూ. 75.78 లక్షలు ఖర్చు పెట్టడాన్ని హైకోర్టు తప్పుబట్టింది. ఈ మ్యాచ్ సందర్భంగా ఉప్పల్ స్టేడియం కెపాసిటీలో 25 శాతం కాంప్లిమెంటరీ పాస్‌లు ఇవ్వడాన్ని కూడా హైకోర్టు తప్పుబట్టింది.

03/24/2017 - 01:08

హైదరాబాద్, (రాజేంద్రనగర్), మార్చి 23: గ్రామీణ ప్రాంతాల సుస్థిర అభివృద్ధి పంచాయతీ వ్యవస్థతోనే ముడిపడి ఉందని కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ సహాయ మంత్రి వై సుజనాచౌదరి అన్నారు. గురువారం రాజేంద్రనగర్‌లోని జాతీయ గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ (ఎన్‌ఐఆర్డీ)లో గ్రామీణ నవకల్పనల అంకుర సంస్థల రెండు రోజుల సదస్సు ప్రారంభోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు.

03/23/2017 - 09:04

నిజామాబాద్, మార్చి 22: దాదాపు ఆరు దశాబ్దాలకుపైగా సుదీర్ఘ నిరీక్షణ అనంతరం పెద్దపల్లి-నిజామాబాద్ రైల్వే లైన్ కల సాకారమవుతోంది. అప్పటి నిజాం నవాబుల హయాంలోనే సర్వే పూర్తయనా ఈ రైల్వే లైన్ పనులు నత్తనడకన కొనసాగుతూ, ఎట్టకేలకు తుదిరూపును సంతరించుకున్నాయి.

Pages