మహిళల హాకీ
Published Monday, 28 November 2016మెల్బోర్న్, నవంబర్ 27: ఆస్ట్రేలియా టూర్కు వెళ్లిన భారత మహిళల హాకీ జట్టు ఆదివారం జరిగిన చివరి, మూడో టెస్టులో 1-3 తేడాతో పరాజయాన్ని చవిచూసింది. ఈ సిరీస్లో చెరొక విజయాన్ని సాధించిన భారత్, ఆస్ట్రేలియా మహిళలు చివరి మ్యాచ్లో అమీతుమీ తేల్చుకునేందుకు బరిలోకి దిగారు. ఇరు జట్లు వ్యూహాత్మకంగా ఆడడంతో మొదటి క్వార్టర్లో ఒక్క గోల్ కూడా నమోదు కాలేదు. రెండో క్వార్టర్లో దీపిక, రాణి కలిసి బంతిని డ్రిబ్లింగ్ చేస్తూ ముందుకు తీసుకెళ్లారు. ఆసీస్ గోల్ పోస్టు సమీపంలో దానిని వందన కతారియాకు పాస్ చేశాడు. ఆమె దానిని సమర్తంగా గోల్ పోస్టులోకి పంపించి, భారత్కు 1-0 ఆధిక్యాన్ని అందించింది.