S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

05/17/2017 - 02:27

విజయవాడ, మే 16: సంస్కరణలు అమలు చేసినప్పుడు విమర్శలు రావడం కొత్త కాదని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు తెలిపారు. రాష్ట్ర శాసన మండలిలో వస్తు, సేవల పన్ను (జిఎస్‌టి) బిల్లును మంగళవారం ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో ఆర్థిక సంస్కరణల్లో భాగంగా జిఎస్‌టి బిల్లును అమల్లోకి తీసుకువచ్చేందుకు కేంద్రం నిర్ణయించిందని తెలిపారు.

05/17/2017 - 02:26

గుంటూరు, మే 16: పొలిటికల్ పంచ్ అడ్మిన్ రవికిరణ్‌కు మంగళగిరి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. శాసనమండలికి సంబంధించి అసభ్యకరంగా పోస్ట్ పెట్టారని టిడిపి నాయకుడు టిడి జనార్ధన్ అసెంబ్లీ కార్యదర్శి సత్యనారాయణకు ఫిర్యాదు చేసిన విషయం విదితమే. దీంతో సత్యనారాయణ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో రవికిరణ్‌ను విచారణ పేరుతో పలుమార్లు తుళ్లూరు పోలీసుస్టేషన్‌కు రప్పించారు. చివరకు ఆయనను అరెస్ట్ చేశారు.

05/17/2017 - 00:48

అమరావతి, మే 16: వరల్డ్ హ్యాపీనెస్ ఇండెక్స్ రిపోర్టు ప్రకారం ఆంధ్రప్రదేశ్ 72వ ర్యాంకు సాధించింది. ప్రపంచ వ్యాప్తంగా హ్యాపీనెస్ ఇండెక్స్‌లో మన దేశానికి 122వ ర్యాంక్ దక్కగా ఆ లెక్క ప్రకారం దేశం సాధించిన సంతోష సూచికల స్థాయి కంటే ఆంధ్రప్రదేశ్‌లో సంతోష స్థాయి అధికంగా ఉండటం విశేషం. ఏపిలోని 13 జిల్లాల్లో శ్రీకాకుళం జిల్లా సంతోష సూచికల్లో అగ్రస్థానం నిలిచింది.

05/17/2017 - 00:47

విజయవాడ, మే 16: అసెంబ్లీ ప్రత్యేక సమావేశం జరిగిన తీరు చూస్తే సిగ్గుగా ఉందని వైసిపి ఎమ్మెల్యే రోజా వ్యాఖ్యానించారు. మంగళవారం ఆమె అసెంబ్లీ లాబీల్లో విలేఖరులతో మాట్లాడుతూ. రైతుల మీద టిడిపి ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదన్నారు. ఇతర పార్టీల ఎమ్మెల్యేలను కోట్లు పెట్టి కొన్నారన్నారు. రైతులకు మాత్రం గిట్టుబాటు ధర కల్పించటం లేదన్నారు.

05/17/2017 - 00:47

విజయవాడ (క్రైం), మే 16: విజయవాడలో కొందరు వైద్యులు తమకు డబ్బు బాకీ ఉన్న ఓ వ్యక్తిని కిడ్నాప్ చేసి నిర్బంధించి చితకబాదిన వ్యవహారం వెలుగులోకి వచ్చింది. వైద్యులకు సహకరించిన ఇద్దరు పోలీసు అధికారులపై వేటు పడింది. నగరంలో పేరుమోసిన వైద్యులు కొందమంది ఓ సిండికేట్‌గా ఏర్పడి హవా సాగిస్తున్నారు.

05/17/2017 - 00:45

విజయవాడ, మే 16: రాబోయే 45 రోజులు తనకు చాలా కీలకమని రాష్ట్ర ఐటీ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి నారా లోకేష్ చెప్పారు. మంగళవారం ఉదయం ఆయన అసెంబ్లీ ఆవరణలో విలేఖరులతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. ప్రస్తుతం పార్టీ పనులు అన్నీ అధినేత చంద్రబాబునాయుడే చూస్తున్నారన్నారు. మరో 120 రోజుల తర్వాత పార్టీ పనులపై దృష్టి పెడతానన్నారు. తన శాఖపై పట్టు సాధించిన అనంతరం పార్టీ వ్యవహారాలపైనా దృష్టి కేంద్రీ కరిస్తానన్నారు.

05/17/2017 - 00:45

విజయవాడ, మే 16: రాష్ట్ర అసెంబ్లీ కల్పిస్తున్న భద్రతా ఏర్పాట్లలో డొల్లతనం మరోసారి బయటపడింది. అసెంబ్లీ మీడియా గ్యాలరీలోకి ఇద్దరు వ్యక్తులు ప్రవేశించి కెమెరాలతో ఫొటోలు తీసిన ఘటన మంగళవారం చోటు చేసుకుంది. అసెంబ్లీ అవరణ, పరిసరాల్లో భద్రతా ఏర్పాట్లను స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్సు (ఎస్‌పిఎఫ్) పర్యవేక్షిస్తుంది. ఇందుకు స్థానిక జిల్లా పోలీసు యంత్రాంగం సహకరిస్తుంది.

05/17/2017 - 00:44

విజయవాడ, మే 16: ‘పిలవని పేరంటానికి వెళ్లి ఎన్డీఏకి మద్దతు ప్రకటించి వచ్చి ఇక్కడ రాద్ధాంతం ఎందుకు.. ఇవాళ రైతు సమస్యలపై అసలు వైసిపికి చిత్తశుద్ధే లేదు.. జీఎస్టీ బిల్లు కోసం అంతా ఎదురు చూస్తుంటే, అనుకూలమో, వ్యతిరేకమో చెప్పకుండా సభను అడ్డుకుంటున్నారు.. రాష్టప్రతి అభ్యర్థికి బేషరతు మద్దతు ప్రకటిస్తారు..

05/17/2017 - 00:43

విజయవాడ, మే 16: రైతు సమస్యపై ప్రతిపక్ష నేత జగన్‌మోహన్‌రెడ్డి మొసలి కన్నీరు కారుస్తున్నారని రాష్ట్ర మంత్రి కాలువ శ్రీనివాసులు విమర్శించారు. మంగళవారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ శాసనసభకు వైసిపి విలువ ఇవ్వడం లేదని, సభా సమయాన్ని దుర్వినియోగం చేయాలని చూస్తోందని విమర్శించారు. జీఎస్టీపై చర్చ జరిపి విలువైన సూచనలు చేస్తే బాగుంటుందని, రైతుల సమస్యలపై వైసిపి రాజకీయం చేస్తోందని ఆరోపించారు.

05/17/2017 - 00:43

విజయవాడ, మే 16: ప్రతిపక్ష వైసిపి సభ్యులకు విజ్ఞత, ఆలోచన లేదని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. మంగళవారం ఆయన అసెంబ్లీలో విలేఖరులతో కొద్దిసేపు మాట్లాడారు. ‘వైసిపి సభ్యుల తీరు విచిత్రంగా ఉంది. ఏ అంశానికి సహకరించాలో, ఎప్పుడు వ్యతిరేకించాలో కూడా తెలియడం లేదన్నారు’.

Pages