S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
విజయవాడ, ఆగస్టు 28: నంద్యాల ఉప ఎన్నికలో సాధించిన ఘన విజయంతో ఉండవల్లిలోని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు నివాసం లోపల, వెలుపల అంగరంగ వైభవంగా విజయోత్సవ సంబరాలు జరిగాయి.
అమరావతి, ఆగస్టు 28: ఇదే విధంగా మరో మూడేళ్లు కృషిచేస్తే నీటి కొరత తీరిపోతుందని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. ‘నీరు-ప్రగతి’ పురోగతిపై సోమవారం తన నివాసం నుంచి జిల్లా కలెక్టర్లు, ప్రజా ప్రతినిధులు, వివిధ శాఖల అధికారులతో టెలికాన్ఫరెన్స్లో మాట్లాడారు. దశాబ్దాలుగా సతమతం చేస్తున్న నీటి సమస్యను అధిగమించేందుకు చేపట్టిన ‘నీరు-ప్రగతి’ కార్యక్రమ ఫలితాలు అందే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నారు.
విజయవాడ, ఆగస్టు 28: సాయం కోసం వచ్చిన పలువురికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు బాసటగా నిలిచారు. అవసరమైన ఆర్థిక సాయం అందించారు. గుంటూరు జిల్లా పొత్తూరు నుంచి వచ్చిన గుమ్మడి సుమన్ (17) చిన్నపుడు తగిలిన దెబ్బతో ఆరోగ్యం దెబ్బతిని ఉన్న కొద్దిపాటి ఆస్తి కరిగిపోయింది. ప్రత్యేక చికిత్స చేస్తే అతడికి తెలివి వస్తుందని వైద్యులు చెప్పటంతో తల్లితండ్రులు సోమవారం ముఖ్యమంత్రిని కలిశారు.
విజయవాడ, ఆగస్టు 28: ఢిల్లీ అక్షరధామ్ తరహాలో ఏపి రాజధాని అమరావతి నగర ప్రాంతంలోనూ ప్రతిష్ఠాత్మకంగా ఒక ఆధ్యాత్మిక సంస్థను నెలకొల్పేందుకు అనువైన 30 ఎకరాల స్థలం కేటాయించాలని అక్షర్ పురుషోత్తం స్వామినారాయణ్ సంస్థ ప్రతినిధులు సోమవారం ఏపి సిఆర్డిఏ కమిషనర్ డాక్టర్ చెరుకూరి శ్రీ్ధర్ని కల్సి కోరారు. తమ సంస్థ ఆధ్వర్యంలో చేపట్టనున్న ఆధ్యాత్మిక ప్రాజెక్ట్కు సంబంధించిన ప్రతిపాదనను ప్రతినిధులు వివరించారు.
విజయవాడ, ఆగస్టు 28: నంద్యాల ఉప ఎన్నికల్లో ప్రజల తీర్పును గౌరవిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డాక్టర్ ఎన్.రఘువీరారెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. నంద్యాల ఉప ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీని ఆదరించిన ప్రజలకు రఘువీరారెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. కానీ ఆ ఆదరణ ఓట్ల రూపంలో కనబడకపోవడానికి కారణం అందరికీ తెలిసిన విషయమేనన్నారు.
నెల్లూరు, ఆగస్టు 28: ఎర్రచందనం స్మగ్లింగ్కు పాల్పడే అంతర్రాష్ట్ర ముఠా సభ్యులను నెల్లూరు టాస్క్ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలను జిల్లా ఎస్పీ పిహెచ్డి రామకృష్ణ సోమవారం విలేఖరులకు తెలిపారు. మొత్తం 21 మంది సభ్యులున్న ముఠాను పట్టుకున్నామని, వీరిలో ఇద్దరు పేరుమోసిన అంతరాష్ట్ర స్మగ్లర్లు సందింటి సుబ్బయ్య, సాదినేని సుబ్బయ్య ఉన్నారు.
విజయవాడ, ఆగస్టు 28: కేంద్ర ఆవాస్ యోజన పథకం కింద రాష్ట్రానికి తాజాగా మరో లక్షా 25వేల గృహాలు మంజూరయ్యాయి. ఈమేర సోమవారం ఉత్తర్వులు జారీకాగా దీనిపై సిఎం చంద్రబాబునాయుడు స్పందిస్తూ ప్రధాని నరేంద్రమోదీకి కృతజ్ఞతలు తెలిపారు. ఈ పథకం కింద దేశవ్యాప్తంగా 26 లక్షల గృహాలు మంజూరైతే ఒక్క ఆంధ్రప్రదేశ్కే 21 శాతం అధికంగా ఇప్పటికి మొత్తం 5లక్షల 25వేల గృహాలు మంజూరయ్యాయి.
అమరావతి, ఆగస్టు 28: పార్టీ ఉనికికి సవాలుగా మారిన నంద్యాల ఉప ఎన్నికలో వైసీపీ ఓటమికి జగన్ నియమించుకున్న కన్సల్టెంట్ ప్రశాంత్ కిశోర్ ఇచ్చిన సలహాలు, చేసిన సర్వేలే కారణమని ఆ పార్టీ సీనియర్లు విరుచుకుపడుతున్నారు. ఇకపైనా పీకేను కొనసాగిస్తే పార్టీని పీకేయించేస్తారేమోనన్న వ్యాఖ్యలు పార్టీలో వినిపిస్తున్నాయి.
మహేశ్వరం, ఆగస్టు 28: రంగారెడ్డి జిల్లాను కూరగాయల హబ్గా ప్రకటించి విమానాల ద్వారా ఇతర దేశాలకు ఎగుమతి చేస్తామన్న ముఖ్యమంత్రి కెసిఆర్.. రైతులు పండించిన కూరగాయలను కనీసం నగరానికి తరలించడానికి బస్సు సౌకర్యం కూడా కల్పించడం లేదని బిజెపి జాతీయ కార్యదర్శి మురళీధర్రావు ఆరోపించారు.
హైదరాబాద్, ఆగస్టు 28: ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమ సమయంలో రైల్రోకోలో పాల్గొన్న పలువురు రాష్ట్ర మంత్రులు సోమవారం సికిందరాబాద్లోని రైల్వే కోర్టుకు హాజరయ్యారు. రాష్ట్ర హోంశాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్, ఎక్సైజ్ శాఖ మంత్రి టి పద్మారావు రైల్వే కోర్టుకు హాజరయ్యారు. నగరశివారులోని వౌలాలీ రైల్రోకో కేసులో ఇప్పటికే మంత్రులు పలుసార్లు కోర్టుకు హాజరైన విషయం తెలిసిందే.