S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
మెయిన్ ఫీచర్
కృష్ణుడిని మనం లీలామానుష విగ్రహుడుగా చెబుతాము. ముఖ్యంగా బాల్యంలో ఆయన చర్యలు అన్నీ లీలలే! సాధారణ వ్యక్తులకు అసాధ్యమైన పనులు. ఇక్కడే శ్రీరామచంద్రునికి ఈయనకు తేడా కనబడుతుంది. ఇద్దరు అవతార పురుషులే. అయినా ఎవరి విశిష్టత వారికి ఉన్నది. రాజభవనాలలో పెరిగినందున రాములవారికి వేరే రక్షణ అవసరం లేకపోయింది. కృష్ణుడు అలాకాక చిన్నప్పటినుంచే ప్రమాదకర పరిస్థితులను ఎదుర్కొనవలసి వచ్చింది.
తెలంగాణ రాష్ట్రంలో అత్యంత ప్రతిష్టా కరంగా నిర్వహించుకునే పండుగల్లో బోనాలు మొదటిది. మానవ సమాజంలో ప్రకృతి ఆరాధన అనాదికాలంనుంచి సాగుతూ వస్తున్నదే.
జగన్మాత నామాల్లో దుర్గామాత నామం విశిష్టమైనది. దుర్గానామం పలికేచోట శివుడి కైలాస మందిరమే ఉంటుందంటారు. దుర్గా నామాన్ని గ్రహించి, జపించి, స్మరించడంవల్ల సమస్త దేవతా నామ ఉచ్చారణ ఫలితం లభిస్తుంది. సమస్త ఆపదల సాగరాన్ని దాటడానికి, ఆరోగ్య భాగ్యం కలుగుతుంది. సంపదల వృద్ధి జరుగుతుంది. దుర్గా నామ స్మరణే దుర్భేద్యమైన రక్షణ. దుర్గా నామ స్మరణ ఎవరైతే చేస్తారో వారికి ఈతి బాధలు ఉండవని వేదసారం.
పూజ్యాయ రాఘవేంద్రాయ
సత్యధర్మ రతాయచ
భజతాం కల్పవృక్షాయ
నమతాం కామధేనవే
ఆషాఢమాస ఏకాదశి తొలైకాదశిగా వ్యవహర్తం. ఈ ఏకాదశి నాడే నరులను పాలించే నారాయణుడు క్షీరాబ్దివాసుడు శయని స్తాడని శయనైకాదశి అనీ పిలవడంకద్దు.
భగవంతుని మీద మనకి ఉండే అచంచలమైన ప్రేమను భక్తి అంటారు. భగవంతుడి మీద ప్రేమతో ఆయనకు దగ్గరై బంధువుగానో, స్నేహితునిగానో, భక్తుడిగానో, తండ్రిగానో, ఏదో విధంగా ఆయనను మనం హృదయానికి దగ్గర చేసుకొనే మార్గానే్న భక్తియోగమంటారు.
ఎవరికి వారు బతకడమంటే ఇతరులకు సాయపడడమే అన్న నీతిని బోధించేది భారతీయం ప్రకృతిని పరిరక్షించమని పదే పదేచెప్తుంది. వనస్పతియః శాంతి అని చెట్లను రక్షించేమనే భారతీయ సాంఫ్రదాయం ఉదయానే్న గోమాత దర్శనం స్పర్శనం చేయమంటుంది. గోవులను రక్షించడం ప్రథమ కర్తవ్యమని చెప్తుంది.
మన హిందూ దేశంలో ఆంజనేయుని దేవాలయం లేని గ్రామం లేదు. అంతేగాదు, ఇటీవల అభయ, భక్తాంజనేయ భారీ విగ్రహాలు జాతీయ మార్గములలో దర్శనమిస్తూ భక్తజనులకు, యాత్రికులకు ఓ విధమైన భద్రతాభావం కలుగుతుంది. ఒక్కక్షణం ఆ విగ్రహం ముందు కళ్ళు మూసుకొని దండం పెట్టుకొని సాగిపోతూంటారు ఇంకను చెప్పాలంటే పంచముఖి ఆంజనేయ విగ్రహాలు మన రాష్ట్రంలోనేగాక తమిళనాడు, దక్షిణ ప్రాంతాలలోనూ మారుతి ఆరాధన జరుగుతూంది.
సర్వమంగళకరమైన రామనామము ఎక్కడ జపించబడుతుందో అక్కడ చిరంజీవి ఆంజనేయుడు పద్మాసనారూఢుడై కొలువుతీరి ఉంటాడు. రామకథాగానం చేస్తున్న ప్రతిచోటా హనుమంతునికి ఒక ఉచితాసనం ఏర్పాటుచేయడం మన సంప్రదాయం. మాతృదేవి అంజన, పితృదేవులు కేసరిలకు వాయుదేవుని వరముచే ఉదయించిన కారణజన్ముడు చిరంజీవి హనుమ.
ఈ మధ్య విశ్వవిద్యాలయాల్లో ఆచార్యులుగా ఉన్న కొందరు పెద్దలే శ్రీరాముని, శ్రీకృష్ణుని గురించి అవాకులు చెవాకులు రువ్వుతున్నారు. శ్రీమద్రామాయణం, మహాభారతం చదివిన వారికి ఈ విమర్శలకు జవాబులు తెలుస్తాయి. కానీ ఈ కాలంలో ఆంగ్ల మాథ్యమంలో అధ్యయనం చేసిన వారికి సంస్కృత గ్రంథాలు చదివే తీరిక, అవకాశం ఉండడం అరుదు.