S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

09/27/2016 - 04:36

సంగెం, సెప్టెంబర్ 26: భూనిర్వాసితుల పక్షాన తెలంగాణ రాష్ట్ర కిసాన్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు కోదండరాంరెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్ర ముఖ్య కార్యదర్శి ఓఎస్‌డి భవానీ శంకర్‌ను కలిసినట్లు పరకాల కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి ఇనగాల వెంకట్రాంరెడ్డి తెలిపారు.

09/27/2016 - 04:35

ఏటూరునాగారం, సెప్టెంబర్ 26: ఎగువ ప్రాంతాలలో గత పదిరోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ప్రధాన ప్రాజెక్టులు నిండడంతో దిగువ ప్రాంతాలకు నీటిని విడుదల చేశారు. దీంతో జిల్లాలోని ఏజన్సీ ప్రాంతమైన ఏటూరునాగారం మండలం కేంద్రంలోని ఓడగూడెం, మానసపల్లి, హరిజన కాలనీ లోతట్టు ప్రాంతాల వారిని అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించే ప్రయత్నాలు చేపట్టారు.

09/27/2016 - 04:35

మంగపేట, సెప్టెంబర్ 26: ఎగువ ప్రాంతాల నుండి వస్తున్న వరద నీటితో క్రమంగా గోదావరి నీటిమట్టం పెరుగుతోంది. సోమవారం గోదావరి ఉద్ధృతి మరింత పెరిగింది. మండలంలోని పొద్మూరు కాలనీ, బోరు నర్సాపురం, అకినేపల్లి మల్లారం, కత్తిగూడెం, అకినేపల్లి మల్లారం ఎస్టీ కాలనీలోని పలు ప్రాంతాలతో పాటు మండలంలో పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యే అవకాశం ఉండడంతో రెవెన్యూ యంత్రాంగం అప్రమత్తమయింది.

09/27/2016 - 04:34

మంగపేట, సెప్టెంబర్ 26: మండల కేంద్రమైన మంగపేట సమీపంలోని పొద్మూర్ కాలనీలో లోతట్టు ప్రాంతానికి చెందిన పలు కుటుంబాలను మంగపేట రెవెన్యూ అధికారులు మంగపేట హైస్కూల్‌లోని పునరావాస కేంద్రానికి తరలించారు.

09/27/2016 - 04:34

ఏటూరునాగారం, సెప్టెంబర్ 26: విస్తారంగా కురుస్తున్న వర్షాలతో ఏజెన్సీ ప్రజలు అనారోగ్యాల బారిన పడకుండా వైద్య అధికారులు అప్రమత్తంగా ఉండి వైద్య సేవలందించాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి వైద్య అధికారులను ఆదేశించారు. సోమవారం ఎగువున కురిసిన వర్షాలకు ఆయా ప్రాజెక్టులనుండి నీటిని విడుదల చేయడంతో గోదావరి ముంపునకు గురయ్యే లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేసేందుకు అధికారులను అప్రమత్తం చేశారు.

09/27/2016 - 04:33

వరంగల్, సెప్టెంబర్ 26: ఎగువప్రాంతం విదర్భ, మధ్యప్రదేశ్‌లలో కురుస్తున్న భారీవర్షాలకు గోదావరిలో భారీగా వరదనీరు చేరుతుండటంతో ప్రభుత్వ హెచ్చరికల మేరకు జిల్లాయంత్రాంగం అలర్ట్ అయింది. జిల్లాలోని గోదావరి పరీవాహక ప్రాంతాల్లో ముందుజాగ్రత్తలు ప్రారంభించింది.

09/27/2016 - 04:25

గుంటూరు, సెప్టెంబర్ 26: ‘వ్యవసాయ రంగంలో అనేక సంక్షోభాలను ఎదుర్కొంటున్నాం. జాతీయ స్థాయిలో వృద్ధిరేటు గణనీయంగా తగ్గింది. విశ్వవిద్యాలయాలు స్వయం పోషకత్వంతో నిత్యనూతన పరిశోధనలను ఆవిష్క రించాలి. నాణ్యమైన విత్తనోత్పత్తితోనే లాభసాటి వ్యవసాయం చేయగలం. ఆ దిశగా అవసరమైన శాస్త్ర, సాంకేతికతలను జోడించి విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చేందుకు కృషి జరగాలి’.. అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉద్ఘాటించారు.

09/27/2016 - 04:23

గురజాల, సెప్టెంబర్ 26: గుంటూరు జిల్లా పల్నాడు ప్రాంతంలో భారీ వర్షాలతో వచ్చిన వరదలకు పంటలు పూర్తిగా దెబ్బతిని రైతులకు తీవ్ర నష్టం జరిగిందని, ప్రభుత్వం మాత్రం రైతులను పూర్తిగా విస్మరించిందంటూ వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహనరెడ్డి విమర్శించారు. వరదల వల్ల నష్టపోయిన రైతులను పరామర్శించేందుకు సోమవారం గురజాల వచ్చిన ఆయన పట్టణంలోని బ్రహ్మనాయుడు విగ్రహం సెంటర్‌లో మాట్లాడారు.

09/27/2016 - 04:21

మచిలీపట్నం, సెప్టెంబర్ 26: బందరు ఓడరేవు, పారిశ్రామికవాడ నిర్మాణానికి అవసరమైన భూములను సమీకరించేందుకు మచిలీపట్నం ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీ (మడ) సిద్ధమైంది. ఈ రెండు ప్రాజెక్టులకు అవసరమైన 33 వేల 337 ఎకరాల భూములకు సంబంధించి వారం రోజుల క్రితం ల్యాండ్ పూలింగ్ నోటిఫికేషన్ జారీ చేసిన మడ అధికారులు మంగళవారం నుండి గ్రామసభల నిర్వహణకు సిద్ధమయ్యారు. మూడురోజుల పాటు నిర్వహించనున్నారు.

09/27/2016 - 04:20

ఏలూరు/ఒంగోలు , సెప్టెంబర్ 26: అప్పులోళ్ల బాధలు భరించలేక కలెక్టరేట్‌ల వద్ద ఇద్దరు వ్యక్తులు ఆత్మహత్యాయత్నం చేశారు. సోమవారం పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు, ప్రకాశం జిల్లా ఒంగోలులో ఈ సంఘటనలు చోటుచేసుకున్నాయ. ఏలూరు కలెక్టరేట్‌లో సోమవారం ఒక వ్యక్తి చెదల నివారణకు ఉపయోగించే మందు తాగి ఆత్మహత్యాయత్నానికి ఒడిగట్టాడు. అతడిని హుటాహుటిన స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించగా, కోలుకుంటున్నాడు.

Pages