మనకున్నది దౌర్భాగ్య ప్రతిపక్ష నేత
Published Monday, 28 November 2016రాజమహేంద్రవరం, నవంబర్ 27: పట్టిసీమ ప్రాజెక్టును రికార్డు స్థాయిలో పూర్తి చేసి ఇటు పశ్చిమ గోదావరి జిల్లాకు, అటు కృష్ణా డెల్టాలకు గోదావరి జలాలను అందించడం వల్ల రూ.250 కోట్ల విలువైన పంట దక్కిందని, అటువంటి ప్రాజెక్టయిన వట్టిసీమను విమర్శించిన నాయకులు ఇపుడు ఏమంటారని రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి దేవినేని అన్నారు. ఉత్తమ కుమార ప్రగల్భాలు పలికిన వైఎస్ జగన్ రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. ఇటువంటి నేత ప్రతిపక్ష నేతగా ఉండటం దౌర్భాగ్యమని విమర్శించారు.