S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాటపాడిన యముడు

తెలుగు, తమిళ భాషల్లో సూర్య కథానాయకుడిగా స్టూడియో గ్రీన్ పతాకంపై కె.ఇ.జ్ఞానవేల్‌రాజా సమర్పణలో సుర ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మాత మల్కాపురం శివకుమార్ అందిస్తున్న చిత్రం ‘యముడు-3’ (సింగం-3). ఈ చిత్రానికి సంబంధించిన పాటలు ఆదివారం ఆన్‌లైన్‌లో విడుదలకానున్నాయి. చిత్రాన్ని అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి ఈనెల 23న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా మల్కాపురం శివకుమార్ మాట్లాడుతూ- అభిమానులకు ఓ ప్రత్యేక హీరోగా మారిన సూర్య, దర్శకుడు హరి కాంబినేషన్‌లో రూపొందిన యముడు, సింగం చిత్రాలు ఘనవిజయం

బౌద్ధం అవసరాన్ని చాటిన ‘బుద్ధ జయంతి’ ( పుస్తక సమీక్ష)

ప్రతులకు:
అద్దంకి బుద్ధచంద్రదేవ్
ప్రియదర్శిని బాలవిహార్
కొత్తపేట
తూ.గో.జిల్లా
సెల్: 9989244202
పేజీలు: 60, వెల: రూ.50/-
**

- రవికాంత్, సెల్; 9642489244

తండ్రీకూతుళ్ల అనుబంధం తెలిపే బాయ్‌ఫ్రెండ్స్

‘కుమారి 21ఎఫ్’తో సంచలన కథానాయికగా మారింది హెబ్బాపటేల్. ‘అలా ఎలా’ సినిమాతో కెరీర్ ప్రారంభించిన ఈమెకు ‘కుమారి 21ఎఫ్’ చిత్రం టాలీవుడ్‌లో ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. ఆ తరువాత మరో రెండు చిత్రాల్లో నటించి వరుస విజయాలతో దూసుకుపోతున్న హెబ్బా, తాజాగా నటిస్తున్న చిత్రం ‘నాన్న నేను నా బాయ్‌ఫ్రెండ్స్’. ఆసక్తికర కథాంశంతో రూపొందుతున్న ఈ చిత్రానికి భాస్కర్ దర్శకుడు. లక్కీ మీడియా పతాకంపై బెక్కం వేణుగోపాల్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఈనెల 16న విడుదలవుతున్న సందర్భంగా హీరోయిన్ హెబ్బాపటేల్ చెప్పిన విశేషాలు..

-శ్రీ

డ్రగ్స్‌కు బానిసై బయటపడ్డా.. నటుడు భానుచందర్

కృష్ణచైతన్య, భానుచందర్, భానుప్రియ ముఖ్యపాత్రల్లో రవికిరణ్ దర్శకత్వంలో శ్రీలక్ష్మీ నరసింహ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై కె.ఎల్.ఎన్.ప్రసాద్ నిర్మిస్తున్న స్టూడెంట్ నెంబర్‌వన్ చిత్రం శనివారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి నటుడు భానుచందర్ క్లాప్‌నివ్వగా, సీనియర్ పాత్రికేయులు పసుపులేటి రామారావు కెమెరా స్విచ్చాన్ చేశారు. దర్శకుడు దేవిప్రసాద్ గౌరవ దర్శకత్వం వహించారు.

16న చిన్నారి విడుదల

ఉపేంద్ర సతీమణి ప్రియాంక కీలక పాత్రలో నటించిన కన్నడ చిత్రం ‘మమీ’. తెలుగులో ‘చిన్నారి’ పేరుతో ఈనెల 16న విడుదల కానుంది. గతవారం కన్నడలో విడుదలైన ఈ చిత్రం సంచలన విజయాన్ని సాధించింది. ఇంకా హౌస్‌ఫుల్‌గా సాగుతోంది. బేబి యులీనా పార్థవి, ఐశ్వర్య, మధుసూదన్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రాన్ని తెలుగులో కె.ఆర్.కె.ప్రొడక్షన్స్, లక్ష్మీ వెంకటేశ్వర మూవీస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. కె.రవికుమార్, ఎం.ఎం.ఆర్. నిర్మాతలు. తెలుగు, కన్నడంలో ఏకకాలంలో రూపొందించారు. లోహిత్ దర్శకత్వం వహిస్తున్నారు. దర్శకుడు మాట్లాడుతూ ’నాకు దర్శకుడిగా తొలి చిత్రమిది. హారర్ జోనర్‌లో చాలా డిఫరెంట్‌గా ట్రై చేశాం.

