S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

05/18/2017 - 01:31

విజయవాడ, మే 17: రాష్ట్రంలో సిమెంట్ బస్తా తప్పనిసరిగా రూ. 310లకే విక్రయించాలని మంత్రి మండలి ఉప సంఘం ఉత్పత్తిదారులను ఆదేశించింది. సచివాలయంలో బుధవారం ఉదయం ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు అధ్యక్షతన మంత్రి మండలి ఉప సంఘం సభ్యులు కామినేని శ్రీనివాస్, అచ్చెన్నాయుడు సమావేశమై మూడు అంశాలపై చర్చించారు.

05/17/2017 - 03:20

విజయవాడ, మే 16: రాష్ట్రానికి చెందిన మరో నలుగురు విద్యార్థులు ఎవరెస్ట్ పర్వత శిఖరాన్ని అధిరోహించారు. సాంఘీక, గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలల నుంచి ఇద్దరు, యువజన సంక్షేమ విభాగం నుంచి మరో ఇద్దరు విద్యార్థులు ఈ ఘనత సాధించారు.

05/17/2017 - 03:17

విజయవాడ, మే 16: గ్రామాల్లో శాశ్వతంగా మంచినీటి సమస్యను అధిగమించేందుకు ఇకపై విలేజ్ వాటర్ బడ్జెట్‌ను తయారు చేయనున్నట్లు రాష్ట్ర పంచాయితీరాజ్ శాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. వెలగపూడి సచివాలయంలో ఆయన మంగళవారం పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నీటి సమస్య పరిష్కారానికి తాత్కాలిక చర్యలతో పాటు శాశ్వత చర్యలూ తీసుకుంటామన్నారు.

05/17/2017 - 03:16

విజయవాడ, మే 16: ఆంధ్రప్రదేశ్ మెడికల్ అండ్ హెల్త్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఎపిఎంఐడిసి) చైర్మన్‌గా నియమితులైన బిజెపి సీనియర్ నేత రంగావఝుల లక్ష్మీపతి తన పార్టీ మంత్రులు, శాసనసభ్యులు, సీనియర్ నేతలతో కలిసి మంగళవారం శాసనసభ ప్రాంగణంలోని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడును మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు.

05/17/2017 - 03:14

అమరావతి, మే 16: రాష్ట్రంలో రైతు సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని ప్రతిపక్ష నేత, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్‌రెడ్డి విమర్శించారు. అసెంబ్లీ నిరవధిక వాయిదా అనంతరం జగన్ మీడియా చిట్‌చాట్ చేశారు. ‘ప్రభుత్వానికి పివి సింధు మీద ఉన్న ప్రేమ రైతులపై లేదు. ఒక క్రీడాకారిణిగా ఆమెపై అభిమానం ఉండటంలో తప్పులేదు.

05/17/2017 - 03:12

విజయవాడ, మే 16: సమాచార శాఖ మంత్రి కాలవ శ్రీనివాసులు ఆధ్వర్యంలో అనంతపురం జిల్లా రాయదుర్గంలో వరుణయాగం ఈనెల 23వ తేదీ మంగళవారం ఉదయం 8 నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరగనుంది.

05/17/2017 - 03:11

విజయవాడ, మే 16: రాష్ట్రంలో వైద్య విద్యార్థులకు, మహిళలకు వసతి గృహాలు తక్కువగా ఉన్నాయని, వారికి మరింత మెరుగైన వౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా పెద్దఎత్తున వసతి గృహాల నిర్మాణం చేపడుతున్నామని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాస్ తెలిపారు. స్థానిక సిద్ధార్థ వైద్య కళాశాల ఆవరణలో రూ.20 కోట్లతో నిర్మించ తలపెట్టిన వసతి గృహాల సముదాయ నిర్మాణ పనులకు మంగళవారం మంత్రి శంకుస్థాపన చేశారు.

05/17/2017 - 02:34

అనంతపురం/తాడిపత్రి, మే 16: కర్నాటక రాష్ట్రం మంగళూరు సమీపంలోని ఘాట్‌రోడ్డులో మంగళవారం సాయంత్రం జరిగిన బస్సు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. మరో పది మందికి గాయాలయ్యాయి. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. మృతుల్లో హబీబా (50), మాబా ష(55), మహబూబ్‌బీ (42) ఉన్నారు. వీరంతా అనంతపురం జిల్లా తాడిపత్రికి చెందిన వారు. పోలీసులు, ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.

05/17/2017 - 02:32

అనంతపురం, మే 16: రాయలసీమలో నెలకొన్న కరవు నివారణపై రాష్ట్ర ప్రభుత్వం బూటకపు మాటలతో ప్రజలను మభ్య పెడుతోందని, తక్షణం సీమ కరవుపై దొగొచ్చి బుధవారం సాయంత్రంలోగా స్పష్టమైన ప్రకటన చేయాలని ఉభయ కమ్యూనిస్టు పార్టీల నేతలు అల్టిమేటమ్ ఇచ్చారు. మంగళవారం అనంతపురం కలెక్టరేట్ ఎదుట రాయలసీమ కరవు పరిస్థితులపై రెండు రోజుల ‘సీమ బైఠాయింపు’ నిరసన కార్యక్రమం చేపట్టారు.

05/17/2017 - 02:30

ఖమ్మం, మే 16: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వేసవిలో ఎండ వేడిమిని దృష్టిలో ఉంచుకొని అడవి జంతువుల దాహర్తిని తీర్చేందుకు అటవీశాఖ అధికారులు ప్రత్యేక ప్రణాళికలను అమలు చేస్తున్నారు. అడవుల్లో ప్రత్యేక నీటి కుంటలను ఏర్పాటు చేసి జంతువులకు తాగునీరు అందించేందుకు ప్రయత్నం చేస్తున్నారు.

Pages