ప్యాకేజీ స్పష్టం చేస్తేనే ఆర్అండ్ఆర్ సర్వే జరగనిస్తాం
Published Monday, 26 September 2016వేలేరుపాడు, సెప్టెంబర్ 25: వేలేరుపాడు మండలంలో అక్టోబర్ 1వ తేదీ నుంచి ప్రభుత్వం చేపట్టనున్న ఆర్అండ్ఆర్ సర్వేను ప్యాకేజీ స్పష్టం చేస్తేనే జరగనిస్తామని అఖిలపక్ష నాయకులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వేర్వేరుగా ఏర్పాటుచేసిన వివిధ సమావేశాల్లో ఆయా పార్టీల నాయకులు మాట్లాడుతూ వేలేరుపాడు మండలానికి 2007లోనే పోలవరం భూసేకరణ చేపట్టి కేవలం ఎకరానికి లక్షా 15 వేల రూపాయలే ఇచ్చి, అందులోనే బ్యాంకు రుణాలు జమ చేసుకుని తీరని నష్టం చేశారని, ప్రస్తుతం ఆర్అండ్ఆర్ ప్యాకేజీలో సైతం పాత చట్టంతోనే అందించాలని ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తున్నదని అన్నారు.