S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

07/05/2016 - 02:05

నెల్లూరు కలెక్టరేట్, జూలై 4: గిరిజనులను ఏకం చేసి వారి హక్కుల కోసం, భారత దాస్య శృంఖలాలను చేధించటం కోసం అహర్నిశం పోరాడిన వ్యక్తి అల్లూరి సీతారామరాజని ఎజెసి సాల్మన్ రాజ్ కుమార్ అన్నారు. జిల్లా కేంద్రంలోని దర్గామిట్టలో ఉన్న డాక్టర్ అంబేద్కర్ భవన్‌లో సోమవారం సీతారామరాజు 120వ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు.

07/05/2016 - 02:04

ముత్తుకూరు, జూలై 4: మండలంలోని నేలటూరు గ్రామ పరిధిలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వరంగ విద్యుత్ సంస్థ దామోదరం సంజీవయ్య ఎపి థర్మల్ కేంద్రంలో సోమవారం జరిగిన ప్రమాదంలో కళ్యాణ్ (24) అనే కార్మికుడు మృతి చెందాడు. నెల్లూరు రూరల్ మండలం మాదరాజుగూడూరుకు చెందిన కళ్యాణ్ అనే యువకుడు థర్మల్ కేంద్రంలోని ఐఎన్‌సి కంపెనీలో లేబర్ కాంట్రాక్టర్‌గా పని చేస్తున్నాడు.

07/05/2016 - 02:04

వేదాయపాళెం, జూలై 4: ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు ఉన్నత విద్యాశాఖ పరిధిలో ఉన్న కళాశాలల్లో బయోమెట్రిక్ విధానాన్ని ఏర్పాటు చేయాల్సి ఉంది. అయితే ఈ విద్యాసంవత్సరానికి గాను జూలై 1వ తేది నుంచి కళాశాలల్లో బయోమెట్రిక్ విధానం అమలుపరచాలని రాష్ట్ర కౌన్సిల్ సమావేశం నిర్ణయించింది. బయోమెట్రిక్ విధానం వల్ల విద్యార్థుల హాజరు ఆధారంగా బోధన రుసుముల చెల్లింపుల పథకం అమలు జరుగుతోంది.

07/05/2016 - 02:03

నెల్లూరు, జూలై 4: అందుబాటులో ఉన్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని పోలీస్ శాఖలో విస్తృతంగా వినియోగిస్తున్నందు వల్ల నేరాలను గణనీయమైన స్థాయిలో అదుపులో ఉంచగలుగుతున్నామని రాష్ట్ర డిజిపి జెవి రాముడు పేర్కొన్నారు. సోమవారం నెల్లూరు నగరంలోఏర్పాటైన వివిధ పోలీస్ అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవానికి హాజరైన ఆయన విలేఖరుల సమావేశంలో మాట్లాడారు.

07/05/2016 - 02:02

నెల్లూరు, జూలై 4: రైతుల పేరుతో రాచర్లపాడు కిసాన్ సెజ్ నిర్వాహకులు భూ దందాకు పాల్పడుతున్నారని జిల్లా ఫార్మర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ గౌరవాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే కాటంరెడ్డి విష్ణువర్ధన్‌రెడ్డి ఆరోపించారు.

07/05/2016 - 02:02

నెల్లూరు, జూలై 4: వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి మొక్కలు నాటడానికి సంబంధిత అధికారులందరూ సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ జానకి ఆదేశించారు. సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వన మహోత్సవంపై కలెక్టర్ జానకి సమీక్షించారు.

07/05/2016 - 01:59

కర్నూలు, జూలై 4 : రాష్ట్రంలోని ప్రజల సమగ్ర సమాచారం సేకరించేందుకు ప్రభుత్వం సన్నద్ధమైంది. అందులో భాగంగా ఈ నెల 7వ తేదీ నుంచి ఇంటింటి సర్వే(స్మార్ట్ పల్స్ సర్వే)కు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. సర్వే అనంతరం రాష్ట్రంలో నివసిస్తున్న ప్రతివ్యక్తికి సంబంధించిన వివరాలు ప్రభుత్వం వద్ద ఉండేలా కార్యక్రమాన్ని రూపొందించారు.

07/05/2016 - 01:59

నంద్యాల, జూలై 4 : నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డిపై సోమవారం జ్యుడీషియల్ ఫస్టుక్లాస్ మేజిస్ట్రేట్ రామ్మోహన్‌రావు నాన్‌బెయిలబుల్ వారెంటు జారీ చేశారు. భూమా నాగిరెడ్డి సోమవారం కోర్టుకు హాజరు కావాల్సి ఉండగా గౌర్హాజరు కావడంతో ఫస్టుక్లాస్ మెజస్ట్రేట్ కోర్టు నాన్ బెయిలబుల్ వారెంటు జారీ చేసినట్లు నంద్యాల త్రీటౌన్ ఎస్‌ఐ సౌర్యవౌలి తెలిపారు.

07/05/2016 - 01:58

కర్నూలు అర్బన్, జూలై 4:రాయలసీమ యూనివర్శిటీ ప్రత్యేక ప్రణాళికతో సుస్థిర అభివృద్ధి వైపు అడుగులు వేస్తుందని ఆర్‌యూ వైస్ ఛాన్సలర్ ఆచార్య వై.నరసింహులు పేర్కొన్నారు. వర్శిటీలోని తన ఛాంబర్‌లో మంగళవారం విసి పాత్రికేయుల సమావేశం లో మాట్లాడారు. వర్శిటీలో జరుగుతు న్న అభివృద్ధి పనులను మరింత బలోపేతం చేసేందుకు ప్రత్యేక ప్రణాళిక ఏర్పాటు చేశామన్నారు.

07/05/2016 - 01:58

కర్నూలు, జూలై 4:ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఈ నెల 16వ తేదీ శ్రీశైలం వస్తున్న సందర్భంగా పూర్తిస్థాయిలో భద్రతా చర్యలు చేపట్టాలని ఎస్పీ ఆకే రవికృష్ణ జిల్లా పోలీసు అధికారులను ఆదేశించారు. పుష్కరాల బందోబస్తు శిక్షణలో భాగంగా నగరంలోని జిల్లా పోలీసు కార్యాలయంలో ఉన్న వ్యాస్ ఆడిటోరియంలో 4వ బ్యాచ్ పోలీసులకు తరగతులు నిర్వహించారు.

Pages