S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
కంఠేశ్వర్, ఏప్రిల్ 14: దేశంలో దళితులపై కేంద్రంలోని బిజెసి సర్కార్ దాడులకు ఉసిగొల్పుతూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తోందని సిపిఐ జాతీయ నాయకుడు నారాయణ ఆరోపించారు. గురువారం నగరంలోని బస్వాగార్డెన్లో జరిగిన ఓ వివాహ కార్యక్రమానికి హాజరైన ఆయన, స్థానిక విలేఖరులతో మాట్లాడారు.
కంఠేశ్వర్, ఏప్రిల్ 14: దేశంలో వ్యవసాయ మార్కెట్లను అనుసంధానం చేసేందుకు ప్రధాన మంత్రి నరేంద్రమోడీ ఇ-ట్రేడింగ్(నామ్) విధానాన్ని ప్రవేశపెట్టడం జరిగిందని, దీనిని రైతులు సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర మార్కెటింగ్ శాఖ మంత్రి టి.హరీశ్రావు పేర్కొన్నారు. గురువారం నగరంలోని మార్కెట్ యార్డులో ప్రధాని నరేంద్రమోడీ నామ్ను ప్రవేశపెట్టే సందర్భంగా మంత్రి హరీశ్రావు అట్టి ఫైలాన్ను ఆవిష్కరించారు.
బాన్సువాడ, ఏప్రిల్ 14: భారత రాజ్యాంగ నిర్మాత ఆశయాల సాధనే లక్ష్యంగా తెరాస ప్రభుత్వం పాలన కొనసాగిస్తోందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్రెడ్డి పేర్కొన్నారు. బాన్సువాడ పట్టణంలోని టిఆర్ఎస్ కార్యాలయంలో గురువారం ఆయన అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన కార్యక్రమంలో పాల్గొని అంబేద్కర్ విగ్రహం వద్ద శ్రద్ధాంజలి ఘటించారు.
నిజామాబాద్, ఏప్రిల్ 14: దళితుల అభ్యున్నతికి పెద్దపీట వేస్తూ వారి సంక్షేమానికి తెరాస ప్రభుత్వం భారీగా నిధులు వెచ్చిస్తోందని, ఇటీవల ప్రవేశపెట్టిన 2016-17బడ్జెట్లో 40శాతం నిధులను కేటాయించడమే ఇందుకు నిదర్శనమని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్రెడ్డి పేర్కొన్నారు.
నిజామాబాద్, ఏప్రిల్ 14: బంగారు తెలంగాణ నిర్మాణంలో భాగంగా తెరాస ప్రభుత్వం అమలు చేస్తున్న మిషన్ కాకతీయ కార్యక్రమం దేశానికే ఆదర్శంగా నిలుస్తూ జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అందరి దృష్టిని ఆకర్షిస్తోందని రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి టి.హరీష్రావు అన్నారు.
జడ్చర్ల, ఏప్రిల్ 14: ప్రతి ఇంటికి ఇంకుడుగుంతల నిర్మాణం చేపట్టి గ్రామాభివృద్ధి కోసం అందరు కలిసి తోడ్పడాలని రాష్ట్ర వైద్య,ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి పిలుపునిచ్చారు.మండల పరిధిలోని బూరెడ్డిపల్లి గ్రామంలో గురువారం నిర్వహించిన రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేడ్కర్ 125 జయంతి వేడుకలల్లో పాల్గొన్న ఆయన ఈసందర్బంగా ఎర్పాటు చేసిన కార్యక్రమంలో గ్రామస్థులనుద్ధేశ్యించి ప్రసంగించారు.తాము న
మక్తల్, ఏప్రిల్ 14: రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహేబ్ అంబేద్కర్ ఆశయసిద్ధి కోసం ప్రతి ఒక్కరు పాటుపడాలంటూ మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రాంమోహన్రెడ్డి అన్నారు. గురువారం మక్తల్ పట్టణంలో వివిధ రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు, ప్రైవేట్ పాఠశాలల ఆధ్వర్యంలో 125వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వసించారు.
మహబూబ్నగర్, ఏప్రిల్ 14: రాష్ట్రంలో రోడ్ల మరమ్మత్తులకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతను ఇస్తుందని మహబూబ్నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్గౌడ్ తెలిపారు. గురువారం మహబూబ్నగర్ పట్టణంలోని మెట్టుగడ్డ నుండి పిల్లలమర్రికి వేళ్లే రోడ్డు వెడల్పు పనులకు ఎమ్మెల్యే శ్రీకారం చుట్టారు.
మహబూబ్నగర్, ఏప్రిల్ 14: రాష్ట్ర ప్రజానికానికి, రైతాంగానికి కరెంట్ కష్టాలు తీరుస్తామని ముఖ్యంగా రైతులకు హామీ ఇచ్చిన 9 గంటల విద్యుత్ సరఫరా వాగ్ధానాన్ని నెరవేర్చిన ఘనత ముఖ్యమంత్రి కెసిఆర్కే దక్కిందని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి అన్నారు.
ధన్వాడ, ఏఫ్రిల్ 14: ధన్వాడ మండల కేంద్రంలో రెండు బాల్య వివాహలను అడ్డుకున్నట్లు ధన్వాడ మండల తహశీల్దార్ శంకరయ్య తెలిపారు.