S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్/లీగల్

09/10/2018 - 23:37

యాదగిరిగుట్ట రూరల్, సెప్టెంబర్ 10: గత నెల రోజులుగా రాచకొండ కమిషనర్ మహేష్ భగవత్ ఆదేశాల మేరకు వ్యభిచార గృహాలలో ముస్కాన్ ఆపరేషన్‌తో వ్యభిచార నిర్వాహకులను అదుపులోకి తీసుకుని విచారించి అక్రమంగా వ్యభిచారం నిర్వహిస్తూ బాలికలను వ్యభిచార వృత్తిలోకి దింపుతుప్ప 8 మందిపై పీడీ చట్టం నమోదు చేసినట్లు భువనగిరి డీసీపీ రాంచంద్రారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.

09/10/2018 - 23:35

మునగాల, సెప్టెంబర్ 10: భూతగాదాల్లో జరిగిన ఘర్షణ వ్యక్తి మృతికి దారితీసిన సంఘటన మండల పరిధిలోని బరాఖత్‌గూడెంలో సోమవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన ఎస్‌కే మల్సూర్, ఎస్‌కే. దస్తగిరి, ఎస్‌కే. టెంటూసాహెబ్‌లు స్వయాన అన్నదమ్ములు. కాగా దస్తగిరి తన కూతురు సహేరా వివాహ నిమిత్తమై తన 30 సెంట్ల వ్యవసాయ భూమిని తన అన్న మల్సూర్‌కు విక్రయించాడు.

09/10/2018 - 23:27

పటన్‌చెరు, సెప్టెంబర్ 10: పట్టణంలోని గౌతంనగర్ కాలనీలో ఓ ఇంట్లో జరిపిన సోదాలలో 42.3 కిలోల గంజాయి పట్టుబడింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం సంగారెడ్డి ఎక్సైజ్ ట్రాస్క్ఫోర్సు అధికారులు ఆదివారం రాత్రి పొద్దుపోయిన తరువాత జరిపిన దాడులలో భారీగా గంజాయి పట్టుబడగా ఇద్దరు నిందితులు పరారయ్యారు. దీనికి సంబంధించిన వివరాలను పటన్‌చెరు ఎక్సైజ్ అధికారులు తెలియచేసిన ప్రకారం క్రింది విధంగా ఉన్నాయి.

09/10/2018 - 23:12

భైంసా రూరల్, సెప్టెంబర్ 10: నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలోని నర్సింహానగర్, రాజీవ్‌నగర్, సాయినగర్‌లలో వేకువజామున నుండే పోలీసులు కార్డెన్‌సెర్చ్ నిర్వహించారు. ఉన్నతాధికారుల ఆదేశాలమేరకు కార్డెన్‌సెర్చ్ నిర్వహించామని పోలీసులు వెల్లడించారు. ఇందులో భాగంగానే సరైన దృవపత్రాలులేని 120 ద్విచక్ర వాహనాలు, 2 ఆటోలు, అక్రమంగా నిషేదించిన గుట్కాను పట్టుకున్నారు. అలాగే పలు దుకాణాల్లో తనిఖీలు చేశారు.

09/10/2018 - 23:02

పెద్దదోర్నాల, సెప్టెంబర్ 10: అనుమతులు లేకుండా అక్రమంగా నిల్వ ఉంచిన టపాసులను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై రామకోటయ్య పాత్రికేయులకు తెలిపారు.

09/10/2018 - 22:58

అనంతసాగరం, సెప్టెంబర్ 10 : మండలంలోని పడమటికంభంపాడు గ్రామానికి చెందిన దాసరి పెంచలయ్య (54) విద్యుదాఘాతానికి గురై సోమవారం మృతిచెందాడు. గ్రామస్థులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. కరంటు పనులు చేసుకుని జీవనం సాగిస్తున్న పెంచలయ్య సోమవారం వాటర్ మోటారుకు మరమ్మతులు చేస్తుండగా విద్యుత్ షాక్‌కు గురై అక్కడికక్కడే స్పృహ కోల్పోయాడు.

09/10/2018 - 22:51

కల్లూరు, సెప్టెంబర్ 10: కల్లూరు-పీలేరు జాతీయ రహదారి వెంకటదాసరపల్లి పంచాయతీ చెరుకువారిపల్లి బస్‌స్టాప్ సమీపంలో సోమవారం మధ్యాహ్నం ఆర్టీసీ బస్సు- కారు ఢీకొన్న ప్రమాదంలో తెలంగాణ రాష్ట్రానికి చెందిన భార్యాభర్త మృతి చెందగా ఒకరు స్వల్పగాయాలతో సురక్షితంగా బయటపడినట్లు కల్లూరు ఎస్‌ఐ విశ్వనాధనాయుడు తెలిపారు. ఎస్‌ఐ తెలిపిన వివరాల మేరకు...

09/10/2018 - 22:44

నంబులపూలకుంట, సెప్టెంబర్ 10: మండల పరిధిలోని పీ.కొత్తపల్లి పంచాయతీ మల్లెంవారిపల్లి గ్రామానికి చెందిన డేరంగుల రామాంజులు (43) సోమవారం పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. మల్లెంవారిపల్లికి చెందిన రామాంజులు భార్య గతంలో మృతి చెందిందని, అతనికి ముగ్గురు పిల్లలు వుండడంతో కుటుంబ సమస్యలు కారణంగా పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

09/10/2018 - 22:35

సత్తెనపల్లి, సెప్టెంబర్ 10: ద్విచక్రవాహనాన్ని కారు ఢీ కొట్టిన సంఘటనలో ఒకరు తీవ్రంగా గాయాలపాలై విషమపరిస్థితి నెలకొనగా, మరో వ్కక్తి స్వల్పగాయాలతో బైటపడ్డాడు. సత్తెనపల్లి- నరసరావుపేట చెక్‌పోస్టు వద్ద సోమవారం ఈ ప్రమాదం జరిగింది. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం వినాయక చవితిని పురస్కరించుకొని గణేష్‌ని విగ్రహాన్ని కొనుగోలుచేసి తీసుకెళ్లేందుకు అచ్చంపేట మండలం తాళ్ళచెరువు గ్రామస్థులు సత్తెనపల్లి వచ్చారు.

09/10/2018 - 22:21

ఆచంట, సెప్టెంబర్ 10: పౌర సరఫరా, రెవిన్యూ శాఖాధికారులు శనివారం రాత్రి ఆకస్మిక దాడులు నిర్వహించి పెనుగొండ మునసుబుగారి వీధిలోని చేకూరి శ్రీనివాసరావు ఇంటి ఆవరణలో అక్రమంగా నిల్వ చేసిన 15 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నట్టు తహసీల్దార్ బొడ్డు శ్రీనివాసరావు తెలిపారు.

Pages