S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్/లీగల్

07/16/2019 - 02:03

ఉప్పల్, జూలై 15: అనుమానాస్పదస్థితిలో ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన మేడిపల్లి పోలీసుస్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం మల్లాపూర్ సూర్యనగర్‌లో నివసిస్తున్న బిందేశ్వర శర్మ (60), అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఈ నెల 14న ఇంట్లో నుంచి ఎవరికి చెప్పకుండా బయటకు వచ్చాడు. బోడుప్పల్ ప్రాంతంలో అపస్మారకస్థితిలో పడి ఉండగా పెట్రోలింగ్ పోలీసులు గాంధీ ఆసుపత్రిలో చేర్పించారు.

07/16/2019 - 02:03

దిల్‌సుఖ్‌నగర్, జూలై 15: గ్యాస్ లీక్ చేసుకొని ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన చైతన్యపురి పోలిస్‌స్టేషన్ పరిదిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. యాదవ్‌నగర్ కాలనీ రోడ్డు నెంబరు-3లో నివాసముండే అనురాగ్ (30) అనే యవకుడు వృత్తి రీత్యా ప్రైవేట్ ఉద్యోగి. తల్లిదండ్రులు, బంధువులు తిరుపతికి వెళ్లారు.

07/16/2019 - 02:02

పరిగి, జూలై 15: ఐదు సంవత్సరాల చిన్నారిపై 55 సంవత్సరాల వ్యక్తి అత్యాచార యత్నం చేసిన సంఘటన వికారాబాద్ జిల్లా పూడూరు మండలం ఉమ్మెంతాల్ గ్రామంలో జరిగింది. పరిగి సీఐ మొగులయ్య కథనం ప్రకారం పూడూరు మండలం ఉమ్మెంతాల్ గ్రామంలో ఐదు సంవత్సరాల చిన్నారిని గ్రామానికి చెందిన రాయికోటి చాక్‌లేట్లు ఇప్పిస్తాననని, సెల్‌ఫోన్‌లో బొమ్మలు చూపిస్తానని గదిలోకి తీసుకెళ్లి అత్యాచార యత్నం చేశాడు.

07/16/2019 - 02:02

మేడ్చల్, జూలై 15: జిల్లా బాలల రక్షణ అధికారులు సోమవారం మేడ్చల్ మండలం డబిల్‌పూర్ ఎక్స్ రోడ్డు వద్ద గల శ్రీరామా స్పిన్నింగ్ మిల్స్ లిమిటెడ్ కంపెనీపై దాడి నిర్వహించి 15 మంది బాలకార్మికులకు విముక్తి కల్పించారు.

07/16/2019 - 01:19

హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన స్టీల్ వ్యాపారి తేలప్రోలు రాంప్రసాద్ హత్యకేసును పంజాగుట్ట పోలీసులు ఛేదించారు. ఆర్థిక లావాదేవీల వివాదం వల్లే విజయవాడకు చెందిన వ్యాపారవేత్త కోగంటి సత్యం ఈ హత్య చేయించినట్లు పోలీసులు తెలిపారు.

07/16/2019 - 00:56

కదిరి: పురాతన శివాలయంలో ఉన్న గుప్తనిధులపై కనే్నసిన దుండగులు ఏకంగా ముగ్గురిని చంపి వారి రక్తంతో శివలింగానికి రక్త్భాషేకం చేశారు. హత్యకు గురైన ముగ్గురిలో ఇద్దరు మహిళలు ఉన్నారు. ఈ దారుణం అనంతపురం జిల్లా తనకల్లు మండలం కోర్తికోటలో ఆదివారం అర్ధరాత్రి జరిగింది. ఆలయం వద్దే ఆరుబయట నిద్రిస్తున్న శివరామిరెడ్డి(68), ఆయన సోదరి సత్యలక్ష్మి(70), మరో భక్తురాలు కమలమ్మ(75) గొంతుకోసి హత్య చేశారు.

07/15/2019 - 23:26

హైదరాబాద్ : బీజేపీ జాతీయ ప్రధానకార్యదర్శి మురళీధరరావు సహా ఎనిమిది మంది తనను మోసం చేశారని, దీనిపై తాము పెట్టిన కేసు దర్యాప్తు సరిగ్గా జరగడం లేదని పేర్కొంటూ టీ. ప్రవర్ణారెడ్డి అనే మహిళ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

07/16/2019 - 01:28

మంచిర్యాల: తమ పేరుపైన ఉన్న భూమిని కొందరు దొంగపట్టా చేయించుకున్నారని పట్టా రద్దు చేసి తమ పట్టా ఇప్పించాలని బాధితుడు కలెక్టరేట్ ముందు ఆత్మహత్యా యత్నానికి పాల్పడటం సంచలంన సృష్టించింది.

07/15/2019 - 04:46

కీసర, జూలై 14: కారు ఆయిల్ ట్యాంకర్‌ను ఢీకొట్టిన ఘటనలో నలుగురికి తీవ్రగాయలైన సంఘటన రింగ్‌రోడ్డుపై జోటు చేసుకుంది. సీఐ నరేందర్ గౌడ్ తెలిపిన విరరాల ప్రకారం నల్గొండ జిల్లాకు చెందిన శ్యాంసుందర్ భార్య జ్యోతి, కూతుళ్లు మేఘన, గాయత్రితో కలిసి మారుతి జెన్ కారులో బాసర వెళ్లేందుకు రింగ్‌రోడ్డు ఎక్కాడు.

07/15/2019 - 04:39

లింగాలఘణపురం, జూలై 14: భూ తగాదా విషయంలో తండ్రిపై కుమారుడు గొడ్డలితో దాడి చేసిన ఘటన జనగామ జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... లింగాలఘణపురం గ్రామానికి చెందిన ఎడ్ల బసవయ్యకు నాలుగు ఎకరాల పట్టా భూమి ఉంది. కుటుంబ ఆర్థిక పరిస్థితుల వలన ఒక ఎకరం భూమి గతంలో అమ్ముకున్నాడు. మిగిలిన 3 ఎకరాల భూమి నుంచి 2 ఎకరాల భూమి తన కుమారుడైన ఎడ్ల చంద్రయ్యకు పట్టాచేశారు.

Pages