చైనా కొత్త ఎత్తుగడ
Published Saturday, 23 July 2016పాకిస్తాన్ దురాక్రమిత కశ్మీర్-పీఓకే-లో చైనా దళాలు తిష్ఠవేసి ఉండడం పాతబడిన సమాచారం. చైనా, పాకిస్తాన్ దళాలు ఉమ్మడిగా ‘సరిహద్దు’ వెంబడి గస్తీ తిరుగుతుండడం సరికొత్త వ్యూహంలో భాగం. లడక్లో మన భద్రతా వ్యవస్థ పటిష్ఠమవుతున్న నేపథ్యంలో చైనా కమ్యూనిస్టు ప్రభుత్వం తలపెట్టిన సరికొత్త కవ్వింపు చర్య ఇది. చైనాకు, పాకిస్తాన్కు మధ్య సహజమైన సరిహద్దు లేదు. లేని సరిహద్దును పాకిస్తాన్ 1948-49వ సంవత్సరాలలో కృత్రిమంగా కల్పించగలిగింది. ఈ కృత్రిమమైన సరిహద్దును ఆ తరువాత వెడల్పు చేయగలిగింది. ఇదంతా మన ప్రభుత్వం 1960వ దశకం వరకు కూలబడి ఉండిన ఫలితం, దురాక్రమణకు ముందు మోకరిల్లిన ఫలితం.