S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

05/29/2016 - 06:08

హైదరాబాద్, మే 28: రాష్ట్ర విభజన జరిగి మరో నాలుగు రోజుల్లో రెండేళ్లు గడుస్తుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కొన్ని ప్రాజెక్టుల కోసం విదేశీ ఏజెన్సీల నుంచి తీసుకున్న రుణాన్ని ఏ రాష్ట్రం చెల్లించాలనేది ఇంతవరకు తేలలేదు. ఈ అంశాన్ని ఇరు రాష్ట్రాలు కూర్చుని పరిష్కరించుకోవాలని కేంద్రం సలహా ఇస్తోంది. ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలు సయోధ్యతో ఈ అంశంపై చర్చించేందుకు సిద్ధంగా లేవు.

06/05/2016 - 00:56

పార్లమెంటులో బాంబులేయటం దారుణం, దుస్సాహసం, నిష్కృతిలేని నేరం - అని మండిపడ్డ పెద్ద మనుషులు ఆ నేరగాళ్లకు న్యాయస్థానం యావజ్జీవ ఖైదు విధించిందని తెలిస్తే మామూలుగా అయితే సంతోషించాలి.

05/29/2016 - 06:07

వేములవాడ, మే 28: కరీంనగర్ జిల్లా వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి ఆలయానికి హుండీ ద్వారా రూ. 1.04 కోట్ల నగదు ఆదాయం సమకూరింది. శనివారం ఆలయ ఆవరణలోని ఓపెన్ కాంప్లెక్స్‌లో హుండీ లెక్కింపు జరిగింది. ఇవో రాజేశ్వర్ పర్యవేక్షణలో ఈ లెక్కింపు జరిగింది. ప్రధాన దేవాలయంతోపాటు అనుబంధ దేవాలయమైన శ్రీ బద్దిపోచమ్మ ఆలయం, శ్రీ నగరేశ్వరాలయం, శ్రీ నాంపల్లి లక్ష్మినరసింహాలయాల హుండీలను లెక్కించారు.

05/29/2016 - 06:05

జనగామ టౌన్, మే 28: జనగామ జిల్లా సాధన ఉద్యమం రోజురోజుకు తీవ్రరూపం దాల్చుతుంది. గత కొన్ని రోజులుగా రోజుకో రూపంలో నిరసన కార్యక్రమం నిర్వహిస్తున్న ఉద్యమకారులు శనివారం మండలి చైర్మన్ స్వామిగౌడ్, భువనగిరి ఎంపి బూర నర్సయ్య గౌడ్‌లను జనగామ చౌరస్తాలో అడ్డుకున్నారు.

05/29/2016 - 06:03

కరీంనగర్, మే 28: అది ముళ్ల బాటే అని తెలిసినా.. గల్ఫ్ పయనాలు తప్పడం లేదు. అరబ్ దేశాలు నరకయాతనలు పెడుతున్నా.. కటకటాల్లోకి నెట్టుతున్నా... వలసలు ఆగకపోగా, ఈ పరంపర నేటికీ కొనసాగుతూనే ఉంది. ఓవైపు కరవు, మరోవైపు ఉపాధి లేమి వెరసి నిరుద్యోగులు గల్ఫ్ దేశాలే ప్రత్యామ్నాయ ఉపాధి కేంద్రాలుగా భావిస్తూ ఆ వైపునకు అడుగులేస్తున్నారు.

05/29/2016 - 05:56

మహబూబ్‌నగర్, మే 28: తెలంగాణ రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ మహిళా కళాశాలల్లో జూన్ 30వ తేదీ వరకు సిసి కెమెరాలను ఏర్పాటు చేయనున్నట్లు డిప్యూటీ సిఎం కడియం శ్రీహరి పేర్కొన్నారు. శనివారం మహబూబ్‌నగర్ జిల్లా విద్యా అభివృద్ధిపై సంబంధిత శాఖ అధికారులతో రెవెన్యూ మీటింగ్ హల్‌లో మంత్రులు జూపల్లి కృష్ణారావు, లక్ష్మారెడ్డిలతో కలిసి డిప్యూటీ సిఎం కడియం శ్రీహరి సమీక్ష సమావేశం నిర్వహించారు.

05/29/2016 - 05:54

హైదరాబాద్/కెపిహెచ్‌బి, మే 28: హైదరాబాద్‌కు చెందిన రమ్యకృష్ణ అనే యువతి వారం రోజుల క్రితం ఆస్ట్రేలియాలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. రమ్యకృష్ణ మృతదేహాన్ని భర్త మహంత్, కుటుంబీకులు శుక్రవారం రాత్రి నగరానికి తీసుకువచ్చారు. శంషాబాద్ విమానాశ్రయంలో మృతదేహాన్ని రమ్యకృష్ణ బంధువులకు అప్పగించి వెంటనే పరారయ్యాడని మృతురాలి బంధువులు ఆరోపించారు.

05/29/2016 - 05:51

హైదరాబాద్, మే 28: బిట్స్ పిలానీ వైస్ ఛాన్సలర్‌గా పనిచేస్తున్న ప్రొఫెసర్ విఎస్.రావు కొత్తగా ఏర్పాటు చేసిన నిట్ యూనివర్శిటీ (ఎన్‌యు) చైర్మన్‌గా చేరనున్నారు. సంస్థాగత నిర్మాణంలో మూడు దశాబ్దాలకు పైగా ఎంతో నైపుణ్యం, అపారమైన అనుభవం ఉన్న ప్రొఫెసర్ రావు నిట్ యూనివర్శిటీని పటిష్టమైన విద్యా సంస్థగా తీర్చిదిద్దుతానని ప్రకటించారు.

05/29/2016 - 05:49

హైదరాబాద్, మే 28: ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించిన ఎఎస్పీ రాధిక బృందం శనివారం హైదరాబాద్ చేరుకుంది. రాధికకు శంషాబాద్ విమానాశ్రయంలో డిజిపి, ఇతర అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. తన విజయానికి సహకరించిన పోలీస్ డిపార్టుమెంట్‌కు ఆమె కృతజ్ఞతలు తెలిపారు.

05/29/2016 - 05:49

హైదరాబాద్, మే 28: తెలంగాణ పశుసంవర్థక శాఖలో అడిషనల్ డైరెక్టర్‌గా పనిచేస్తున్న డాక్టర్ వై.తిరుపతయ్యకు రిటైర్‌మెంట్ తర్వాత లక్క్ఛీన్స్ వస్తోంది. ఈ నెల 31న ఆయన పదవీ విరమణ చేస్తున్నారు. ఒకవైపు పదవీవరమణకు సంబంధించి శనివారం జీఓ (జిఓ ఆర్‌టి నెంబర్ 68) వెలువడగానే, ఇదే రోజు ఆయనను ఇదే శాఖలో అడ్‌హాక్ విధానంలో డైరెక్టర్‌గా నియమిస్తున్నట్టు మరో ఉత్తర్వు (జిఓ ఎంఎస్ నెంబర్ 11) జారీ అయింది.

Pages