S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

04/14/2020 - 03:50

శ్రీశైలం: శ్రీశైల మహాక్షేత్రంలో శ్రీ భ్రమరాంబ, మల్లికార్జున స్వామివార్లకు పరోక్ష ఆర్జిత సేవలను ప్రవేశపెట్టినట్లు ఈఓ రామారావు తెలిపారు. సోమవారం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి, ఈఓ పరోక్ష ఆర్జితసేవలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈఓ మాట్లాడుతూ స్వామివారి దర్శనానికి స్వయంగా రాలేని భక్తులు అన్‌లైన్‌లో సేవా రుసుం చెల్లించి ఆర్జిత సేవలను పరోక్షంగా జరిపించుకోవచ్చుని తెలిపారు.

04/13/2020 - 23:57

విజయవాడ, ఏప్రిల్ 13: రాష్ట్రంలో కోవిడ్-19 నివారణ చర్యల్లో భాగంగా వైఎస్సార్ టెలీమెడిసిన్‌ను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రారంభించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో ఆయన సోమవారం ఈ సేవలను లాంఛనంగా ప్రారంభించారు. ఇందులో భాగంగా టోల్ ఫ్రీ నెంబర్ - 14410ని అందుబాటులోకి తెచ్చారు. ఈ నెల 11 నాటికి 286 మంది వైద్యులు, 114 మంది ఎగ్జిక్యూటివ్‌లు తమ పేర్లు నమోదు చేసుకున్నారు.

04/13/2020 - 23:19

విజయవాడ, ఏప్రిల్ 13: కరోనా ప్రభావంతో గత 20రోజులుగా వారణాసి పుణ్యక్షేత్రంలో చిక్కుకుపోయిన వెయ్యి మంది తెలుగు యాత్రికులు ఎట్టకేలకు దాదాపు 20 బస్సుల్లో సోమవారం బయలుదేరి వస్తున్నారు. ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత 12 బస్సులు, సోమవారం ఉదయం మరో 8 బస్సులలో వారు స్వరాష్ట్రాలకు బయలుదేరినట్లు సమాచారం.

04/13/2020 - 23:08

విశాఖపట్నం, ఏప్రిల్ 13: కరోనా నేపథ్యంలో విధించిన లాక్‌డౌన్ కారణంగా విశాఖలో చిక్కుకున్న జపాన్ దేశానికి చెందిన పలువురు సోమవారం నగరం నుంచి బయలుదేరారు. లాక్‌డౌన్‌కు ముందు విశాఖ చేరుకున్న ఆరుగురు జపాన్ దేశస్తులు కరోనా కారణంగా అంతర్జాతీయ విమాన సర్వీసులు రద్దు కావడంతో విశాఖలో చిక్కుకుపోయారు. గత 20 రోజులుగా వీరంతా నగరంలోని ఒక హోటల్‌కే పరిమితమయ్యారు.

03/23/2020 - 06:23

తిరుపతి: ఆధ్యాత్మిక క్షేత్రం తిరునగరిలో భక్తుల గోవింద నామస్మరణలు లేవు. వాహనాల శబ్ధాలు లేవు....రైలు కూతలు లేవు.వీధుల్లో జనసంచారం లేదు. దుకాణాలు తెరుచుకోలేదు. బ్యాంకుల్లో వ్యాపార వాణిజ్యాలు నడవలేదు. ఏ వీధిచూసినా, ఏ వాడ చూసినా రోడ్లు నిర్మానుష్యంగా మారి తిరుమల, తిరుపతిలో నిశ్శబ్దం రాజ్యమేలింది. అలా అని ఏ సూర్యగ్రహణమో పట్టలేదు. రాజకీయ నాయకులు బంద్‌కు పిలుపునివ్వలేదు.

03/23/2020 - 06:18

హైదరాబాద్, మార్చి 22: కరోనా వైరస్ మహామ్మారిని స్వీయ నియంత్రణ ద్వారా కరోనాను దూరంచేయవచ్చునన్న ప్రభుత్వ ఆదేశాలను అన్ని వర్గాలు ముక్తకంఠంతో విజయవంతం చేశారు. ఇటు మంత్రులు, అటు అధికారులు జనతా కర్ప్యూకు సంఘీభావం వ్యక్తం చేస్తూ సంకేతాలు ఇచ్చారు.

03/23/2020 - 01:23

గుంతకల్లు, మార్చి 22: అనంతపురం జిల్లా గుంతకల్లు రైల్వే జంక్షన్‌లో ఆదివారం కరోనా కలకలం రేగింది. ముంబయి-కోయంబత్తూ రు(కుర్లా) ఎక్స్‌ప్రెస్ రైలులో ప్రయాణిస్తున్న వ్యక్తిపై తోటి ప్రయాణికులు అనుమానం వ్యక్తం చేయడంతో అతడిని గుంతకల్లు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

03/23/2020 - 01:19

భద్రాచలం టౌన్, మార్చి 22: దండకారణ్యం కాల్పుల మోతతో దద్దరిల్లింది. పచ్చటి అడవిలో మరోమారు నెత్తురు చిందింది. చత్తీస్‌గఢ్ రాష్ట్రం బస్తర్ రేంజ్ సుకుమా జిల్లాలో మావోయిస్టులు మారణహోమం సృష్టించారు. మాటువేసి మెరుపుదాడితో భద్రతా బలగాలను మట్టుబెట్టారు. కూంబింగ్‌కు వచ్చిన బలగాలనే లక్ష్యంగా చేసుకున్న మావోలు మూకుమ్మడిగా కాల్పులకు దిగి 17మంది జవాన్లను దారుణంగా హతమార్చారు.

03/23/2020 - 01:02

హైదరాబాద్, మార్చి 22: కరోనా వైరస్ మహమ్మారిని పూర్తిగా నియంత్రించడానికి ముందస్తు చర్యగా జనతా కర్ఫ్యూను ఈనెల 31వ తేదీ వరకు కొనసాగించనున్నారు. ఇబ్బందులు ఉన్నా ప్రయాణికులు తమ ప్రయాణాన్ని వాయిదా వేసుకోవాలని రైల్వే సూచించింది. దేశంలో అతిపెద్ద రవాణారంగం అయిన రైల్వే 453 రైళ్లను నిలిపివేసింది. ఈ రైళ్లు ఈనెల 31వ తేదీ అర్ధరాత్రి వరకూ ఆగిపోనున్నాయి. జూన్ 21 వరకు ప్రయాణికులు

,
03/22/2020 - 04:58

తిరుపతి: కరోనా వైరస్ నేపథ్యంలో శుక్రవారం నుంచి భక్తులను శ్రీవారి దర్శనానికి అనుమతించకుండా నిలిపివేసిన నేపథ్యంలో భక్తుల కోసం ముందస్తుగా తయారుచేసిన లడ్డూలను టీటీడీ ఉచితంగా ఉద్యోగులకు అందించింది. సుమారు 2.50లక్షల లడ్డూలు భక్తులను స్వామిదర్శనం నిలిపివేసే సమయానికి మిగిలిపోయాయి.

Pages