S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

06/19/2016 - 02:29

హైదరాబాద్: వాయుసేన చరిత్రలో నూతనాధ్యాయం మొదలైంది. యుద్ధ విమాన పైలట్లు (ఐఏఎఫ్ ఫైటర్ స్క్వాడ్రన్)గా ముగ్గురు మహిళలు శిక్షణ పూర్తి చేసుకున్నారు. దుండిగల్ ఎయిర్‌ఫోర్స్ అకాడమిలో శనివారం నాటి గ్రాడ్యుయేటింగ్ ట్రైనీల పాసింగ్ ఔట్ పరేడ్‌లో కేంద్ర మంత్రి మనోహర్ పారికర్ చేతుల మీదుగా పత్రాలు అందుకుని ‘్భరత వాయుసేన చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదిగిన రోజు ఇది’ అని ఆయన నుంచి ప్రశంసలు అందుకున్నారు.

06/19/2016 - 02:43

హైదరాబాద్, జూన్ 18: భారత వాయుసేనను ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో బలోపేతం చేస్తున్నామని, వాయుసేనలో చేరిన యువ పైలెట్లు దేశం సైనికపరంగా ఎదుర్కొంటున్న సవాళ్లను వీరోచితంగా తిప్పిగొట్టాలని కేంద్ర రక్షణ మంత్రి మనోహర్ పారికర్ పిలుపునిచ్చారు.

06/19/2016 - 02:25

హైదరాబాద్, జూన్ 18: టాటా-బోయింగ్ ఏరో స్పెస్ యూనిట్‌కు కేంద్ర రక్షణ మంత్రి మనోహర్ పారికర్ శనివారం శంకుస్థాపన చేశారు. దేశంలో ప్రతిష్టాత్మకమైన టాటా కంపెనీ, వందేళ్లు పూర్తిచేసుకున్న బోయింగ్ కంపెనీ సంయుక్తంగా ఏర్పాటు చేసిన ఏరో స్పేస్ యూనిట్‌ను రంగారెడ్డి జిల్లా ఆదిభట్లలో ప్రారంభించారు. రెండు నెలల్లో రక్షణ రంగ ఉత్పత్తులను ఈ యూనిట్ ప్రారంభిస్తుందని పారికర్ అన్నారు.

06/19/2016 - 02:24

విశాఖపట్నం/ న్యూఢిల్లీ, జూన్ 18: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం స్థిరంగా కొనసాగుతోంది. దీని ప్రభావంతో రాగల 24 గంటల్లో కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు శనివారం రాత్రి తెలిపారు. కోస్తాంధ్రలో ఒకటి, రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.

06/19/2016 - 02:16

న్యూఢిల్లీ, జూన్ 18: ప్రభుత్వం రూపొందిస్తున్న కొత్త విద్యా విదానం కింద పాఠశాలల్లో యోగాకు అధిక ప్రాధాన్యం ఇవ్వనున్నారు. వచ్చే విద్యాసంవత్సరం నుంచి (2016-17) ఆరు కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో యోగా విభాగాలు ప్రారంభమవుతున్నాయని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి స్మృతి ఇరానీ తెలిపారు.

06/19/2016 - 02:46

విజయవాడ, జూన్ 18: మధ్యవర్తుల ప్రమేయం లేకుండా ప్రభుత్వ ప్రయోజనాలను నిజమైన లబ్ధిదారులకు చేర్చడం కోసమే స్మార్ట్ పల్స్ సర్వే నిర్వహిస్తున్నట్టు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెప్పారు. ఇది ప్రజలందరి సంపూర్ణ వివరాలకోసం చేపడుతున్న సర్వే అని, సంక్షేమ కార్యక్రమాలకు మాత్రమే పరిమితం కాబోదన్నారు.

06/19/2016 - 02:46

గుంటూరు, జూన్ 18: ఆంధ్రప్రదేశ్ రాజధానిలోని ప్రభుత్వ భవనాల నిర్మాణం తాత్కాలికమా? శాశ్వతమా? అనేది అంతుపట్టడం లేదు. ముఖ్యమంత్రి పదే పదే తాత్కాలిక భవనాలేనని చెబుతున్నా, చేసే ఖర్చు, నిర్మాణాల తీరు చూస్తే శాశ్వత భవనాలను తలపిస్తున్నాయి. ఓవైపు 750 కోట్ల రూపాయల వ్యయంతో తాత్కాలిక సచివాలయ భవనాలను కడుతుండగా, దాని ఎదురుగానే అసెంబ్లీ భవన సముదాయాన్నీ ఇటీవలే ప్రారంభించారు. దీనికి అంచనా వ్యయంపై స్పష్టత రాలేదు.

06/19/2016 - 02:50

విశాఖపట్నం, జూన్ 18: కాశ్మీర్ పేరు చెబితే స్పురించేది తియ్యటి యాపిల్స్. మనకు సదా అందుబాటులో ఉండే యాపిల్స్ అత్యధిక శాతం కాశ్మీర్, సిమ్లా ప్రాంతాల నుంచే దిగుమతి అవుతుంటాయి. మనం తినే యాపిల్స్‌ను మనమే పండిస్తే పోలా అన్న అలోచన స్పురించడంతో మన శాస్తవ్రేత్తలు ఆ దిశగా అడుగులు వేశారు.. విజయం సాధించారు. చింతపల్లిలోని ఆచార్య రంగా వ్యవసాయ పరిశోధన కేంద్రం శాస్తవ్రేత్తలు చేసిన ప్రయోగాలు ఫలించాయి.

,
06/19/2016 - 02:20

రాజకీయాల్లో నైతిక విలువలు నేతిబీర చందం. రాజకీయాల్లో నైతిక విలువలు దిగజారుతున్నాయని, తాము విలువల ప్రాతిపదికన రాజకీయాలు చేస్తున్నామని, అసలు తామొక్కరే నైతిక మడి కట్టుకున్నామని ఎవరైనా చెబితే, సదరు నైతికమూర్తుల వ్యక్తిత్వాన్ని నిలువునా శంకించాల్సిన రోజులివి. తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి ఈమధ్య ఫిరాయింపు రాజకీయాలపై వాపోయారు. రాజకీయాలు ఇంతగా దిగజారాయని మహా ఆవేదన చెందారు.

06/19/2016 - 00:54

రెండు రాష్ట్రాల్లో పరిపాలన నడిచినా, నత్తలా సాగినా, సాగకపోయినా ‘అభివృద్ధి’ మాత్రం పరుగులు తీస్తున్నది. ఓసారి అటు ఓమాటు ఇటు, అభివృద్ధి తక్కెడ ఎక్కువ తక్కువలు రెండు వేపులా సమంగా.
ఇక్కడే కాదు, దేశం మొత్తం మీద అభివృద్ధి మంత్రం వీస్తున్నది. పాలకులు దానిమీద తమ ప్రాణాలు నిలుపుకుంటున్నారు. అదేపనిగా దాని నామ స్మరణం. దానినే రామనామంలా పఠిస్తున్నారు.

Pages