దీన్దయాళ్కు ఘన నివాళి
Published Monday, 26 September 2016మచిలీపట్నం (కోనేరుసెంటర్), సెప్టెంబర్ 25: స్థానిక బిజెపి కార్యాలయంలో ఆదివారం భారతీయ జనసంఘ్ వ్యవస్థాపకులు దీన్దయాళ్ ఉపాధ్యాయ శత జయంతిని ఘనంగా నిర్వహించారు. దీన్దయాళ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. జనసంఘ్ బలోపేతానికి ఆయన చేసిన సేవలను కొనియాడారు. అనంతరం చిలకలపూడిలోని అన్నపూర్ణ వృద్ధాశ్రమంలో వృద్ధులకు పండ్లు, రొట్టెలు పంపిణీ చేశారు.