S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సబ్ ఫీచర్

04/14/2020 - 01:35

కరోనా వైరస్ ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తున్న మహమ్మారి. ఈ భయంకరమైన వైరస్ ఎప్పుడు, ఎలా ఎటాక్ చేస్తుందో తెలియని పరిస్థితి.. మన చుట్టుపక్కల ఉన్నవారిలో ఎవరికి వైరస్ ఉందో తెలుసుకోవడం కూడా కష్టం. భారతదేశంలో కరోనా ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. ఏప్రిల్ 2 నాటికి 1964 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 50 మంది మరణించారు. కాగా.. కరోనా ప్రబలుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక యాప్ తీసుకువచ్చింది.

03/22/2020 - 22:54

ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు తన పంతం నెగ్గించుకున్నారు. రాష్ట్ర శాసనసభలో పౌరసత్వ సవరణ చట్టం, జాతీయ పౌర పట్టిక, జాతీయ జనాభా పట్టికలను వ్యతిరేకిస్తూ తీర్మానం చేశారు. ఈ సందర్భంలో గతంలో చెప్పిన విషయాలను పునఃప్రస్తావించారు. వీటిలో ప్రధానమైన విషయమేమిటంటే.. ఓటరుకార్డు, ఆధార్‌కార్డు, రేషన్‌కార్డు, పాస్‌పోర్టు పౌరసత్వం రుజువు చేసుకోవడానికి పనికిరావని కేంద్ర ప్రభుత్వం ప్రకటించిందని ఆయన అన్నారు.

03/20/2020 - 05:38

యుద్ధతంత్రాలు విచిత్రంగా ఉంటాయి. స్పెయిన్ దేశ చరిత్ర చదవండి.. యూరపులో యుద్ధాలు జరిగినప్పుడు అంటువ్యాధుల కంబళ్లు ఉపయోగించారు. ఒక వ్యక్తికి ఆటలమ్మ(స్మాల్‌పాక్స్) వచ్చిందనుకోండి, అతని మీద కొన్ని దుప్పట్లు కప్పాలి. ఇలా దుప్పట్లలో సూక్ష్మజీవులు ప్రవేశిస్తాయి. ఈ దుప్పట్లను శత్రుదేశాలకు పంపుతారు. ఇక విషకన్యలను పంపటం మరొక యుద్ధ తంత్రం. దీనిని చాణక్యుడు తన అర్థశాస్త్రంలో వివరించాడు కూడా.

03/19/2020 - 05:10

ఎట్టకేలకు పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)వల్ల భారతదేశ ముస్లింలకు ఎటువంటి నష్టం జరగదని కాంగ్రెసు పార్టీ అంగీకరించింది. ఢిల్లీ అల్లర్లపై పార్లమెంట్‌లో జరిగిన చర్చ సందర్భంగా రాజ్యసభలో కాంగ్రెసు నాయకుడు కపిల్ సిబాల్ ఈ విషయం చెప్పారు. హమ్మయ్య.. 52మంది పౌరులు మరణించాక, కోట్ల రూపాయల ఆస్తి అగ్గిపాలయ్యాక కాంగ్రెసు నాయకులకు ‘జ్ఞానోదయం’ కలిగింది. సంతోషం.

03/18/2020 - 23:42

శ్రీరాముడు లేని రామాయణాన్ని ఎలా వూహించలేమో అలాగే శ్రీరాముడు లేని భద్రాచలక్షేత్రాన్ని వూహించలేం. భద్రాచలంలో వున్నది ఏ దేవాలయం అని అడుగుతే, ఆసేతు హిమాచలం రామాలయం అనే జవాబిస్తారు. అక్కడ వున్నది రామనారాయణుడి గుడి అని ఒక్కడు కూడా చెప్పడు. అలాంటప్పుడు కుహనా పండితులకు ఆ మాత్రం అవగాహన, విజ్ఞానం లేకపోవడం విడ్డూరంగా ఉందనాలి.

03/17/2020 - 23:36

ప్రపంచీకరణ నేపథ్యంలో ప్రపంచమే ఒక కుగ్రామంగా మారిన క్రమంలో ‘ఆంగ్లం’ అత్యంత ప్రాముఖ్యత సంతరించుకున్నది. ప్రపంచ జ్ఞానానికి పునాది వేస్తున్న ఆంగ్ల పరిజ్ఞానం నేడు ప్రభుత్వ, ప్రైవేట్ రంగంలోను ఉన్నత ఉద్యోగాల సాధనలో కూడా కీలక పాత్ర వహిస్తుండడంలో సందేహం లేదు.

03/16/2020 - 23:42

ఎన్నో పరిణామాలు చెంది ఈ భౌగోళంపై మానవజాతి, ఇతర జంతుజాలం, ప్రాణికోటి ఉండగలిగే పరిస్థితులు రావడానికి కోట్ల సంవత్సరాల కాలం పట్టింది. ఇప్పటివరకైతే జీవరాశులు నివసించగలిగే వాతావరణ పరిస్థితులున్న గ్రహం భూమి ఒక్కటే. ఏ ప్రాణి అయినా బతుకడానికి అవసరమైన గాలి, నీరు, ఆహార పదార్థాలు దొరికే స్థలం భూమి ఒక్కటే.

03/14/2020 - 23:05

‘‘హలో! రాణాగారూ! నేను మిలింద దేవరను మాట్లాడుతున్నాను’.
‘దేవరగారూ కులాసాగా ఉన్నారా?’
‘కులాసాగా ఉంటే అర్ధరాత్రి ఎందుకు ఫోను చేస్తాను? పీకల మీదికి వచ్చింది?’
‘ఏమిటి విశేషం?’
‘రాజకార్యం? ఉదయమే రెండు కోట్ల రూపాయలు కావాలి.’
‘జోక్ వేయకండి సార్. ఎందుకు కావాలో ఎవరికి కావాలో ఏరకమైన లోన్ రూపంలో కావాలో చెప్పకుండా రెండు కోట్లు అంటే ఎలా?’

03/13/2020 - 01:30

హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీలో కొన్నాళ్ల క్రితం కంచె ఐలయ్య అనే షెపర్డ్ ‘బీఫ్ ఫెస్టివల్’ నిర్వహించాడు. ఇదేం ఉత్సవం? అని ప్రశ్నిస్తే మా తిండి మా ఇష్టం అన్నాడు. న్యూఢిల్లీలోని కేరళ హౌస్ వంటి ప్రాంతాల్లో గోమాంసం సర్వ్ చేయటంపై నిషేధం విధిస్తే స్వయంగా కేరళ ముఖ్యమంత్రి పినరాయ్ విజయన్ సపరివారంగా వచ్చి సత్యాగ్రహం చేసి, ‘మా తిండి - మా ఇష్టం’ అని రంకెలు వేశాడు.

03/12/2020 - 06:01

బుల్లెట్ రైలు వేగానికి, అభివృద్ధికి చిహ్నం. ఇప్పుడు అది అహ్మదాబాద్- ముంబాయి మధ్య పరిగెత్తనున్నది. పనులు ప్రారంభమయ్యాయి. అంటే దేశం అభివృద్ధి దిశగా పరుగులు తీస్తోంది.

Pages