S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సబ్ ఫీచర్

10/26/2016 - 07:25

జానపద కథలు ఆలోచనతో కూ డిన ఊహాత్మక కథనాలు. రచయిత తన ఊహను ఎంతవరకూ అందుకోగలడో అంతవరకూ ఊ హించి కథను ఆద్యంతం రక్తికట్టిస్తాడు. ఈ కథల్లో అందరినీ అలరించే అద్భుతాలుంటాయి. మనిషికి అసాధ్యమైన పనులను నాయకుడు, నాయకి సాధ్యం చేస్తుంటారు. మంత్రాలు, తంత్రాలు సైతం ఉంటాయి. ఇవన్నీ కల్పనలే అయినా పాఠకులను కొత్తకొత్త ఊహలతో ముందుకు తీసుకువెళుతుంటాయి. ఈ కథల్లో ఉన్నదంతా కల్పనే అని అనుకోనక్కర్లేదు.

10/26/2016 - 07:23

మన జాతీయ ఆదాయంలో వ్యవసాయ రంగం వాటా 12 శాతానికి తగ్గింది. అయితే, మన శ్రామికశక్తిలో 55 శాతం ఈ రంగంపైనే ఆధారపడి వుంది. ఇంతటి ప్రాముఖ్యత ఉన్న ఈ రంగాన్ని మన పాలకులు అనాదిగా పటిష్టపరచలేకపోతున్నారు. దేశంలో ఇపుడు నాలుగు కోట్ల టన్నుల మేరకు ఆహార ధాన్యాల నిల్వలు వున్నాయి. కరవుకు భయపడే పరిస్థితి లేదు. అయితే, దేశంలోని అనేక ప్రాంతాల్లో కరవును పూర్తిగా నివారించలేకపోయాం.

10/24/2016 - 23:53

ఎపి సిఎం చంద్రబాబు ఎంత మాట్లాడినా, ఏం చేస్తున్నా- అంతా అమరావతి, కోస్తా అభివృద్ధి తప్ప ఇతర ప్రాంతాల ప్రస్తావనే లేదు. రాష్ట్ర ప్రభుత్వం వివక్ష చూపుతోందనే విషయం కోస్తాంధ్ర అభివృద్ధి, రాయలసీమలో క్షామ పరిస్థితులు నిరూపిస్తాయి. మెట్టప్రాంతమైన సీమ జిల్లాల్లో దారుణ స్థితులు నేటికీ కొనసాగుతున్నాయి.

10/24/2016 - 06:49

ఆధునిక సమాజంలో ఎక్కడ చూసినా యాచకుల సంఖ్య రోజురోజుకూ అనూహ్యంగా పెరుగుతోంది. నడిరోడ్లపై, బస్టాండ్లలో, రైల్వే స్టేషన్లలో ఎక్కడ చూసినా యాచకుల బెడద తీవ్రమవుతోంది. రద్దీ రహదారులపై ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద యాచకులు అడ్డుపడుతున్నందున వాహన చోదకులు నానా ఇబ్బందులకు లోనవుతున్నారు. రహదారులపై కీలక జంక్షన్ల వద్ద యాచకులు ఇబ్బందులు సృష్టిస్తున్నా ట్రాఫిక్ పోలీసులు పట్టించుకోవడం లేదు.

10/23/2016 - 01:04

పాకిస్తాన్ ఉగ్రవాద మూకలపై మెరుపుదాడులు జరిగిన రోజు జాతి జనులు దేశ రాజకీయ నాయకత్వ దృఢచిత్తం చూసి అభినందించారు. అన్ని రాజకీయ పార్టీల వారూ మోదీ ప్రభుత్వానికి మద్దతు పలికారు. కానీ, ఆ సంతోషం ఎంతోసేపు నిలవలేదు. ప్రతిదీ రాజకీయ యాగీ చేసే మతి తప్పిన కొందరు నాయకులకు అదే కంటగింపైంది. 1971లో అప్పటి ప్రధాని ఇందిరను ‘దుర్గ’తో పోల్చిన వాజపేయికి ఉన్న రాజనీతిజ్ఞత నేటి ప్రతిపక్షంలో కానరావట్లేదు.

