-
హైదరాబాద్: రాష్ట్రంలో 2019-20 యాసంగి (రబీ) పంటకు సంబంధించి పంటల ఉత్పత్తి అద్భ
-
వరంగల్: వరంగల్ జిల్లాలో గన్నీ బ్యాగుల పరిశ్రమ ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు తీసు
-
నల్లగొండ, ఏప్రిల్ 13: ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు పెరుకుండ
-
నేరేడుచర్ల, ఏప్రిల్ 13: నేరేడుచర్ల నుండి నిజాముద్దీన్ మర్కజ్ జమాత్కు వెళ్లి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
తెలంగాణ
హైదరాబాద్: కూకట్పల్లి మైత్రీనగర్లో ఓ వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన శుక్రవారం ఉదయం వెలుగు చూసింది. మృతురాలి భర్త సాఫ్ట్వేర్ కంపెనీలో పని చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు. అత్తింటి వేధింపుల వల్లే ఈ విషాదం చోటుచేసుకుందని మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు.
హైదరాబాద్: చారిత్రక ప్రాధాన్యత ఉన్న సుల్తాన్బజార్ను మెట్రో రైలు మార్గం నుంచి మినహాయించాలని కోరుతూ అక్కడి వ్యాపారులు శుక్రవారం బంద్ పాటించారు. ‘సేవ్ సుల్తాన్బజార్’ పేరుతో పోస్టర్లు ప్రదర్శించారు. ముందు అనుకున్నట్లే సుల్తాన్బజార్ మీదుగా మెట్రో రైలు వెళ్తుందని అధికారులు తాజాగా ప్రకటించడంతో వ్యాపారులు తమ ఆందోళనను ఉధృతం చేశారు.
రంగారెడ్డి : రాష్ట్రంలో త్వరలో ప్రైవేటు విశ్వవిద్యాలయాల బిల్లు తీసుకువస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. గురువారం కోకాపేటలో రాక్వెల్ ఇంటర్నేషనల్ పాఠశాల ప్రారంభోత్సవంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ప్రైవేటు విశ్వవిద్యాలయాల ఏర్పాటుకు యూనివర్సీటీలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
ఆదిలాబాద్: మామడ మండల పరిసరాల్లో పులి సంచరిస్తోంది. వ్యవసాయ పనులకు వెళ్లిన మామడ మండల కేంద్రానికి చెందిన చిన్నల్ల పోశెట్టి (25) అనే యువకుడిపై పులి దాడి చేయడంతో తీవ్ర గాయాలపాలయ్యాడు. అటవీశాఖ అధికారులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు.
షాద్నగర్ : మహబూబ్నగర్ జిల్లా షాద్నగర్ మండలం చిలకమర్రి వద్ద ఉన్న జిన్నింగ్ మిల్లులో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో భారీ ఎత్తున అస్తి నష్టం జరిగింది. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు.
రంగారెడ్డి: రంగారెడ్డి జిల్లా శంకరపల్లిలో బుధవారం రాత్రి ఓ ఇంటి తాళాలు పగులగొట్టి దొంగలు 50 తులాల బంగారం, 4 లక్షల నగదు దోచుకున్నారు.
నిజామాబాద్: వేగంగా వస్తున్న టవేరా జీపు అదుపుతప్పి చెట్టును ఢీకొనడంతో ముగ్గురు మరణించగా, ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. కామారెడ్డి మండలం రామేశ్వర్పల్లి వద్ద గురువారం ఉదయం ఈ ఘటన జరిగింది. జీపులో ఉన్నవారు ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్కు వెళ్తున్నారు.
హైదరాబాద్: బ్యాంకాక్ నుంచి గురువారం ఉదయం శంషాబాద్ ఎయిర్పోర్టులో దిగిన ఓ ప్రయాణీకుడిని అధికారులు సోదా చేసి అరకిలో బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ ప్రయాణీకుడు తన వెంట తెచ్చిన టీవీ స్టాండ్లో బంగారాన్ని దాచిపెట్టినట్లు అధికారులు కనుగొన్నారు.
భద్రాచలం, నవంబర్ 25: ఆపరేషన్ గ్రీన్హంట్ నిలిపివేయాలని, మావోయిస్టుల వేట పేరుతోచేపట్టిన వైమానిక దాడులను నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ బుధవారం ఛత్తీస్గఢ్ దండకారణ్యంలో మావోయిస్టులు నిర్వహించిన బంద్ హింసాత్మకంగా సాగింది. దక్షిణ బస్తర్ ప్రాంతంలోని భానుప్రతాప్పూర్ మైన్స్లో సుమారు 31 వాహనాలకు, మిషన్లకు మావోయిస్టులు నిప్పు పెట్టారు.
తుర్కపల్లి, నవంబర్ 25: నల్లగొండ జిల్లా తుర్కపల్లి మండలం మల్కాపురం మూలమలుపు వద్ద బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మినీ వ్యాన్ పల్టీ కొట్టడంతో అందులో ప్రయాణిస్తున్న నలుగురు దుర్మరణం చెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలు కాగా మరో ఆరుగురికి స్వల్ప గాయాలయ్యాయి.