S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
హైదరాబాద్, జూలై 2: హైకోర్టు విభజనపై చీఫ్ జస్టిస్తో చర్చిస్తానని గవర్నర్ నరసింహన్ హామీ ఇచ్చారని కేంద్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ సహాయ మంత్రి బండారు దత్తాత్రేయ తెలిపారు. శనివారం ఆయన రాజ్భవన్లో గవర్నర్ నరసింహన్తో సమావేశమయ్యారు. సమావేశానంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ న్యాయాధికారుల సస్పెన్షన్ను ఎత్తివేసేలా చర్యలు తీసుకోవాలని గవర్నర్ను కోరానని చెప్పారు.
నల్లగొండ రూరల్, జూలై 2: ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన నైరుతి రుతుపవనాల ప్రభావంతో గత కొన్ని రోజుల నుండి వర్షాలు అడపదడపా కురుస్తుండడంతో నల్లగొండ మండలంలో ఖరీఫ్ పంటల సాగు ఊపందుకుంది. వర్షాధార పంటలైన పత్తి తదితరలు ఆనవాయితిగా వేస్తున్నారు. భూగర్భ జలాలు అడుగంటడంతో బోరు మోటార్లు ఎండిపోయి వరి ధాన్యం పంట విస్తీర్ణం తగ్గిపోతుంది.
నల్లగొండ, జూలై 2: కరవు, పర్యావరణ సమస్యలను దూరం చేసి సమాజంలోని అందరి భవిష్యత్ను పరిరక్షించేందుకు తెలంగాణలో అడవుల విస్తీర్ణం 25శాతం నుండి 33శాతం పెంచేందుకు సిఎం కెసిఆర్ నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం హరిత హారం కార్యక్రమం చేపట్టిందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జి.జగదీష్రెడ్డి అన్నారు.
నల్లగొండ, జూలై 2: జిల్లా ప్రజల సమస్యలకు గొంతుకై నిలువాల్సిన జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం మరోసారి నామమాత్ర, మొక్కుబడి చర్చలతో అర్ధాంతరంగా ముగిసిపోవడం విమర్శలకు తావిచ్చింది. జడ్పీ చైర్మన్ ఎన్. బాలునాయక్ అధ్యక్షతన శనివారం జరిగిన జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో 29అంశాల ఎజెండాలో ప్రధానంగా హారిత హారంపైనే చర్చ కొనసాగగా, వ్యవసాయంపై జెడిఏ నివేదిక చదువడం వరకే పరిమితమైంది.
రాజమహేంద్రవరం, జూలై 2: సాగునీటి వ్యవస్థలో ఎంతో కీలకమైన తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం వద్ద కాటన్ బ్యారేజ్ అధికారుల అలక్ష్యానికి గురైంది. కీలకమైన బ్యారేజ్ గేట్ల బ్రేక్ కాయిల్స్ మాయం కావడం, ముగ్గురు ఎఇలు సస్పెండ్ కావడం ఇందుకు అద్దంపడుతోంది. బ్యారేజ్కు ప్రస్తుతం నిర్వహణ పనుల్లో భాగంగా మరమ్మతులను రూ.29 కోట్లతో చేపట్టారు. ఈ పనుల్లో నాణ్యతాలోపం చోటుచేసుకుందని ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.
సంగారెడ్డి టౌన్, జూలై 2: మల్లన్న సాగర్ ప్రాజెక్టు వెనకాల ఉన్న మర్మమేమిటో, ఇందులో ప్రభుత్వం దాస్తున్న విషయాలను తెలుగు కరపత్రాల ద్వారా ప్రజల్లో అవగాహాన కల్పించాలని ప్రజా తెలంగాణ పార్టీ రాష్ట్ర కన్వీనర్ గాదె ఇన్నయ్య, కో-కన్వీనర్లు నాగప్రసాద్, శ్రీశైల్రెడ్డి, తెలుగు రైతు సంఘం అధ్యక్షులు ఒంటేరు ప్రతాప్రెడ్డిలు డిమాండ్ చేశారు.
మెదక్, జూలై 2: కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యంతో, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు కుట్రతో హైకోర్టు విభజన జరగడం లేదని టిఎన్జివోస్ మెదక్ జిల్లా కార్యదర్శి మేడిశెట్టి శ్యామ్రావు ఆరోపించారు. మెదక్ సబ్ కోర్టు జూడిషియల్ ఎంప్లాయిస్ సమ్మె శనివారం నాటికి రెండవ రోజుకు చేరుకుంది. ఈ సమ్మెకు టిఎన్జివోస్ సంఘం సంఘీభావం ప్రకటించింది.
హైదరాబాద్, జూలై 2: మంత్రివర్గంలో సీనియర్లను పక్కనపెట్టి, మంత్రి నారాయణకు అధిక ప్రాధాన్యం ఇవ్వడంపై మంత్రులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా రాజధాని నగర నిర్మాణం, తాత్కాలిక సచివాలయంపై నారాయణకు పెత్తనం ఇవ్వడాన్ని మంత్రులు సహించలేకపోతున్నారు.
సంగారెడ్డి టౌన్, జూలై 2: రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి చూసి ఒర్వలేక ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేయడం సరికాదని సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ పేర్కొన్నారు. రెండేళ్ల పాలనలో జరిగిన అభివృద్ధి ఏమిటో కాంగ్రెస్ నాయకుల కండ్లకు కనిపించడం లేదా అన్ని ప్రశ్నించారు. జరిగిన అభివృద్ధిపై చర్చకు సిద్ధమా అంటూ కాంగ్రెస్కు సవాల్ విసిరారు.
సంగారెడ్డి టౌన్, జూలై 2: బిసి కళ్యాణ లక్ష్మి పథకానికి సంబంధిత తహసీల్దారులే విచారణ అధికారులుగా ఉంటారని బిసి సంక్షేమ శాఖ అధికారి జి.ఆశన్న తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం బిసిలకు కళ్యాణ లక్ష్మి పథకాన్ని అమలు చేసేందుకు జివో నంబర్ 18 జారీ చేసిందన్నారు. కళ్యాణ లక్ష్మి దరఖాస్తులను స్వీకరించి అట్టి దరఖాస్తులపై విచారణ చేపట్టే బాధ్యత సంబంధిత మండలాల తహసీల్ధార్లపై ఉంటుందన్నారు.