S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
అరుణాచల్ క్రియేషన్స్ పతాకంపై రూపొందుతున్న చిత్రం ‘జవాన్’. సాయిధరమ్ తేజ్, మెహ్రీన్ కౌర్ ఫిర్జాదా, ప్రసన్న కీలక పాత్రదారులు. ఈ సినిమాను కృష్ణ నిర్మిస్తున్నారు. ఇటీవల ప్రారంభమైన ఈ చిత్రం గురించి రాజు మాట్లాడుతూ,‘కథ చాలా బాగా కుదిరింది. కృషణ్ని నిర్మాతని చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటూ ఉన్నాం. అతనికి ఈ సినిమా పెద్ద సక్సెస్ కావాలి. ఇది మిలిటరీ కథ కాదు’ అని అన్నారు.
‘్ధృవ’ వంటి హిట్ మూవీ తర్వాత మెగాపవర్ స్టార్ రామ్చరణ్ హీరోగా శ్రీమంతుడు, జనతా గ్యారేజ్ వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలను నిర్మించిన ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్పై సుకుమార్ దర్శకత్వంలో నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్, మోహన్ చెరుకూరి (సి.వి.ఎం) నిర్మాతలుగా కొత్త చిత్రం హైదరాబాద్లో ప్రారంభమైంది.
మోహన్లాల్, బేబి మీనాక్షి, విమలారామన్ తారాగణంగా మలయాళంలో రూపొందించిన ఒప్పం చిత్రాన్ని తెలుగులో ఓవర్సీస్ నెట్వర్క్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై దిలీప్కుమార్ బొలుగోటి, శ్రీనివాసమూర్తి అందిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ఆడియోను హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్లో విడుదల చేశారు.
అల్లు అర్జున్, దర్శకుడు హరీష్శంకర్ల కాంబినేషన్లో రూపొందుతోన్న ‘డీజే’- దువ్వాడ జగన్నాథం సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఇప్పటికే 50 శాతం షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ సినిమాను ఎక్కడా భారీ బడ్జెట్తో దిల్రాజు నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ రామోజీ ఫిల్మ్సిటీలో జరుగుతుండగా, ఫస్ట్లుక్, విడుదల తేదీల విషయమై సమాచారం అందింది.
పాలిస్ డ్రోమ్ పక్చర్స్ పతాకంపై బి. భువన విజయ్ దర్శకత్వంలో కామెడీ సెటైర్గా రూపొందిన చిత్రం ‘వర్మ వర్సెస్ శర్మ. బాబ్ రతన్, బిందు బార్బీ జంటగా నటించగా గిరిబాబు, జూ. రేలంగి టైటిల్ రోల్స్ పోషించారు. సినిమా అన్ని కార్యక్రమాలు ముగించుకుని విడుదలకు సిద్ధంగా ఉంది.
వరుణ్ మణియన్.. ఈ పేరు ఎక్కడో విన్నట్టు అనిపిస్తుంది కదా..! కోలీవుడ్లో నిర్మాతగా పేరుతెచ్చుకున్న ఈయన- గ్లామర్ భామ త్రిషను పెళ్లిచేసుకోనున్నట్లు నానా హంగామా జరిగిన విషయం తెలిసిందే. కొంతకాలంపాటు త్రిషతో ప్రేమాయణం సాగించిన వరుణ్ ఆ తరువాత ఎక్కడా కనిపించలేదు. త్రిషతో నిశ్చితార్థం జరిగి, పెళ్లి దగ్గర పడ్డ సమయంలో అనుకోకుండా అది కాన్సిల్ అయింది. ఆ తరువాత త్రిష సినిమాలతో బిజీ అయింది.
‘రంగం’ వంటి సూపర్హిట్ మూవీతో తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకున్న జీవా హీరోగా, కాజల్ అగర్వాల్ హీరోయిన్గా రూపొందుతోన్న రొమాంటిక్ కామెడి ఎంటర్టైనర్ ‘కవలై వేండాం’. ఈ చిత్రాన్ని తెలుగులో ‘ఎంతవరకు ఈ ప్రేమ’ పేరుతో విడుదల చేస్తున్నారు. ‘యామిరుక్క బయమేన్’ ఫేమ్ డీకే దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం నిర్మాణాంతర కార్యక్రమాలను పూర్తి చేసుకుంది.
ప్రముఖ నటుడు సూర్య, అనుష్క, శృతిహాసన్ ముఖ్య పాత్రల్లో హరి దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో రూపొందిన భారీ చిత్రం సింగం-3. జనవరి 26న విడుదల కావాల్సిన ఈ చిత్రం అనుకోని కారణాలవలన వాయిదా పడుతూ ఫిబ్రవరి 9న విడుదలకు సిద్ధమైంది. ముఖ్యంగా తమిళనాడులో జల్లికట్టుకు సంబంధించిన ఆందోళనలు జరిగిన నేపథ్యంలో చిత్రాన్ని వాయిదా వేశారు.
ప్రముఖ నటుడు చిరంజీవి రీ ఎంట్రీ ఇస్తూ నటించిన ఖైదీ నెంబర్ 150 చిత్రం బాక్సాఫీసువద్ద దూసుకుపోతూ వంద కోట్ల వసూళ్లు రాబట్టింది. ఈ సినిమాతో గ్రాండ్ రీ ఎంట్రీ దక్కించుకున్న చిరంజీవి తన తదుపరి చిత్రానికి అప్పుడే సన్నాహాల్లో స్పీడ్ పెంచారు. ఆయన 151వ చిత్రంగా ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథతో సినిమా చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.
ప్రస్తుతం దక్షిణాది పరిశ్రమలో సీక్వెల్ మానియా పట్టుకుంది. ఒక చిత్రం సంచలన విజయం సాధించడంతో దానికి సీక్వెల్గా మరో చిత్రాన్ని రూపొందించి విజయాన్ని అందుకోవడమే ఈ సీక్వెల్స్ లెక్క. ఈ ఏడాది సీక్వెల్స్ సినిమాల హవా జోరుమీదుంది.