S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

11/21/2015 - 10:36

నెల్లూరు , నవంబర్ 20: రోడ్డు మార్గాన నెల్లూరు వస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రయాణిస్తున్న కారు నెల్లూరు నగరంలో మద్రాస్ బస్టాండ్ సమీపంలో నీటిగుంటలో దిగిపోయింది. వెంటనే సెక్యూరిటీ సిబ్బంది అప్రమత్తమయి మరో కారు సిద్ధం చేయడంతో సిఎంను ఆ కారులో ఎక్కి మన్సూర్‌నగర్ వైపు పయనమయ్యారు. ఈ సంఘటన శుక్రవారం రాత్రి నగరంలోని వరద ముంపు ప్రాంతాలను పరిశీలించడానికి వెళ్తుండగా చోటుచేసుకుంది.

11/21/2015 - 06:07

హైదరాబాద్, నవంబర్ 20: తెలుగుదేశం పార్టీ అధినేత ఎన్ చంద్రబాబునాయుడు కోడలు, సినీనటుడు బాలకృష్ణ కుమార్తె నారా బ్రహ్మణి ప్రజాసేవకు అరంగేట్రం చేశారు. నారా లోకేష్‌తో వివాహం జరిగిన నాటి నుండి కుటుంబ వ్యాపార వ్యవహారాలను చూస్తూ వచ్చిన బ్రహ్మణి తొలిసారి ఎన్టీఆర్ ట్రస్టు ట్రస్టీ హోదాలో శుక్రవారం నాడు పాత్రికేయుల ముందుకు వచ్చారు. ట్రస్టు తరఫున చేస్తున్న , చేయబోయే కార్యక్రమాలను ఆమె వివరించారు.

11/21/2015 - 06:02

వరంగల్, నవంబర్ 20: వరంగల్ ఉప ఎన్నికలో గెలుపోటములపై ఎవరి ధీమాలో వారున్నారు. పార్లమెంటు ఉప ఎన్నికలో 23 మంది అభ్యర్థులు బరిలో ఉన్నప్పటికీ అధికార టిఆర్‌ఎస్, కాంగ్రెస్, బిజెపిల మధ్యే త్రిముఖ పోటీ నెలకొంది. వీరితో పాటు వైఎస్సార్‌సిపి అభ్యర్థి నల్లా సూర్యప్రకాష్, వామపక్షాలు బలపర్చిన స్వతంత్ర అభ్యర్థి గాలి వినోద్‌కుమార్ కూడా ఎన్నికల ప్రచారాన్ని దీటుగానే కొనసాగించారు.

11/21/2015 - 06:02

వరంగల్, నవంబర్ 20: వరంగల్ పార్లమెంటు ఉప ఎన్నికకు సర్వం సిద్ధమైంది. ఈ నెల 21న (నేడు) జరిగే పోలింగ్ కోసం యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. వరంగల్ పార్లమెంటు పరిధిలోని ఏడు నియోజకవర్గాల పరిధిలో జరిగే పోలింగ్‌లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా జిల్లా యంత్రాంగం పకడ్బందీగా ఏర్పాట్లు చేశారు. అందుకోసం 20 కంపెనీల భద్రతా దళాలు మోహరించారు.

11/21/2015 - 06:01

రఘునాథపల్లి, నవంబర్ 20: వరంగల్ పార్లమెంటు ఉప ఎన్నికలో విధులు నిర్వర్తించడానికి వరంగల్ జిల్లా రఘునాథపల్లికి వచ్చిన మెదక్ జిల్లా చిరాకులపల్లి పోలీసుస్టేషన్‌కు చెందిన పిసి నెంబర్ 1574 గల మునిగెల రాజ్‌కుమార్(48) మండల తహశీల్దార్ కార్యాలయంలో శుక్రవారం అనారోగ్యంతో మృతిచెందాడు.

11/21/2015 - 06:01

శ్రీశైలం, నవంబర్ 20: శ్రీశైలం జలాశయానికి దిగువన ఎడమగట్టు పరిధిలో తెలంగాణ జెన్‌కో ఆధ్వర్యంలో కోట్ల రూపాయలతో నిర్మిస్తున్న ఓవర్ రివర్ వ్యూ డ్యామ్‌కు గురువారం రాత్రి భారీ గండి పడింది. దీంతో రూ.2 కోట్ల మేరకు నష్టం వాటిల్లినట్లు సమాచారం. 2003 నుంచి ఈ టెయిల్ పాండ్ (ఓవర్ రివర్ వ్యూ) డ్యామ్ నిర్మిస్తున్నారు. సుమారు 90 శాతం పనులు పూర్తయ్యాయి.

11/21/2015 - 06:00

సిద్దిపేట, నవంబర్ 20 : తెలంగాణ ప్రభుత్వం భూ సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేక చట్టం తీసుకొస్తుందని, రద్దు బదిలీ పథకం, సాదాబైనామాలపై పట్టా అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు నీటి పారుదల శాఖ మంత్రి హరీష్‌రావు వెల్లడించారు. మెదక్ జిల్లా సిద్దిపేటలో శుక్రవారం సాయంత్రం అంబేద్కర్ భవన్‌లో అకాల వర్షాలకు దెబ్బతిన్న ఇళ్ల బాధితులకు నష్టపరిహారం చెక్కులు అందజేశారు.

11/21/2015 - 06:00

నల్లగొండ, నవంబర్ 20: తెలంగాణ జిల్లాల్లో ఖరీఫ్ ధాన్యం, పత్తి దిగుబడుల అమ్మకాల్లో రైతన్నల కష్టాలు కొనసాగుతున్నాయి. కరవుతో దెబ్బతిన్న పంటల నుండి దక్కిన అరకొర దిగుబడులను వ్యయప్రయాసల మధ్య కొనుగోలు కేంద్రాలకు తరలించి విక్రయిస్తే సకాలంలో డబ్బులు అందక రైతన్నలు మరిన్ని ఇబ్బందులు పడుతున్నారు.

11/21/2015 - 05:59

కరీంనగర్, నవంబర్ 20: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న, పోలీస్ శాఖను కుదిపేస్తున్న ఎఎస్‌ఐ మోహన్‌రెడ్డి ఉదంతంలో సిఐడి, పోలీస్, ఎసిబి, ఐటి శాఖలు చతుర్ముఖ వ్యూహంతో ముందుకెళ్తున్నాయి.

11/21/2015 - 05:58

హైదరాబాద్, నవంబర్ 20: సీనియర్ విద్యార్థుల వేధింపులకు లోనైన ఓ ఇంజనీరింగ్ విద్యార్థి అవమానం భరించలేక ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన నగరంలోని కెపిహెచ్‌బి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.

Pages