సావిత్రి పాత్రలో సమంత

తెలుగు తెరపై చెరగని ముద్రవేసిన నటీమణి ఎవరంటే అందరూ చెప్పే సమాధానం ఒక్కటే- అది మహానటి సావిత్రి. పాత్రలో లీనమై నటించి ప్రేక్షకుల హృదయాల్ని రంజింపచేయగల ఈమె జీవితం తెరపైకి వస్తోంది. ఈమధ్యే ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ సినిమాతో దర్శకుడిగా పేరు తెచ్చుకున్న నాగ్ అశ్విన్ రూపొందించే ఈ సినిమా త్వరలో సెట్స్‌పైకి రానుంది. ఇప్పటికే సావిత్రి జీవితానికి సంబంధించిన సమాచారాన్ని సేకరించాడని, దానికి సంబంధించిన స్క్రిప్ట్‌వర్క్ కూడా పూర్తయినట్టు తెలిసింది. అయితే, ఈ పాత్రలో ఎవరు నటిస్తారనే విషయం ఆసక్తికరంగా మారింది. ఆమధ్య బాలీవుడ్ హీరోయిన్ విద్యాబాలన్ నటిస్తుందంటూ వార్తలొచ్చాయి.

వృద్ధాప్య వేదనకు నిలువుటద్దం... నాలుగో పాదం! (కొత్త పుస్తకం)

వృద్ధాప్య వేదనకు నిలువుటద్దం... నాలుగో పాదం!
పేజీలు: 60; వెల : 40/-
ప్రతులకు:
దాట్ల దేవదానం రాజు
8-1-048
జక్రియా నగర్
యానాం - 533464
సెల్.నం.9440105987
**

- దాస్యం సేనాధిపతి కరీంనగర్, సెల్.నం.9440525544

తప్పుదిద్దుకునేలా చేసిన ప్రేమ

రోషన్, ఆర్తీ జంటగా సుచేత డ్రీమ్ వర్క్స్ పతాకంపై అళహరి దర్శకత్వంలో విశ్వాస్.హెచ్. రూపొందించిన చిత్రం ‘ప్లస్ ఒన్’. ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్‌ను ఇటీవల హైదరాబాద్‌లో విడుదల చేశారు. ఈ సినిమాను అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి త్వరలో విడుదల చేయడానికి సన్నాహాలు జరుపుతున్నారు.

ఇది ప్రేమేనా?

యన్నమలల్ ఆర్ట్ క్రియేషన్స్ పతాకంపై సుప్రీమ్, పావని జంటగా కిషన్ కన్నయ్య స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం ‘ఇది ప్రేమేనా’. ప్రస్తుతం సెన్సార్ పనులు జరుగుతున్నాయి. త్వరలో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నామని అన్నారు. హీరో సుప్రీమ్ మాట్లాడుతూ- ‘విచక్షణ’ అనే చిత్రంలో సెకెండ్ హీరోగా నటించానని, సోలో హీరోగా చేస్తోన్న తొలి చిత్రమని, అందరూ ఆదరించాలని అన్నారు. చిత్ర దర్శక నిర్మాత కిషన్ కన్నయ్య మాట్లాడుతూ ఇదొక యూత్‌ఫుల్ లవ్‌స్టోరీ అని, మూడు షెడ్యూల్స్‌లో షూటింగ్ పూర్తిచేశామని అన్నారు.

రూ.7 కోట్లు ఇస్తేనే నటిస్తా?

సౌత్‌లో క్రేజీ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్న నయనతార, ఓవైపు స్టార్ హీరోల సినిమాల్లో నటిస్తూనే మరోవైపు విభిన్నమైన కానె్సప్టులతో యువ హీరోలతో జతకడుతూ దూసుకుపోతోంది. ఇప్పటికే వరుస సినిమాలు చేస్తున్న ఈమె, రెమ్యూనరేషన్ విషయంలో కూడా సంచలనం రేపుతోంది. సౌత్‌లో ఇప్పటివరకూ ఏ హీరోయిన్ తీసుకోని పారితోషికాన్ని డిమాండ్ చేస్తోంది. ప్రస్తుతం నయనతార ఒక్కో సినిమాకు మూడునుండి నాలుగు కోట్ల వరకు వసూలు చేస్తోంది. ప్రస్తుతం ఆమెకు వున్న క్రేజ్ అలాంటిది కావడంతో దర్శక నిర్మాతలు కూడా ఇవ్వడానికి సిద్ధమవుతున్నారు. ఇక బాలీవుడ్‌లో అయితే హీరోయిన్ల రెమ్యూనరేషన్ ఐదు కోట్ల వరకూ వుంటుంది.

Pages