-
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్లో స్థానిక ఎన్నికల వాయిదాను సవాల్ చేస్తూ సుప్రీం కోర
-
గుంటూరు లీగల్: రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పదవీకాలం విషయంలో ఆర్డినెన్స్ అంశంపై పల
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
క్రైమ్/లీగల్
ఇంద్రకీలాద్రి, సెప్టెంబర్ 11: ఇంద్రకీలాద్రిపై గోశాలలో విధులు నిర్వహిస్తున్న ఒక అర్చకుడు మంగళవారం ఉదయం శ్రీ మల్లికార్జున మహామండపంపై నుంచి దూకేందుకు ప్రయత్నం చేశారు. దుర్గగుడి దేవస్థానం ఆధ్వర్యంలోని ఘాట్రోడ్పై గోశాలలో మంగళపల్లి రామారావు అర్చకుని విధులు నిర్వహిస్తున్నారు.
జగ్గంపేట, సెప్టెంబర్ 11: నెల్లూరు పట్టణాకి చెందిన మంగళపూడి సుబ్బారెడ్డి ఈనెల 9న జగ్గంపేటలో పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. అతనిని స్థానిక ప్రెవేటు ఆస్పత్రిలో చేర్పించగా కాలిన గాయాలతో చికిత్స పొందుతున్నాడు.
చర్ల, సెప్టెంబర్ 11: మండల పరిధిలోని ఎదురుగుట్టల వద్ద మంగళవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో పాల్వంచకు చెందిన ఇద్దరు జెన్కో ఉద్యోగులు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ప్రమాదంలో చింతా వెంకటేష్ (25), ప్రవీణ్ (23) మృతి చెందారు. వీరిద్దరూ తమ కారులో వెంకటాపురం వైపు వెళుతుండగా ఎదురుగుట్ట మలుపు వద్ద అదుపుతప్పిన వీరి కారు అక్కడవున్న వంతెనను ఢీకొని వాగులో పడిపోయింది.
రాచర్ల, సెప్టెంబర్ 11: మైనర్ బాలికపై పైచాచికంగా అత్యాచారానికి పాల్పడ్డ నిందితుడు రంగస్వామిని అరెస్టు చేసినట్లు మార్కాపురం డివైఎస్పి రామాంజనేయులు, ఎస్ఐ నాగశ్రీను తెలిపారు. మంగళవారం పోలీసుస్టేషనును రామాంజనేయులు సందర్శించారు.
ఎల్ ఎన్పేట, సెప్టెంబర్ 11: మండలంలోని గార్లపాడు వంశధార పునరావాస కాలనీ వీ ఆర్ ఏగా పనిచేస్తున్న యాగాటి లక్షుమమ్మ (73) అనే వృద్ధురాలు మంగళవారం ఏబీ రహదారిపై జరిగిన ప్రమాదంలో మృతి చెందారు. వంశధార రిజర్వాయర్ నిర్మాణం మూలంగా తులగాం గ్రామం ముంపు కావడంతో మల్లిఖార్జునపురం సమీపంలో పునరావాస కాలనీలో నివసిస్తున్నారు.
ధర్మవరం, సెప్టెంబర్ 11: పట్టణంలోని శారదా నగర్కు చెందిన చంద్రకళ (24) అనే వివాహిత మంగళవారం ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు చంద్రకళకు శారదానగర్లో నివాసముంటున్న శ్రీనివాసులుకు గత ఏడు నెలల క్రితం వివాహమైంది. శ్రీనివాసులు అనంతపురంలోని ఓ స్టూడియోలో పనిచేస్తూ రోజూ ఇంటికి వచ్చిపోయేవాడు.
చెనే్నకొత్తపల్లి, సెప్టెంబర్ 11 : రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందిన సంఘటన మండల పరిధిలోని యర్రంపల్లి పెట్రోలుబంకు వద్ద మంగళవారం ఉదయం చోటు చేసుకుంది. రామగిరి సీఐ యుగంధర్, ఎస్ఐలు మహమ్మద్ఫ్రీలు తెలిపిన వివరాలు ఇలా వున్నాయి. బెంగళూరు నుండి హైదరాబాద్ వెళ్తున్న కారు అతివేగంగా రావడంతోపాటు అడ్డుగా వచ్చిన కుక్కను తప్పించబోయి గ్రామానికి చెందిన సైకిల్పై వెళ్తున్న గాలి శ్రీరామరెడ్డిని ఢీకొట్టింది.
పెద్దవడుగూరు, సెప్టెంబర్ 11: మండల కేంద్రానికి చెందిన రాఘవేంద్ర (38) మంగళవారం పురుగుల మందు సేవించి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రాఘవేంద్ర తనకున్న ఎకరం పొలంతోపాటు మరో నాలుగు ఎకరాలు కౌలుకు తీసుకుని జీవనం సాగించేవాడు.
శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 10: గచ్చిబౌలి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు జనం పైకి దూసుకెళ్ళడంతో ముగ్గురు వ్యక్తులు దుర్మరణం పాలయ్యారు. సాఫ్ట్వేర్ ఇంజనీర్తో సహా ఇద్దరు ఆటో డ్రైవర్లు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ముగ్గురిని బలిగొన్న బస్సు డ్రైవర్ ప్రమాదం జరిగిన వెంటనే బస్సు దిగి పారిపోయాడు. రాయదుర్గం పోలీసుల కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి.
ఉప్పల్, సెప్టెంబర్ 10: విద్యుదాఘాతంతో కూలీ మృతి చెందిన సంఘటన మేడిపల్లి పోలీసుస్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం రామంతాపూర్ పాత బస్తీలో నివసిస్తున్న విజయనగరం జిల్లా బొబ్బిలికి చెందిన ఆర్.వెంకటరమణ (38) కూలీ. అతడు సోమవారం బోడుప్పల్లో నిర్మాణంలో ఉన్న భవనంపై కర్ర లేపుతుండగా ప్రమాదశాత్తు పక్కనే ఉన్న విద్యుత్ వైర్లకు తాకి విద్యుత్ షాక్ తగిలింది.