S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెయన్ ఫీచర్

01/03/2020 - 01:50

మధ్యప్రదేశ్‌లోని నీమడ్ ప్రాంతంలో పోరాట యోధుడిగా గుర్తింపు పొందిన ‘తాంతియా భీల్’ అంటే ఆంగ్లేయులకు వెన్నులో వణుకు పుట్టేది. అలాంటి వీరుడిని నేరుగా జయించడం చేతగాని ఆంగ్లేయులు కుట్రతో మట్టుబెట్టాలని ప్రయత్నించి, అతని ఆనుపానులు తెలుసుకున్నారు. తాంతియా భీల్ ఓ స్ర్తిని తన సోదరిగా భావించేవాడు. బ్రిటీషర్లు ఆమె భర్తను లొంగదీసుకొన్నారు.

01/02/2020 - 01:00

తాము అధికారంలోకి వస్తే ఉమ్మడి పౌర శిక్షాస్మృతి (కామన్ సివిల్ కోడ్)ను అమలు చేస్తామని బీజేపీ ప్రభుత్వం ఎన్నికల ప్రణాళికలో పేర్కొని 303 సీట్లు తెచ్చుకుంది. 2019 ఎన్నికల్లో ఊహించని విధంగా మెజారిటీ సీట్లతో అధికారంలోకి వచ్చిన బీజేపీ ఎన్నికల ప్రణాళికలో ఇచ్చిన హామీని నిలబెట్టుకునేందుకు కసరత్తు చేయాలి. 2014 నుంచి అధికారంలో ఉన్నా, ఇంతవరకు ఈ దిశగా బీజేపీ ఎటువంటి ప్రయత్నం చేసినట్లు కనపడడం లేదు.

01/01/2020 - 01:58

రెండు మూడేళ్లలో భారతదేశంలో పౌర నమోదు వ్యవస్థ అందుబాటులోకి రాబోతోంది. ఇది ఆధార్‌కు మరో ముందడుగు. అంటే భారతదేశంలో ఉన్న పౌరులు అందరి జాతకాలు అందులో ఉంటాయి. దేశంలో ఉంటున్న పౌరుల్లో ఎవరు స్థానికులో, ఎవరు ఇతర ప్రాంతాల నుండి వచ్చారో ఈ రికార్డులతో తేలికగా క్షణాల్లో సమాచారం తెలుసుకునే వ్యవస్థ అందుబాటులోకి రాబోతోంది.

12/31/2019 - 00:01

గత సంవత్సరం (2018) పోతూ పోతూ కాంగ్రెస్ పార్టీలో కాసింత, కాదు.. కాదు.. బోలెడు సంతోషాన్ని నింపి వెళ్ళింది. ఐసీయూలోని పేషెంట్ లేచి వస్తే అయిన వాళ్ళకు ఎలాంటి ఆనందం కలుగుతుందో, అదిగో అలాంటి ఆనందం హస్తం పార్టీకి అనుభవంలోకి వచ్చింది. అంతవరకు వరస ఓటములతో కుదేలైపోయిన పార్టీ, 2018 చివర్లో జరిగిన మూడు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలలో విజయం సాధించి, ఊపిరి తీసుకుంది. ఆశలు పెంచుకుంది.

12/29/2019 - 02:11

2019 సాధారణ ఎన్నికలలో అనూహ్యమైన విజయం సాధించిన భాజపా వరుసగా అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం ప్రభుత్వ వ్యతిరేకత ఎదుర్కొనవలసి వస్తున్నది. 2017 నుండి గత రెండేళ్లలో వరుసగా ఆరు రాష్ట్రాలలో ఇటువంటి పరిస్థితి ఎదురైంది. వీటన్నింటికీ పరాకాష్టగా తాజాగా జరిగిన ఝార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలలో ఘోర పరాజయం ఎదుర్కొనవలసి వచ్చింది.

12/27/2019 - 04:27

ఎంతమంది స్వాతంత్య్రవీరులు తమ ప్రాణాలను బలిపెట్టి ఈ దేశానికి విముక్తి కల్పించారో, వాళ్లంతా ఈ రోజు ఇలాంటి వారికోసమా ‘మేం పోరాటం’ చేసిందని వీరస్వర్గంలో తప్పక బాధపడుతుంటారు. ప్రపంచంలో ఏ దేశంలోనూ మెజారిటీ ప్రజలు ‘తమను సమానంగా చూడమని’ అర్థించడం చూడడం సాధ్యం కాదు. ఇపుడు ముస్లింలీగ్ మళ్లీ పురుడు పోసుకుందా అన్నట్లుగా దేశంలో ఆందోళనలు మొదలుపెట్టారు.

12/26/2019 - 04:38

మరో వారం రోజుల్లో కొత్త సంవత్సరంలో అడుగుపెట్టబోతున్నాం. 2019 సంవత్సరం తెలుగు రాష్ట్రాలపై చెరగని ముద్ర వేసింది. ఆంధ్రప్రదేశ్‌లో అందరూ ఊహించిన విధంగానే టీడీపీ ప్రభుత్వం వ్యూహాత్మక తప్పిదాలతో రాజకీయంగా ఓడిపోయి ఏకాకిగా మారింది. ప్రస్తుతం అధికారంలో ఉన్న వైకాపా ప్రభుత్వం తమకు 151 సీట్లు వస్తాయని ఊహించలేదు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు వంద ప్లస్ సీట్లు వస్తాయని ఆ పార్టీ భావించింది.

12/25/2019 - 01:48

భారత రాజ్యాంగం రూపొందించిన విధానంలోనే భారతీయుల ఔన్నత్యాన్ని, విశిష్టతనూ కాపాడే ప్రయత్నం జరిగింది. రాజ్యాంగంలో తొలి విభాగాల్లో పౌరసత్వం, ప్రాథమిక హక్కులు, స్వేచ్ఛ, మత స్వేచ్ఛ, ఆదేశిక సూత్రాలు, ప్రాథమిక బాధ్యతలను రాజ్యాంగ నిర్మాతలు నిర్వచించారు. ఆ తర్వాతనే కేంద్రప్రభుత్వం, మంత్రిమండలి, పార్లమెంటు, శాసనాలను ఆమోదించడం, రాష్టప్రతి శాసనసంబంధ అధికారాలు పేర్కొన్నారు.

12/23/2019 - 21:54

ఇటీవల కేంద్ర ప్రభుత్వం జాతీయ విద్యావిధానం - 2019 ముసాయిదా బిల్లును తయారుచేసింది. ఇది చట్టంగా రూపుదాల్చక ముందే మన రాష్ట్ర ప్రభుత్వం అనేక వర్గాల వ్యక్తులతో ఉన్నత మరియు పాఠశాల విద్యా నియంత్రణ కమిటీలను ఏర్పాటుచేయడమైనది.

12/22/2019 - 02:09

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని సమస్య మళ్లీ మొదటికి వచ్చింది. చెన్నై నుంచి హైదరాబాద్ ద్వారా అమరావతి చేరిన ఈ ప్రస్థానం ప్రస్తుతానికి విశాఖ మార్గం పట్టింది. నలుగురికి ఆమోదయోగ్యమైన విధంగా అందరి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకొని సయోధ్యతో కూడిన రాజధానికి స్థల ఎంపిక 2014లో చంద్రబాబునాయుడుగారు చేసి ఉండి ఉంటే ఈనాడు ఈ సమస్య ఉత్పన్నం అయ్యుండేది కాదు.

Pages