నగదు రహితంగా వంటగ్యాస్ పంపిణీ
Published Monday, 28 November 2016కాకినాడ, నవంబర్ 27: వంట గ్యాస్ సిలెండర్లను ఇక నుండి నగదు రహిత బదిలీ ప్రక్రియ ద్వారానే సరఫరా చేయాలని ప్రభుత్వం ఆదేశించడంతో ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు తూర్పు గోదావరి జిల్లాలో చకచగా జరుగుతున్నాయి. గ్యాస్ సిలెండర్లు సరఫరా చేసే ఎల్పిజి డీలర్లు విధిగా నగదు రహిత బదిలీని పాటించేలా ఆదేశాలు జారీ అయ్యాయి. జిల్లాలోని సుమారు 13 లక్షలమంది గ్యాస్ వినియోగదారులకు ఇకపై నగదు బదిలీ ద్వారానే వంట గ్యాస్ను అందించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. దీంతో కచ్చితమైన ధరకే వినియోగదారుడి ఇంటికి గ్యాస్ సిలెండర్ చేరే అవకాశం కూడా ఉంది. అంటే గ్యాస్ డెలివరీ బాయ్ల చేతివాటానికి తెర పడనుంది.