10/22/2016 - 01:33

నకిలీ విత్తనాలను వేసి తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్, ఖమ్మం, నల్గొండ, భూపాలపల్లి, భద్రాద్రి, కరీంనగర్ జిల్లాల్లో పత్తి, మిరప, వరి, మొక్కజొన్న రైతులు ఈ సీజన్‌లో తీవ్రంగా నష్టపోయారు. ముఖ్యంగా ఖమ్మం, రంగారెడ్డి, నల్గొండ, వరంగల్ జిల్లాల్లో లక్షా 50వేల హెక్టార్లలో మిరప పంట వేశారు.

10/22/2016 - 01:22

ఆధునిక శాస్త్ర, సాంకేతిక విజ్ఞానం రోజురోజుకూ పెరిగి మనిషి జీవితం మరింత ‘స్మార్టు’గా మారిపోతుండగా, మరో పక్క సామాజిక సమస్యలు సైతం పెచ్చుమీరుతున్నాయని ఇటీవలి సర్వేలో తేలింది. అందులో ప్రధానమైనవి ఆరోగ్య, మానసిక సమస్యలతో పాటు మానవ సంబంధాలు కూడా దెబ్బతింటున్నాయని వెల్లడైంది. తాజాగా మరో సర్వేలో మంచి పనిమంతులు కూడా కార్యాలయాల్లో సామాజిక మాధ్యమాల్లో నిమగ్నమైపోతున్నారని తేలింది.

10/20/2016 - 22:08

దేశం యావత్తూ ఏటా అక్టోబర్ 21వ తేదీన ‘పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం’ పాటిస్తూ వారి సేవలను స్ఫురణకు తెచ్చుకుంటుంది. దేశచరిత్రలో ఈ రోజుకు ఓ విశిష్ఠత ఉంది. అది.. 1959 వ సంవత్సరం అక్టోబర్ 21. ఆ రోజు తెల్లవారు జామున భారత్-చైనా సరిహద్దుల్లో హాట్ స్ప్రింగ్ లడఖ్ ప్రాంతంలో కేంద్ర రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సిఆర్‌పిఎఫ్) కు చెందిన 20 మంది జవాన్లు సబ్ ఇన్‌స్పెక్టర్ కరం సింగ్ నేతృత్వంలో గస్తీతిరుగుతున్నారు.

10/20/2016 - 03:13

తరగతి గది సమాజంలో అంతర్భాగం. విద్యార్థిపైన సమాజం ఎంత ప్రభావితం చేస్తుందో, విద్యార్థి కూడా సమాజాన్ని అంతే ప్రభావితం చేస్తాడు. సమాజం పరిధి పెద్దది కాబట్టి విద్యార్థి ప్రభావం సమాజం మీద ఏ కొద్ది పాటి ఉన్నా అది సమాజం దశను మార్చుతూ ఉంటుంది. ప్రతి సమాజానికి కొన్ని విలువలుంటాయి. కొన్ని ఆశయాలు ఉంటాయి. కొన్ని సంస్కారాలుంటాయి. ఇవన్నీకూడా ఆనాటి విద్యావిధానంపై ప్రభావం చూపుతాయి.

10/20/2016 - 03:09

రాబోయే రోజుల్లో రాష్ట్రాన్ని ‘ఎడ్యుకేషన్ హబ్’గా మారుస్తామని ఎపి సర్కారు గొప్పగా చెబుతున్నప్పటికీ ఇంటర్మీడియట్ విద్య పరిస్థితి ఇపుడు దయనీయంగా మా రింది. విద్యార్థి దశలో ఇంటర్మీడియట్ అత్యంత కీలకమైనప్పటికీ కార్పొరేట్ కళాశాలలకు కళ్లెం వేయకపోవడంతో ప్రభుత్వ జూనియర్ కళాశాలల మనుగడ నానాటికీ ప్రశ్నార్థకమవుతోంది.

Pages