S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

12/29/2015 - 11:38

హైదరాబాద్: రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ ఈ రోజు సాయంత్రం 7.30 గంటల నుంచి 8.30 గంటల వరకు రాజ్‌భవన్‌లో విడిది చేస్తారు. గవర్నర్ నరసింహన్ ఇచ్చే విందులో రాష్టప్రతి, పలువురు ప్రముఖులు పాల్గొంటారు. రాష్టప్రతి రాక సందర్భంగా నగరంలోని పలు ప్రాంతాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.

12/29/2015 - 11:37

నల్గొండ: కోదాడ మండలం నల్లబండగూడెం వద్ద జాతీయ రహదారిపై మంగళవారం ఉదయం ఆటోను ఓ కారు ఢీకొన్న ఘటనలో 8 మంది క్షతగాత్రులయ్యారు. గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.

12/29/2015 - 11:35

హైదరాబాద్: దాదాపు 45 చిత్రాలలో నటించిన తెలుగు సినీ హాస్యనటుడు పొట్టి రాంబాబు ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం మరణించారు. తూర్పు గోదావరి జిల్లా బూరుగుపూడికి చెందిన ఆయన ‘ఈశ్వర్’ ‘చంటిగాడు’ ‘గోపి గోపిక గోదావరి’ తదితర చిత్రాలలో నటించి ప్రేక్షకుల మెప్పు పొందారు.

12/29/2015 - 11:34

హైదరాబాద్: శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో మంగళవారం ఉదయం కస్టమ్స్ అధికారులు తనిఖీలు చేసి ఐదు కిలోల బంగారం బిస్కెట్లను స్వాధీనం చేసుకున్నారు. దుబాయి నుంచి వచ్చిన ఇద్దరు ప్రయాణీకులను సోదా చేయడంతో ఈ బంగారం బయటపడింది.

12/29/2015 - 07:59

కాకతీయుల కాలంనాటిదని చెబుతున్న పండితులు
ప్రత్యేక పూజలు చేసిన భక్తులు

12/29/2015 - 07:59

వెంటాడుతున్న క్రాస్ ఓటింగ్ బెడద
ఎమ్మెల్సీ ఫలితాలపై నేతల్లో ఉత్కంఠ
కాంగ్రెస్ నేతల్లో పెరిగిన ధీమా
అంచనాలతో మునిగి తేలుతున్న నేతలు

12/29/2015 - 07:58

కోర్టు ఆదేశాలతో 30న సమావేశం

12/29/2015 - 07:58

తెరాస సర్కారుపై కిషన్‌రెడ్డి ధ్వజం

12/29/2015 - 07:57

హైదరాబాద్, డిసెంబర్ 28: అఖిల భారత అంగన్‌వాడీ మహాసభలు జనవరి 7 నుంచి నాలుగు రోజులపాటు హైదరాబాద్‌లో జరుగుతాయని తెలంగాణ అంగన్‌వాడీ వర్కర్స్, హెల్పర్స్ యూనియన్ (సిఐటియు) ప్రధాన కార్యదర్శి పి.జ యలక్ష్మి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మహాసభల నిర్వహణకు 18 కమిటీలను ఏర్పా టు చేశామని తెలిపారు. మహాసభల్లో పాల్గొనేందుకు దాదాపు వెయ్యి మందికిపైగా ప్రతినిధులు వస్తారని ఆమె వెల్లడించారు.

Pages