S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

07/03/2016 - 06:06

విజయవాడ, జూలై 2: ఈ ఏడాది రాష్టవ్య్రాప్తంగా 83 వేల కోట్ల రూపాయలు వ్యవసాయ రుణాలుగా అందించాలని వ్యవసాయ శాఖ ప్రతిపాదించింది. రైతు సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ఎపి ప్రభుత్వం రూ.1,65,538తో వార్షిక రుణ ప్రణాళికను విడుదల చేసింది.

07/03/2016 - 06:05

విశాఖపట్నం (కల్చరల్), జూలై 2 : బ్రాహ్మణులు రాజకీయాల్లో అడుగుపెట్టి తమను తాము నిరూపించుకోవాలని ఆంధ్రా బ్రాహ్మణ సంక్షేమ సంఘం చైర్మన్, విశ్రాంత ప్రధాన కార్యదర్శి ఐవై ఆర్ కృష్ణారావు అభిలషించారు. రాజకీయాల్లో తమ వాటాను అడిగి తీసుకోవాలని, తద్వారా పురోగతి సాధించవచ్చన్నారు.

07/03/2016 - 06:03

‘‘వేదవతీ! వేగంగా నిద్ర లేవమ్మా. ఆడపిల్ల పొద్దెక్కే వరకూ నిద్రపోకూడదు’’ అనసూయమ్మ కోడల్ని నిద్ర లేపుతోంది.
‘‘అవునే తల్లీ! ఆడపిల్ల బారెడు పొద్దెక్కే వరకు నిద్రపోతే ఆ ఇంటికి అరిష్టం’’ అనసూయమ్మ అత్త ఆండాలమ్మ పిలుపు.
‘‘కొత్త కోడలు కదా! ఆ మాత్రం మొద్దునిద్ర తప్పదు కాసేపు నిద్రపోనివ్వండి’’ ఆండాలమ్మ భర్త ముక్తాయింపు.

07/03/2016 - 06:01

విశాఖపట్నం, జూలై 2: నైజీరియాలో కిడ్నాప్‌కు గురైన ఎం సాయి శ్రీనివాస్ భార్య, పిల్లలు ముఖ్యమంత్రి చంద్రబాబును కలిశారు. నగరంలో నైట్ బే మారథాన్ కార్యక్రమంలో పాల్గొనేందుకు శనివారం విశాఖ వచ్చిన ఆయనను ప్రభుత్వ అతిథి గృహంలో శ్రీనివాస్ భార్య లలిత కలిసి, తన భర్తను విడిపించేందుకు సహకరించాలని కోరారు.

07/03/2016 - 05:58

హైదరాబాద్, జూలై 2: ఆంధ్ర రాష్ట్రంలో కరవు తీరా వర్షాలు పడ్డాయి. నైరుతి రుతుపవనాలు ఆలస్యమైనా, జూన్ నెలలోనే సాధారణ వర్షపాతం కంటే ఎక్కువ వర్షపాతం నమోదైంది. రాష్ట్రంలోని 13 జిల్లాల్లో వర్షాలు బాగా కురవడంతో రైతులు ఖరీఫ్ సాగు పనులు వేగవంతం చేశారు.

07/03/2016 - 05:57

గంగవరం, జూలై 2: డీజిల్ సరఫరాకోసం చైన్నై- బెంగళూరు మధ్య ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ పైపు లైన్ వేసింది. ఈ పైపు లైన్ చిత్తూరు జిల్లా గంగవరం మండలంలో నాల్గవ నెంబరు జాతీయ రహదారి పక్కగా వెళ్తుంది. అయితే మార్గమధ్యలో గల పొన్నమాకులపల్లి సమీపంలో ఐఓసి పైపులైనుకు కన్నం వేసి నెల రోజులుగా పెట్రోలు, డీజల్, గ్యాస్‌ను తస్కరించి డాబా హోటల్‌కు సరఫరా చేసుకొని యథేచ్చగా విక్రయాలు సాగిస్తున్నారు.

07/03/2016 - 05:53

జలదంకి, జూలై 2: గుప్తనిధులకోసం పవిత్రమైన ప్రాచీనమైన శివాలయంలో శివలింగాన్ని పెకలించిన సంఘటన నెల్లూరు జిల్లా జలదంకి మండల కేంద్రంలోని పోలీస్‌స్టేషన్ సమీపంలోని కొండయ్య మఠం వద్ద ఉన్న ప్రాచీన శివాలయంలో శుక్రవారం రాత్రి జరిగింది. గుర్తుతెలియని వ్యక్తులు గుప్తనిధుల కోసం పూజలు జరిపి అక్కడ వున్న శివలింగాన్ని పెకలిచారు.

07/03/2016 - 05:53

మెట్రో సిటీలో నిత్యం రద్దీగా వుండే ఫుట్‌పాత్‌పై ఓ దివ్యాంగురాలు రెండు కాళ్లూ కోల్పోయిన దీనస్థితిలో వినసొంపుగా పాటలు పాడుతూ వుంది. ఆమె చుట్టూ జనం చేరడంతో ట్రాఫిక్ కానిస్టేబుల్ పాటలు వింటూ నిల్చున్నాడు. సంగీత ప్రియుడైన ఒక జర్నలిస్టు హడావుడిగా బైక్‌పై వచ్చి పాటలు పాడుతున్న దివ్యాంగురాలిని నీడకు తీసుకెళ్లాడు.
‘మీది ఏ ఊరమ్మా?’.. ప్రశ్నించాడు యువ జర్నలిస్టు, గాయకుడైన రాజు.

07/03/2016 - 05:52

కావలి, జూలై 2: నెల్లూరు జిల్లా కావలి పట్టణంలోని వైకుంఠపురానికి చెందిన 9వ తరగతి చదువుతున్న మాకన సాయి అనే బాలుడిని వారి కుటుంబానికి పరిచయస్తుడైన ఓ వ్యక్తి ఉన్మాదిగా మారి బాలుడు చదువుతున్న పాఠశాల వద్దే గొంతు కోసి హతమార్చేందుకు యత్నించిన సంఘటన శనివారం సాయంత్రం జరిగింది.

07/03/2016 - 05:52

సింహాచలం, జూలై 2: శ్రీ వరాహలక్ష్మీ నృసింహస్వామి వారి దేవస్థానంలో ఈ నెల 18న జరిగే సింహగిరి ప్రదక్షిణ ఉత్సవాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహించడానికి అధికారులు సన్నద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో ఈవో రామచంద్రమోహన్ శనివారం దేవాలయంలో దేవస్థానం విభాగాధిపతులతో సమావేశం ఏర్పాటు చేసారు. చతుర్థశి రోజున గిరి ప్రదక్షిణ, పౌర్ణమి రోజున ఆలయ ప్రదక్షిణకు సంబంధించిన ఏర్పాట్ల పై ఆయన విభాగాధిపతులతో చర్చించారు.

Pages