S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెయన్ ఫీచర్

01/19/2020 - 01:09

ఫిబ్రవరి 8న జరుగనున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు మొత్తం దేశం దృష్టిని ఆకట్టుకొంటున్నాయి. ఈ ఎన్నికలు ఒక విధంగా భారత్ రాజకీయ సమీకరణాలపై నిర్ణయాత్మక పాత్ర వహించే అవకాశం ఉంది. ఈ ఎన్నికలలో ప్రధాన పోటీ దారులుగా మూడు పోటీ పార్టీలు ఉన్నప్పటికీ అధికారంపై అసలు పోటీ దారులు ప్రస్తుతం అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్), అధికారం కోసం ఆరాటపడుతున్న భాజపా ల మధ్యనే అని చెప్పవచ్చు.

01/17/2020 - 00:06

ఒకప్పుడు మనదేశంలో ‘గామా’ అనే మల్లయోధుడు ఉండేవాడు. భారతీయ శైలి మల్లయుద్ధంలో అతడు ప్రపంచ విజేత. కానీ అతడు నలభై ఏళ్ల వయసునే మరణించాడు. అవసరానికి మించి వ్యాయామం చేయడం వల్లనే అతడు మరణించాడని వైద్యులు నిర్ధారించారు. మాంసంతో తయారైన శరీరాన్ని ఉక్కుతో తయారైందని అతడు భావించాడు. తన విజయానికి శృతిమించి శరీరాన్ని బాధపెట్టాడు. ఈ పరిణామాల్లో తనను తానే చంపుకున్నాడు.

01/15/2020 - 04:16

ఇంటర్‌నెట్ వినియోగం ప్రాథమిక హక్కు కిందకు వస్తుందా లేదా అనే అంశంపై సుప్రీంకోర్టు ఇటీవల సంచలన తీర్పును వెలువరించింది. రాజ్యాంగం కల్పించిన హక్కుల ప్రకారం ఇంటర్‌నెట్ వినియోగం ప్రాథమిక హక్కు కిందకు వస్తుందని తేల్చి చెప్పింది. అయితే ఈ సందర్భంగా సుప్రీంకోర్టు ధర్మాసనం చేసిన వ్యాఖ్యలు, న్యాయపరిధిని దాటి వ్యక్తం చేసిన ఆవేదన నేటి పరిస్థితిని అద్దం పడుతోంది.

01/13/2020 - 00:01

అమరావతి... అయిదున్నర ఏళ్ల క్రితం ఉమ్మడి నుండి వైదొలిగి కొంగొత్త రూపులద్దుకొనేందుకు సాగిన పయనం. ఒడుదుడుకులు ఎదురైనా అలా...అలా... సాగుతున్న తరుణంలో ఉద్విగ్నభరిత వాతావరణం ఆవరించింది. ఇంటా, బయటా హోరెత్తిన ఆ పద చప్పుళ్లు ఒక్కసారిగా మూగబోయాయి. ఆవేదనలు, ఆక్రందనలు తెరపైకొచ్చాయి. సమన్యాయం, సమధర్మం మాటెలా ఉన్నా అంతిమ తీర్పుపైనే ప్రతి ఒక్కరి సందేహం. కారణం ఎవరు? ఎందుకిలా? ఎన్నాళ్లిలా? ఏం జరగనుంది?

01/12/2020 - 05:15

పౌరసత్వ సవరణ చట్టం (సిఏఏ)కు రాష్టప్రతి ఆమోదముద్ర వేసేవరకు దేశంలో అంతా ప్రశాంతత నెలకొంది. అయితే ఆ తర్వాత అకస్మాత్తుగా పలుచోట్ల, ముఖ్యంగా బిజెపి పాలిత రాష్ట్రాలలో హింసాయుత ఆందోళనలు ప్రారంభం అయ్యాయి. వాటితోపాటు దేశ రాజధాని ఢిల్లీలో రెండు యూనివర్సిటీలలో హింస పరాకాష్టకు చేరుకొంది.

01/10/2020 - 01:39

‘‘విత్తనాన్ని భూమిలో నాటి దానికి మట్టి, గాలి, నీరు సరిగ్గా అందిస్తే ఆ విత్తనం మట్టిగా మారుతుందా? గాలిగా మారుతుందా!? నీరుగా మారుతుందా? కానే కాదు. అది మొక్క అవుతుంది. తన సొంత పెరుగుదల నియమం ఆధారంగా అది పెరుగుతుంది. గాలినీ, మట్టినీ, నీళ్లను తనలో కలిపేసుకొని, పదార్థంగా మార్చుకొని మొక్కగా ఎదుగుతుంది’’ అంటూ ఎదుగుదల ఎలా ఉండాలో స్వామి వివేకానంద ఇలా చెప్పారు.

01/09/2020 - 01:59

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సంబంధాలు బలంగా ఉండాలి. అంతే కాని రాష్ట్రాల మీద పెత్తనం చలాయించే విధంగా కేంద్రం వ్యవహరిస్తే ఘర్షణ అనివార్యమవుతుంది. రాష్ట్రాలు కూడా దేశ సమగ్రత, అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని కేంద్రానికి వెనుదన్నుగా ఉండాలి. అంతేకాని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ మాదిరిగా అతి దూకుడుతనం పనికిరాదు.

01/08/2020 - 23:10

ఎన్నికలు వస్తున్నాయంటే చాలు యుద్ధ బూచి కొన్ని దేశాలకు కలిసొస్తోంది. యుద్ధ బూచి చూపించి గెలవాలనే తపన వివిధ దేశాల్లోని అధినేతల్లో పెరిగిపోతోంది. అమెరికాలో రానున్న ఎన్నికల్లో తన విజయానికి అనేక పాచికలు వేస్తున్న అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ భారత్ నుండి మేధోవలసను అడ్డుకట్ట వేసి స్థానిక యువతను ఆకట్టుకున్నారు. ఇపుడు రెండో పాచిక వేస్తున్నారు. ఇరాన్‌తో యుద్ధానికి కాలుదువ్వుతున్నారు.

01/06/2020 - 23:28

మన దేశ రాజకీయ చిత్రపటంలో చిత్రవిచిత్రాలకు కొదవలేదు. దేశంలో సంకీర్ణ యుగం ప్రారంభమైన అనంతర కాలంలో రా జకీయ పార్టీల నడుమ శత్రు,మిత్ర బంధాలు చిత్ర విచిత్రంగా మారి పోతున్నాయి. సుమారు ఓ పుష్కర కాలానికి ముందు మధుకోడా ఝార్ఖండ్ ముఖ్యమంత్రి అయ్యారు. అంత వరకే అయితే అదేమీ చిత్రం కాకపోవచ్చును కానీ, ఆయనో స్వతంత్ర ఎమ్మల్యే.. ఒకే ఒక్కడు ..

01/04/2020 - 22:17

ఆంధ్రప్రదేశ్‌లోని మూడు ప్రాంతాలలో మూడు రాజధానులు ఏర్పాటు చేయనున్నట్లు ముఖ్య మంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శాసనసభలో సంకేతం ఇవ్వడం, ఆ మరుసటి వారమే ప్రభుత్వం నియ మించిన జి.ఎన్. రావ్ కమిటీ ఆ మేరకు సిఫార్సులు చేయడం ఒక రకంగా కలకలం సృష్టించింది. ఈ నిర్ణయం ప్రభావం ఏ విధంగా ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి రాజకీయంగా వేసిన వ్యూహాత్మక అడుగుగా స్పష్టం అవుతున్నది.

Pages