S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

08/04/2016 - 08:17

న్యూఢిల్లీ, ఆగస్టు 3: మంగళవారం అనారోగ్యం కారణంగా ఆస్పత్రిలో చేరిన కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఆరోగ్య పరిస్థితి బుధవారం నిలకడగా ఉంది. మంగళవారం రాత్రి ఆర్మీకి చెందిన రీసెర్చ్ అండ్ రెఫరల్ ఆస్పత్రిలో చేరిన ఆమెను బుధవారం పశ్చిమ ఢిల్లీలోని గంగారాం ఆస్పత్రికి తరలించారు.

08/04/2016 - 08:11

హైదరాబాద్, ఆగస్టు 3: దేవాదుల ప్రాజెక్టుకు ప్రధాన మంత్రి కృషి సించాయి యోజన కింద నిధులు ఇచ్చిందని, వచ్చే ఏడాది జూన్ వరకు పూర్తి చేయకపోతే కేంద్రం వద్ద తెలంగాణ ప్రభుత్వ ప్రతిష్ఠకు భంగం కలుగుతుందని నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు ఇంజనీరింగ్ అధికారులను హెచ్చరించారు. ఆరు నూరైనా వచ్చే ఏడాదిలోగా దేవాదుల ప్రాజెక్టు పూర్తి కావాలని మంత్రి ఆదేశించారు.

08/04/2016 - 08:10

గద్వాల, ఆగస్టు 3: వారం రోజులుగా ఎగువ ప్రాంతంలోని మహారాష్ట్ర, కర్ణాటకలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఆల్మట్టి, నారాయణపూర్ జలాశయాలకు వరదనీటి ఉధృతి పెరిగింది. బుధవారం ఆల్మట్టి ప్రాజెక్టు 26 గేట్లు అర సెంటీమీటర్ ఎత్తుకు, నారాయణపూర్ డ్యాం 17 గేట్లు ఒక మీటర్ ఎత్తుకు తెరిచి దిగువకు జూరాల వైపు నీటిని వదులుతున్నట్లు జూరాల వరద నియంత్రణ కార్యాలయ అధికారులు తెలిపారు.

08/04/2016 - 08:10

విజయవాడ, ఆగస్టు 3: రాష్ట్ర ప్రభుత్వం ఏటా రైతులకిచ్చే వ్యవసాయ రుణాల మొత్తాన్ని భారీగా పెంచింది. 2016-17 సంవత్సరానికి గాను మొత్తం 83 వేల కోట్ల రూపాయల రుణాలు అందజేయాలని నిర్ణయించింది.

08/04/2016 - 08:09

హైదరాబాద్, ఆగస్టు 3: తెలంగాణ నుండి సౌదీ అరేబియాకు ఉపాధికోసం వెళ్లిన కార్మికులను కాపాడాలని కేంద్రప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. విదేశీవ్యవహారాల మంత్రి సుష్మాస్వరాజ్‌కు రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మహమ్మద్ మహమూద్ అలీ ఈ మేరకు బుధవారం లేఖ రాశారు.

బిసిల జాబితాలో మార్పులు

08/04/2016 - 08:08

హైదరాబాద్, ఆగస్టు 3: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు వేతనాలు, అలవెన్స్‌లు సకాలంలో చెల్లించామని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు రాష్ట్ర ఆర్థిక శాఖ బుధవారం ఒక ప్రకటన విడుదల చేసింది. ఉద్యోగుల వేతనాలు, పింఛన్ల చెల్లింపులను నిలిపివేసినట్టు వచ్చిన ఆరోపణలను ప్రభుత్వం తోసిపుచ్చింది.

08/04/2016 - 08:07

నిజామాబాద్, ఆగస్టు 3: ఉత్తర తెలంగాణ జిల్లాల వరప్రదాయిని శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు చెందిన ప్రధాన కాల్వల ద్వారా నీటిని విడుదల చేశారు. రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్, వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి బుధవారం నిజామాబాద్ జిల్లాలోని ఎస్సారెస్పీని సందర్శించి ప్రధాన కాల్వల ద్వారా లాంఛనంగా నీటిని విడుదల చేశారు.

08/04/2016 - 08:02

హైదరాబాద్, ఆగస్టు 3: ఆంధ్రాకు ప్రత్యేక హోదా గురించి అన్ని పక్షాలను కలుపుకుని పోరాడకుండా, అరటాకులా నలిగిపోతున్నానని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొనడం అత్యంత విచారకరమని వైకాపా సీనియర్ నేత బొత్స సత్యనారాయణ ధ్వజమెత్తారు. విభజన సమయంలో రక్తం మరుగుతోందని చెప్పారని, ఇప్పుడు మరిగిన రక్తం ఆవిరైందా అని బాబును నిలదీశారు.

08/04/2016 - 08:02

కర్నూలు, ఆగస్టు 3: మహారాష్టల్రో కురుస్తున్న అతి భారీ వర్షాల కారణంగా శ్రీశైలం జలాశయానికి శుక్రవారం నాటికి రెండు లక్షల క్యూసెక్కుల నీరు వస్తుందని, జాగ్రత్తగా ఉండాలంటూ సెంట్రల్ వాటర్ కమిషన్ (సిడబ్ల్యుసి) బుధవారం జిల్లా కలెక్టర్‌కు సమాచారం పంపింది. కృష్ణానదిపై ఎగువన ఉన్న ఆల్మట్టి, నారాయణపూర్, జూరాల జలాశయాలు ఇప్పటికే నిండినందున వచ్చిన నీరు వచ్చినట్లే దిగువకు విడుదల చేయనున్నారు.

08/04/2016 - 08:01

హైదరాబాద్, ఆగస్టు 3: అపోలో ఆసుపత్రి పరిధిలో ఉన్న కేన్సర్ మేనేజిమెంట్ వౌలిక సదుపాయాల వ్యవస్ధ విభాగాలను ఇకపై అపోలో కేన్సర్ ఇనిస్టిట్యూట్‌లుగా మారుస్తున్నట్లు అపోలో ఆసుపత్రుల చైర్మన్ డాక్టర్ ప్రతాప్ సి రెడ్డి తెలిపారు. చెన్నై, హైదరాబాద్, న్యూఢిల్లీ, కోల్‌కొత్తా, అహ్మదాబాద్, బిలాస్‌పూర్, బెంగళూరు, మధురైలో అపోలో ఆసుపత్రుల ఇనిస్టిట్యూట్‌ల మధ్య అనుసంధానం నెలకొల్పనున్నట్లు ఆయన చెప్పారు.

Pages