S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెయన్ ఫీచర్

11/14/2019 - 01:49

దేశానికి రెండవ రాజధానిగా హైదరాబాద్‌ను ప్రకటించాలనే డిమాండ్‌పై సర్వత్రా ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. బీజేపీ నేత, మహారాష్ట్ర మాజీ గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ రావు దేశానికి హైదరాబాద్‌ను రెండవ రాజధానిగా చేస్తే బాగుంటుందని పలువురు మేధావులు ప్రతిపాదన చేస్తున్నారని పేర్కొన్నారు. మేధావుల సూచన మంచిదే అయినా, ఈ ప్రతిపాదన ప్రస్తుతానికి బీజేపీ పరిశీలనలో లేదన్నారు.

11/13/2019 - 01:52

ప్లాస్టిక్‌ను వాడరాదంటూ నేడు ఎక్కడ చూసినా ప్రకటనలు కనిపిస్తున్నాయి. కొన్నిచోట్ల ప్లాస్టిక్ బ్యాగ్‌లను నిషేధించారు, ప్లాస్టిక్ కవర్లు కనిపిస్తే జరిమానాలు విధిస్తున్నారు. కానీ, మనం నిత్యం ప్లాస్టిక్‌ను వాడకుండా ఉండలేం. ప్లాస్టిక్ సంచులను వద్దంటున్నా మిగిలిన ప్లాస్టిక్ గురించి ఎవరూ మాట్లాడడం లేదు. ప్లాస్టిక్ అంటే ఏమిటి? ప్లాస్టిక్ సంచులతో వచ్చే సమస్యలు ఏమిటి?

11/10/2019 - 00:24

ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికలలో పార్టీ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూనో లేక అవమాన భారం భరించలేకనో రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. అలాగే, నెహ్రూ-గాంధీ కుటుంబంతో సంబంధం లేని వ్యక్తిని పార్టీ అధ్యక్షుడిగా ఎన్నుకోవాలని పార్టీ నేతలకు ఆయన సూచించారు.

11/08/2019 - 22:34

కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం భారత చరిత్రను దారుణంగా మార్చివేస్తున్నదని వామ పక్ష చరిత్రకారులు, కాంగ్రెస్‌లో ఆధిపత్యం వహిస్తున్న ఒక కుటుంబ మద్దతుదారులు గగ్గోలు పెడుతున్నారు. అయితే ఈ దిశలో ఇంకా చెప్పుకోదగిన ప్రయత్నం ప్రారంభం కాలేదని చెప్పవచ్చు. దేశ చరిత్రను తిరిగి రాయాలని స్వయంగా కేంద్ర హోమ్ మంత్రి, భాజపా అధ్యక్షుడు అమిత్ షా ఈ మధ్య పిలుపునిచ్చారు.

11/07/2019 - 01:52

దేశ తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ, తొలి హోం మంత్రి-ఉప ప్రధాని సర్దార్ వల్లభభాయి పటేల్‌లో ఎవరు గొప్ప? అనే వివాదస్పద చర్చ ఇప్పటికీ దేశవ్యాప్తంగా జరుగుతోంది. దేశ సమగ్రత, అభివృద్ధిపై దృష్టి సారించకుండా ఈ అంశాన్ని ఇంకా చర్చించాల్సిన అవసరం లేదు. అయితే, చరిత్రను సానుకూల కోణంలో చూసేందుకు గతకాలపు అంశాలను ప్రస్తావించుకోవడం తప్పేమీ కాదు.

11/06/2019 - 01:28

దేశ చరిత్ర గతిని, ప్రగతిని మార్చే అత్యంత కీలక కేసులు త్వరలోనే కొలిక్కిరానున్నాయి. సుప్రీం కోర్టులో వాదప్రతిపాదనలు పూర్తయిన నేపథ్యంలో ఈ కేసులపై తుదితీర్పులు రానున్నాయి. దీంతో యావత్ భారత్ అప్రమత్తమైంది. దేశ జనులంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న అయోధ్య భూ వివాదం, రాఫెల్ యుద్ధ విమానాల కేసు, ఆర్టీఐ చట్ట పరిధిలోకి సుప్రీం ప్రధాన న్యాయమూర్తిని తీసుకురావచ్చా? లేదా?

11/03/2019 - 01:56

ఎన్నికలకు ముందు పొత్తులు పె ట్టుకోవడం, ఎన్నికల తర్వాత మనసు మార్చుకోవడం, మరో సంబంధం వెతుక్కోవడం కొత్త విష యం కాదు. ఎంపీలు, ఎమ్మెల్యేలు కం డువాలు మార్చినంత సులభంగా పార్టీలు మారుస్తుంటే, పార్టీలు సైతం అదే రీతిలో పొత్తుల విషయంలో ఎన్నికలకు ముందు, ఎన్నికల తర్వాత తమదైన ఫార్ములాను ఫాలో అవు తున్నాయి.

11/01/2019 - 21:21

సుదీర్ఘకాలం న్యాయ వివాదాలలో చిక్కుకొని, ప్ర జల మధ్య ఎంతో అసహనానికి దారితీసి, దే శంలో మతపర ఉద్రిక్తలకు కారణమైన అయోధ్యలో రామాలయ నిర్మాణం అంశంపై చివరకు సుప్రీం కోర్టు తీర్పు ఇవ్వడానికి రంగం సిద్ధమైంది. సుమారు 135 సంవత్సరాలుగా నెలకొన్న న్యాయపరమైన వివాదానికి ఇప్పుడు సర్వోన్నత న్యాయస్థానం ముగింపు పలికే ప్రయత్నం చేయడం కీలక పరిణామం కానున్నది.

11/01/2019 - 02:05

‘అత్త పగులగొడితే పాతకుండ.. కోడలు పగులగొడితే కొత్తకుండ’ అన్నట్టు ఈ దేశంలో సూడో సెక్యులర్, లిబరల్ మేధావులు అన్నింటినీ సూత్రీకరిస్తారు. ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా దానికి ముందు స్థానికంగా జరిగే దాడులకు దేశవ్యాప్త ప్రచారం కల్పిస్తారు. ఈ దేశంలో ఇపుడు కూడా వామపక్ష శక్తుల ప్రభావం బలంగా కొన్నిచోట్ల కన్పిస్తూంది. అధికారం దృష్ట్యా కేరళ, ప్రభావం దృష్ట్యా మీడియా, కుత్సిత మేధోవర్గం దృష్ట్యా జెఎన్‌యూ..

10/31/2019 - 01:45

మన దేశచరిత్రలో అక్టోబర్ 31 చారిత్రాత్మకమైన రోజు.. అది నిజంగా సువర్ణాక్షరాలతో లిఖించదగిన రోజు. 72 ఏళ్లుగా కశ్మీర్ సమస్యకు అవరోధంగా ఉన్న 370వ అధికరణను ఈ ఏడాది ఆగస్టు 5న రాజ్యసభలో, 6న లోక్‌సభలో రద్దు చేసి నరేం ద్ర మోదీ ప్రభుత్వం సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంది. రాష్టప్రతి ఈ అధికరణం రద్దుకు ఆగస్టు 9న ఆమోదం తెలిపారు. ఫలితంగా ‘జమ్మూ కశ్మీర్ పునర్వ్యవస్థీకరణ చట్టం-2019’ ఈనెల 31 నుంచి అమలులోకి వస్తుంది.

Pages