S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్/లీగల్

02/22/2019 - 01:58

విజయవాడ (క్రైం), ఫిబ్రవరి 21: అక్రమాస్తుల కేసులో అరెస్టయిన ఏస్టేట్ ఆఫీసర్ రాచూరి శివరావు డిప్యుటేషన్‌ను రాష్ట్ర పర్యాటక సాధికారిక సంస్థ రద్దు చేసింది. ఏపీ టూరిజిం మేనేజింగ్ డైరెక్టర్ కార్యాలయంలో ఎస్టేట్ ఆఫీసర్‌గా పని చేస్తున్న ఆర్ శివరావు ఇళ్లపై సోదాలు నిర్వహించిన అవినీతి నిరోధక శాఖ అధికారులు కోట్ల రూపాయల అక్రమాస్తులు గుర్తించిన విషయం తెలిసిందే.

02/22/2019 - 01:44

ఉప్పల్, ఫిబ్రవరి 21: ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న సంఘటన మేడిపల్లి పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది.

02/21/2019 - 22:52

ధర్మవరం, ఫిబ్రవరి 21: మండలంలోని నిమ్మలకుంట గ్రామానికి చెందిన రమేష్ (35) విద్యుత్ షాక్‌తో గురువారం మృతి చెందాడు. వివరాల్లోకి వెళితే నిమ్మలకుంట గ్రామంలో రమేష్ తన ఇంటిలో విద్యుత్ రాలేదని, విద్యుత్ స్తంభం పైకి ఎక్కి వాటిని అమర్చేందుకు ప్రయత్నించే సమయంలో విద్యుత్‌షాక్‌కు గురై కిందపడినట్లు స్థానికులు తెలిపారు.

02/21/2019 - 22:52

చిలమత్తూరు, ఫిబ్రవరి 21 : మండల పరిధిలోని కోడూరు సమీపంలో కారు బోల్తా పడిన ఘటనలో వెంకటేష్ (40) అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు గోరంట్ల మండలం చలమయ్యగారిపల్లికి చెందిన వెంకటేష్ కనిశెట్టిపల్లికి చెందిన మహిళను వివాహం చేసుకుని అక్కడే స్థిరపడ్డాడు. ట్రాక్టర్ డ్రైవర్‌గా జీవనం సాగిస్తున్నాడు.

02/21/2019 - 22:45

చేబ్రోలు, ఫిబ్రవరి 21: ఆదమరచి నిద్రపోతున్న సమయంలో ప్రమాదవశాత్తు జరిగిన నిప్పంటుకుని పూరిల్లు దగ్ధమైన సంఘటనలో ఓ మహిళ సజీవ దహనం కాగా ఆమె భర్తకు తీవ్రగాయాలయ్యాయి. పోలీసుల కథనం ప్రకారం చేబ్రోలు గ్రామంలోని అప్పాపురం ఛానల్ సమీపంలో జీబీసీ రోడ్డు పక్కన పూరిగుడిసెలు వేసుకుని ఎస్టీలు నివశిస్తున్నారు.

02/21/2019 - 22:44

తెనాలి, ఫిబ్రవరి 21: గుంటూరు జిల్లా తెనాలి పట్టణం సాలిపేటలో ఓ యువతి తండ్రి వయస్సున్న వ్యక్తి చేతిలో దారుణ హత్యకు గురైంది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం భట్టిప్రోలుకు చెందిన బిట్ర సుధాకర్, అదే గ్రామానికి చెందిన సత్యనారాయణ 20 సంవత్సరాలుగా స్నేహితులు. వీరి స్నేహం వ్యాపారం వరకు కొనసాగి సుధాకర్ చిరు వ్యాపారిగా, సత్యనారాయణ వడ్డీ వ్యాపారిగా తెనాలిలోని సాలిపేటలో కుటుంబ సభ్యులతో స్థిరపడ్డారు.

02/21/2019 - 22:44

యడ్లపాడు, ఫిబ్రవరి 21: యడ్లపాడు మండలం కొత్తపాలెం గ్రామంలో ఈనెల 18వ తేదీన మృతిచెందిన రైతు కోటయ్య కేసుకు సంబంధించి పోలీసుశాఖ ఉన్నత స్థాయి అధికారులతో దర్యాప్తు ప్రారంభించింది. గుంటూరు జిల్లా అడిషనల్ ఎస్పీ వరదరాజు గురువారం సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఈయన నేతృత్వంలో నరసరావుపేట డీఎస్పీ, చిలకలూరిపేట, వినుకొండ రూరల్ సీఐలు, సిబ్బందితో సంఘటనా స్థలాన్ని పరిశీలించారు.

02/21/2019 - 04:43

హైదరాబాద్, ఫిబ్రవరి 20: ఎన్నారై చిగురిపాటి జయరాం హత్య కేసులో పోలీస్ అధికారుల ప్రమేయం ఏమేరకు ఉంది అన్న కోణంలో కేసుపై విచారణ వేగవంతం చేస్తున్నామని అధికారులు చెప్పారు. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న పోలీస్ అధికారును బుధవారం బంజారా హిల్స్ ఏసీపీ కార్యాలయంలో విచారించారు.

02/21/2019 - 04:48

విజయవాడ (క్రైం): రాష్ట్ర పర్యాటక శాఖ మేనేజింగ్ డైరెక్టర్ కార్యాలయంలో పనిచేస్తున్న ఎస్టేట్ ఆఫీసర్ రాచూరి శివరావు (55) ఇళ్లలో అవినీతి నిరోధక శాఖ అధికారులు బుధవారం సోదాలు నిర్వహించారు.

02/21/2019 - 04:33

నర్సీపట్నం, ఫిబ్రవరి 20: స్థానిక మున్సిపల్ కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టిన ఐదు రోజుల్లోనే అవినీతి నిరోధక శాఖ అధికారులు సోదాలు నిర్వహించడం కలకలం రేపింది. విశాఖ జిల్లా నర్సీపట్నం మున్సిపల్ కమిషనర్ హనుమంతు శంకర్రావుకు ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయనే ఫిర్యాదుల మేరకు ఈతనిఖీలు జరిగాయి. బుధవారం ఉదయం ఆరున్నర గంటలకు నర్సీపట్నం చేరుకున్న ఏసీబీ అధికారుల బృందం కమిషనర్ ఉంటున్న లాడ్జీకి వెళ్ళి తనిఖీలు చేసారు.

Pages