S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

07/03/2016 - 05:51

మచిలీపట్నం, జూలై 2: కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం పెంజండ్ర వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు ఇంజనీరింగ్ విద్యార్థులు దుర్మరణం చెందారు. విజయవాడకు చెందిన సయ్యద్ వౌలాసాహెబ్(19), ప్రకాశం జిల్లా టంగుటూరుకు చెందిన పేల కృష్ణసాయి(19), విజయవాడకు చెందిన షేక్ సాదిక్(20) గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాలలో బిటెక్ తృతీయ సంవత్సరం చదువుతున్నారు.

07/03/2016 - 05:51

విశాఖపట్నం, జూలై 2 : ఒడిశా నుంచి దక్షిణ తమిళనాడు వరకూ కోస్తాంధ్రప్రదేశ్ మీదుగా ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు శనివారం రాత్రి తెలిపారు. పశ్చిమ మధ్య బంగాళాఖాన్ని అనుకుని ఏర్పడిన అల్పపీడం కొనసాగుతోందని తెలిపారు. వీటి ప్రభావం వల్ల రానున్న 24 గంటల్లో కోస్తాంధ్రలో పలుచోట్ల ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపారు.

07/03/2016 - 05:50

చీరాల, జూలై 2: ప్రతి పేదవాడికి వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో పారదర్శకంగా పని చేస్తున్నామని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ స్పష్టం చేశారు. బిజెపి జిల్లా కార్యవర్గ సమావేశంలో పాల్గొనేందుకు శనివారం ఆయన ప్రకాశం జిల్లా చీరాల వచ్చారు. ఈ సందర్భంగా మంత్రి స్థానిక ఏరియా వైద్యశాలను తనిఖీ చేశారు. ఆస్పత్రిలో చేపడుతున్న నూతన భవన నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు.

07/03/2016 - 05:50

గుంటూరు, జూలై 2: గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆసుపత్రిలో ప్రకాశం జిల్లా చీరాల మండలం తోటవారిపాలెంకు చెందిన పారేపల్లి వెంకటేశ్వరరావు బాత్‌రూమ్‌లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. స్థలం వివాదంలో తనపై కేసు పెట్టారన్న అవమాన భారంతో సొంత గ్రామంలోని తోటవారిపాలెంలో శనివారం తెల్లవారు జామున ఆత్మహత్యకు యత్నించగా వెంకటేశ్వరరావును చికిత్స నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

07/03/2016 - 05:49

హైదరాబాద్, జూలై 2: వైకాపా తరఫున అసెంబ్లీకి ఎన్నికై టిడిపిలోకి ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని ఇచ్చిన పిటిషన్‌ను స్పీకర్ తిరస్కరించడంపై ఆ పార్టీ మండిపడింది. శనివారం ఇక్కడ వైకాపా ఎమ్మెల్యే పిఏసి చైర్మన్ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి విలేఖర్లతో మాట్లాడుతూ సరైన ఫార్మెట్‌లో పిటిషన్ ఇవ్వలేదని స్పీకర్ చెప్పారన్నారు. కాని ఏ ఫార్మెట్ కావాలో స్పీకర్ చెప్పాలన్నారు.

07/03/2016 - 05:49

పాల్వంచ, జూలై 2: ఖమ్మం జిల్లా పాల్వంచ మున్సిపాలిటీ పరిధిలో శనివారం ఇద్దరు విద్యార్థినులు ముర్రేడువాగులో పడి మరణించారు. పోలీసుల కథనం ప్రకారం వివరాలిలావు న్నా యి. మున్సిపాలిటీ పరిధిలోని కుంటినాగులగూడెం గ్రామానికి చెందిన మోకాళ్ళ శిరీష (14), ములకలపల్లి మండలం వే ముకుంట గ్రామానికి చెందిన మడకం రోహిణితో (9) కలిసి బట్టలు ఉతికేందుకు ముర్రేడువాగు వద్దకు వెళ్ళారు.

07/03/2016 - 05:48

విజయవాడ, జూలై 2: కాలేయ వ్యాధితో బాధపడుతున్న 8 నెలల చిన్నారి జ్ఞానసాయి ఆపరేషన్ మరో నెల రోజుల పాటు వాయిదా పడింది. చెన్నైలోని గ్లోబల్ ఆసుపత్రిలో జ్ఞానసాయి కాలేయ మార్పిడి శస్త్ర చికిత్సకు ముందు అవసరమైన అన్ని వైద్య, ఆరోగ్య పరీక్షలను వైద్యనిపుణులు పూర్తి చేశారు. తన కాలేయంలో కొంత భాగాన్ని ఇచ్చి జ్ఞానసాయిని అనారోగ్యం నుండి గట్టెక్కించేందుకు తండ్రి రమణప్ప ముందుకు వచ్చాడు.

07/03/2016 - 05:47

హైదరాబాద్, జూలై 2: వైకాపా అధ్యక్షుడు జగన్‌పై అక్రమాస్తుల కేసులో కేంద్ర ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తూ ఏ మాత్రం నైతికత ఉన్నా, పార్టీని రద్దు చేయాలని టిడిపి సీనియర్ నేత, ఎమ్మెల్సీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. దేశ చరిత్రలో ఒక రాజకీయ పార్టీ కార్యాలయాన్ని కేంద్ర ఏజన్సీ సంస్థ అటాచ్ చేయడం ఇదే మొదటిసారి అన్నారు.

07/03/2016 - 05:46

ఇల్లెందు, జూలై 2: ఖమ్మం జిల్లా ఇల్లెందు ప్రాంతంలోని ఓపెన్‌కాస్టు మట్టిదిబ్బలలో శనివారం ఇద్దరు కార్మికులు దుర్మరణం చెందారు. పొట్టకూటి కోసం ట్రాక్టర్ పనికివెళ్ళిన వజ్జా రాంబాబు (29), బి.సీతారాములు (46) విధినిర్వహణలో ఉండగా మట్టిపెళ్లలు మీదపడి మృతిచెందారు. మండల పరిధిలోని దనియాలపాడు గ్రామానికి చెందిన వారితోపాటు మరో ఇద్దరు ట్రాక్టర్ లోడింగ్, అన్‌లోడింగ్‌తో బతుకు సాగి స్తున్నారు.

07/03/2016 - 05:45

హైదరాబాద్, జూలై 2: ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రజలకు అందిస్తున్న సేవలను ఏ మాత్రం మెరుగుపరచకుండా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలను నాలుగు రెట్లు పెంచడం సరి కాదని లోక్‌సత్తా వ్యవస్ధాపకుడు జయప్రకాశ్ నారాయణ్ అన్నారు. అవినీతి, జీతాలు ఎక్కువ, సేవలు మాత్రం తక్కువని, ప్రజలు యాచకుల్లా ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాలి అనే వ్యవస్ధ ప్రజాస్వామ్యానికి మంచిది కాదన్నారు.

Pages