జిల్లా అభివృద్ధికి సమష్ఠి కృషి అవసరం
Published Friday, 5 August 2016విజయనగరం, ఆగస్టు 4: జిల్లాలో పనిచేస్తున్న వివిధ శాఖల అధికారులు తాము కష్టపడి పనిచేయడంతోపాటు క్షేత్రస్థాయి సిబ్బంది కూడా సక్రమంగా పనిచేసేలా చూడాలని గృహనిర్మాణ, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ కిమిడి మృణాళిని సూచించారు. అన్ని స్థాయిల్లో అధికారులు, సిబ్బంది కష్టపడితేనే వెనుకబడిన విజయనగరం జిల్లాను అన్ని రంగాలలో అభివృద్ధి చేసేందుకు అవకాశం ఉంటుందన్నారు. తమ ప్రభుత్వం ఏర్పడిన ఈ రెండేళ్లల్లో వివిధ కార్యక్రమాల అమలులో కొన్ని సందర్భాల్లో అధికారుల కారణంగా కొన్ని తప్పులు జరిగినా సర్ధుకుపోయామని, ఇకనుంచి పథకాల అమలులో లోపాలను సహించేది లేదని మంత్రి స్పష్టం చేశారు.