S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

11/28/2015 - 04:54

హైదరాబాద్, నవంబర్ 27: అడ్మినిస్ట్రేటివ్ స్ట్ఫా కాలేజ్ ఆఫ్ ఇండియా (ఎఎస్‌సిఐ) కొత్త చైర్మన్, కేంద్ర హోంశాఖ మాజీ కార్యదర్శి, పద్మభూషణ్ కె పద్మనాభయ్యను శుక్రవారం ఆ సంస్థ ఉద్యోగులు ఘనంగా సన్మానించారు. సంస్థకు కొత్త చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన పద్మనాభయ్యను పలువురు ఉద్యోగులు కలిసి శుభాకాంక్షలు తెలిపారు.

11/28/2015 - 04:51

ఆంధ్రభూమి బ్యూరో

11/28/2015 - 04:50

హైదరాబాద్, నవంబర్ 27: తెలంగాణలో 15/2015 నోటిఫికేషన్ ద్వారా ఆర్ధిక శాఖ అకౌంట్స్ శాఖలో అసిస్టెంట్ల నియామకానికి ఈ నెల 29వ తేదీన ఆబ్జెక్టివ్ పద్ధతిలో కంప్యూటర్ ఆన్ లైన్ ఒఎంఆర్ ఆధారితంగా ఎంపిక పరీక్ష నిర్వహించనున్నట్టు తెలంగాణ పబ్లిక్ సర్వీసు కమిషన్ కార్యదర్శి పార్వతి సుబ్రమణియన్ తెలిపారు. ఈ పరీక్ష నిర్వహణకు 84 కేంద్రాలు ఏర్పాటు చేశామని, 55,239 మందికి హాల్‌టిక్కెట్లు జారీ చేశామని చెప్పారు.

11/28/2015 - 04:03

హైదరాబాద్, నవంబర్ 27: స్థానిక సంస్థల కోటాకింద శాసన మండలి పనె్నండు స్థానాలకు జరిగే ఎన్నికల్లో మొత్తం స్థానాలు సాధించేందుకు తెరాస వ్యూహాత్మకంగా అడుగులేస్తోంది. డిసెంబర్ 27న ఎన్నికలు జరుగుతాయి. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకన్నా ముందువచ్చిన స్థానిక సంస్థల ఫలితాల్లో కాంగ్రెస్ మొదటి స్థానంలో నిలిచింది. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో తెరాస విజయం సాధించడం, తెరాస ప్రభుత్వం ఏర్పడటంతో రాజకీయ దృశ్యం మారిపోయింది.

11/28/2015 - 04:01

హైదరాబాద్, నవంబర్ 27: మెట్రో రైలు అలైన్‌మెంట్ మార్పు అంశం మళ్లీ తెరపైకొచ్చింది. ముందు కుదుర్చుకున్న ఒప్పందం మేరకే అలైన్‌మెంట్ ఉంటుందితప్ప, ఎలాంటి మార్పూ ఉండబోదని మెట్రోరైలు నిర్మాణ కాంట్రాక్టు సంస్థ ఎల్ అండ్ టి, మెట్రోరైలు ఎండి విబి గాడ్గిల్ తాజాగా చేసిన ప్రకటన ప్రభుత్వానికి తలనొప్పిగా మారింది.

11/28/2015 - 03:59

చాంద్రాయణగుట్ట, నవంబర్ 27: జంట నగరవాసుల దాహర్తి తీర్చేందుకు ప్రభుత్వం చేసిన ప్రయత్నంతో శుక్రవారం సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో గోదావరి నీళ్లు కుత్బుల్లాపూర్‌కు చేరుకున్నాయి. ఘన్‌పూర్‌కు నుంచి కుత్బుల్లాపూర్‌కు చేరుకున్న 28.5 ఎంజిడిల నీటిని ఆన్‌లైన్ ద్వారా సరఫరా ప్రారంభించారు. గోదావరి నుంచి తీసుకొస్తున్న నీటిని రెండు రింగ్‌మెయిన్‌ల కింద జలమండలి అధికారులు తరలిస్తున్నారు.

11/28/2015 - 03:57

హైదరాబాద్, నవంబర్ 27: రాష్టవ్య్రాప్తంగా త్వరలో భూముల రీ సర్వే చేపట్టనున్నట్టు భూపరిపాలన శాఖ ప్రధాన కమిషనర్ రేమండ్ పీటర్ వెల్లడించారు. రాష్ట్రంలో చేపట్టనున్న భూముల రీ సర్వేకు కేంద్ర ప్రభుత్వం రూ.275 కోట్లు మంజూరు చేసిందన్నారు. సెంటర్ ఫర్ ల్యాండ్ యూస్ మేనేజిమెంట్ ఆధ్వర్యంలో శుక్రవారం నుంచి రెండు రోజులపాటు జరుగనున్న ‘జాతీయ భూ సర్వే విధానం- రికార్డుల ఆధునీకరణ’ సదస్సులో రేమండ్ పీటర్ మాట్లాడారు.

11/27/2015 - 15:28

మెదక్: జిల్లాలోని నర్సాపూర్ ఫారెస్ట్ రేంజర్ మధుసూధన్‌రావు ఓ రైతు నుంచి లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.

11/27/2015 - 13:47

హన్మకొండ : వరంగల్ జిల్లా హన్మకొండలో పోలీసులు విస్తత్ర తనిఖీలు చేశారు. ఈ తనిఖీల్లో బస్డాండ్‌లో పేలుడు పదార్థాలను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఓ వ్యక్తి సంచిలో పేలుడు పదార్థాలు ఉంచి పరారయ్యాడు. ఆ వ్యక్తి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

11/27/2015 - 11:58

హైదరాబాద్: నగరంలోని బంజారాహిల్స్‌లో ఒకే ఇంట్లో ఇరవై రోజుల వ్యవధిలో రెండుసార్లు చోరీ చేసిన దొంగ ఇంటి గోడపై ‘సారీ’ అని రాసి పరారయ్యాడు. గత నెల 31న అదే ఇంట్లో అమెరికన్ డాలర్లు, బంగారు నగలు, ఖరీదైన కెమెరాలు, సెల్‌ఫోన్లు ఆ దొంగ దోచుకున్నాడు. మళ్లీ బుధవారం రాత్రి అదే ఇంట్లో దొంగ ప్రవేశించి విలువైన ఆభరణాలు, నగదు దోచుకున్నాడు.

Pages