S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్/లీగల్

09/04/2018 - 04:19

హైదరాబాద్: నగరంలోనే కాదు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన గోకుల్‌ఛాట్, లుంబినీ పార్కు జంట బాంబు పేలుళ్ళ కేసుపై మంగళవారం తీర్పు వెలువడనున్నది. చర్లపల్లి సెంట్రల్ జైలులో ఉన్న నిందితులను సెషన్స్ జడ్జి శ్రీనివాస రావు చర్లపల్లి జైలు ప్రత్యేక కోర్టులో విచారించిన సంగతి తెలిసిందే. కాగా, రిజర్వ్‌లో ఉన్న తీర్పును మంగళవారం ప్రకటించే అవకాశం ఉంది.

09/03/2018 - 23:51

తోట్లవల్లూరు, సెప్టెంబర్ 3: వివాహం చేసుకోవాల్సిన వధూవరులు కల్యాణ మండపానికి వెళ్ళకుండా పోలీస్ట్‌షన్‌కు వెళ్ళారు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉనాయి. తోట్లవల్లూరు మండలం రొయ్యూరు గ్రామానికి చెందిన మేరుగ దివ్య(23)కు పామర్రు మండలం నిభానుపూడికి చెందిన అరిసే నాగశ్రీనుతో వివాహం నిశ్చయమయింది. జూన్ 22న అట్టహాసంగా ఎంగేజ్‌మెంట్ కార్యక్రమం జరిగింది.

09/03/2018 - 23:39

సిరిసిల్ల, సెప్టెంబర్ 3: చేసిన అప్పులు తీర్చలేక పోతున్నానంటూ ఓ గల్ఫ్ బాధితుడు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన వెలుగు చూసిం ది. సోమవారం తంగళ్ళపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని గోపాల్‌రావుపల్లెలో చెదురుమల్ల దేవయ్య (40) ఈ ఘటనకు పాల్పడినట్టు పోలీసులు తెలిపారు. గత 15 సంవత్సరాలుగా గల్ఫ్ దేశాలకు వెళ్ళగా ఇటీవలే దుబాయి దేశం వెళ్లి వచ్చిన దేవయ్యకు పని సరిగా లభ్యం కాకు ఇంటికి తిరిగి వచ్చాడు.

09/03/2018 - 23:23

బెల్లంపల్లి, సెప్టెంబర్ 3: అభం,శుభం తెలియని చిన్నారులను తల్లిదండ్రులు వారంరోజుల క్రితం పట్టణంలోని పాత క్లబ్ స్కూల్ ఆవరణలో వదిలిపెట్టి వెళ్ళిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆ చిన్న పిల్లల ఆలన పాలన మహ్మద్ ఖాసీం బస్తీ ప్రజలు చూస్తు న్నారు. ఈ విషయమై స్థానికులు శిశు రక్షణ శాఖ కేంద్రానికి ఆదివారం సమాచారం అందించారు.

09/03/2018 - 22:46

తిరుపతి, సెప్టెంబర్ 3: తిరుపతి కొర్లగుంట, తాతయ్యగుంట, వినాయక నగర్ ప్రాంతాల్లో రాత్రివేళల్లో చోరీలకు పాల్పడి 3 కేసులలో ముద్దాయిగా ఉండి తప్పించుకు తిరుగుతున్న తాతయ్యగుంట ప్రాంత నివాసి బొట్టు శీనును అరెస్ట్ చేశామని, అతని వద్ద నుంచి రూ. 3.06లక్షల విలువ చేసే 100 గ్రాముల బంగారు, 150 వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్లు క్రైం డీఎస్పీ రవిశంకర్‌రెడ్డి తెలిపారు.

09/03/2018 - 22:31

రాజుపాలెం, సెప్టెంబర్ 3: ఓ పురాతన భవనం వారి పాలిట మృత్యుశాపంగా మారింది. కూలి కోసం వచ్చిన కార్మికులు అదే గోడ కిందపడి అశువులు బాసిన విషాద సంఘటనతో మండలం ఉలిక్కిపడింది. రెప్పపాటులో జరిగిన ప్రమాదంలో ఇద్దరు కూలీలు భవన శిథిలాల కిందే సమాధి కాగా, మరో ఇద్దరు నెత్తురోడుతూ ఆసుపత్రుల పాలుకావాల్సి వచ్చింది. సంచలనం రేకెత్తించిన ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే...

09/03/2018 - 22:22

కాకినాడ సిటీ, సెప్టెంబర్ 3: కష్టించి సంపాధించిన విలువైన ఆస్తిని తన భార్య ఆమె మేనల్లుడుకి అప్పనంగా ఇస్తుందనే కోపంతో ఓ వ్యక్తి తన భార్యను హతమార్చాడు. ఈసంఘటన సోమవారం వేకువజామున స్థానిక రేచర్లపేటలో చోటుచేసుకుంది. హత్యా ఉదంతానికి సంబంధించి కాకినాడ డిఎస్పీ రవివర్మ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. స్థానిక రేచర్లపేటలో నరుకుర్తి నాగరాజు, అప్పయ్యమ్మ(60) అనే వృద్ద దంపతులు నివాసం ఉంటున్నారు.

09/03/2018 - 01:24

కర్లపాలెం/ నిజాంపట్నం, సెప్టెంబర్ 2: గుం టూరు జిల్లా కర్లపాలెం మండలం యాజలి గ్రా మంలో ఆదివారం చీప్ లిక్కర్ తాగిన దంపతులు మృతి చెందారు. పోలీసుల కథనం ప్రకారం.. రేపల్లె నియోజకవర్గంలోని నగరం మండలానికి చెందిన గంథం అంజి య్య, మరియమ్మ గ్రామాల్లో బొట్టుబిళ్లలు, బూరలు విక్రయిస్తూ, కూలిపనులు చేసుకుంటూ జీవనం సాగిస్తుంటారు.

09/03/2018 - 00:41

మైలవరం, సెప్టెంబర్ 2: కుమార్తె ఈడు అమ్మాయితో వివాహేతర సంబంధం పెట్టుకున్న చర్చి పాస్టర్‌ను మైలవరం పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు. పోలీసుల కధనం ప్రకారం జి కొండూరు మండలం కందులపాడుకు చెందిన మందా శామ్యూల్ వెలగలేరు మెట్రోపాలిటన్ చర్చిలో పాస్టర్‌గా సేవలందిస్తున్నాడు. ఇతనికి వివాహమై 20 ఏళ్ళ కుమార్తె కూడా ఉంది. ఈక్రమంలో భక్తిమాటున చర్చికి వస్తున్న రోజా అనే 21 ఏళ్ళ యువతితో చనువుగా ఉండటం మొదలెట్టాడు.

09/03/2018 - 00:27

యలమంచిలి, సెప్టెంబర్ 2: మండలంలో జాతీయ రహదారిపై ఆదివారం తెల్లవారు జూమున జరిగిన రోడ్డుప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. యలమంచిలి రూరల్ ఎస్‌ఐ డి. రాము కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్‌కు చెందిన కేటరింగ్ సిబ్బంది విశాఖపట్నం మధురువాడలో ఒక ఫంక్షన్ చూసుకొని తిరిగి హైదరాబాద్ వెళ్తున్నారు.

Pages